ముప్పు తిప్పలు పెట్టిన ముఖ హాజరు
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పాఠాలు చెప్పే సమయం కంటే యాప్లతో పడే యాతనే ఎక్కువైంది. విద్యాశాఖ తాజాగా ముఖ ఆధారిత హాజరుకు శ్రీకారం చుట్టడంతో మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం పాఠశాలలకు
- ఉపాధ్యాయులను సతాయించిన యాప్
ఆదోని నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో యాప్ పని చేయకపోవడంతో చరవాణిలతో కుస్తీ పడుతున్న ఉపాధ్యాయులు
ఈనాడు - కర్నూలు : ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పాఠాలు చెప్పే సమయం కంటే యాప్లతో పడే యాతనే ఎక్కువైంది. విద్యాశాఖ తాజాగా ముఖ ఆధారిత హాజరుకు శ్రీకారం చుట్టడంతో మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం పాఠశాలలకు చేరుకున్న ఉపాధ్యాయులు ఆన్లైన్ హాజరుకు కుస్తీలు పట్టాల్సి వచ్చింది. సర్వర్ నెమ్మదిగా ఉండటం.. నెట్వర్క్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫలితంగా బోధనా కార్యకలాపాలకు ఆటంకం కలిగింది. యాప్ హాజరుపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
తొలిరోజు అవస్థలు
ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల కోసం విద్యాశాఖ ముఖ ఆధారిత హాజరు నమోదుకు ప్రత్యేక యాప్ తీసుకొచ్చింది. ‘‘ ఉపాధ్యాయులు యాప్ను తప్పని సరిగా చరవాణిలో డౌన్లోడ్ చేసుకోవాలి... దానిని నిత్యం ఓపెన్ చేసి హాజరు నమోదు చేసుకోవాలి.. ఉదయం తొమ్మిది గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా సగం రోజు సెలవుగా పరిగణిస్తాం.. అదేవిధంగా సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లే సమయంలోనూ హాజరు నమోదు చేయాలని’’ అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈనెల 16 నుంచి తప్పనిసరి చేయడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందారు. తొలిరోజు ఉదయం హాజరుకు ప్రయత్నిస్తే మధ్యాహ్నం యాప్లో అప్లోడ్ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వర్ నెమ్మదిగా ఉండటంతో చాలా చోట్ల హాజరు నమోదు కాలేదని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
నందికొట్కూరు మండలం కొణిదెల పాఠశాలలో హాజరుకు ఉపాధ్యాయుల ఇక్కట్లు
గ్రామీణ ప్రాంతాల్లో ఆటంకం
గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్య వేధిస్తోంది. ఆత్మకూరు, కొత్తపల్లి, వెలుగోడు, బండిఆత్మకూరు, మహానంది, ప్యాపిలి, కోసిగి వంటి చోట్ల సమస్య తీవ్రంగా ఉంది. నాణ్యమైన యంత్రాలు సమకూర్చి, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
గంటల తరబడి యాప్లతోనే
* ఉదయం తొమ్మిది గంటల్లోపే ముఖ ఆధారిత హాజరు వేయాలి. ప్రస్తుతం సర్వర్ నెమ్మదిగా ఉండటంతో హాజరు నమోదుకు ఎన్ని గంటలు నిరీక్షించాలో తెలియడం లేదు. తొమ్మిది తర్వాత నిమిషం ఆలస్యమైనా సగం రోజు సెలవుగా పరిగణిస్తారు.
* మరుగుదొడ్లు శుభ్రం చేయించిన చిత్రాలు తీసి టాయిలెట్ మానిటరింగ్ (టీఎంఎఫ్) యాప్లో అప్లోడు చేయాల్సి ఉంది. దీనికి దాదాపు 45 నిమిషాలు సమయం పడుతోంది.
* విద్యార్థుల హాజరునూ ముఖ ఆధారితంగానే వేయాల్సి ఉంటుంది. ఒక్క విద్యార్థికి అర నిమిషం పడుతుంది. ఒక పాఠశాలలో 60 మంది ఉంటే కనీసం అరగంట సమయం పడుతుంది. ఉమ్మడి జిల్లాలోని కొన్ని ఉన్నత పాఠశాలల్లో వెయ్యికిపైగా ఉన్నారు. ఆయా పాఠశాలల్లో ఎంత సమయం పడుతుందో అధికారులకే తెలియాలి. విద్యార్థి యాప్లో హాజరుతోపాటు, ఐఎంఎంఎస్లో రోజువారీ అటెండెన్స్లోనూ హాజరు వేయాల్సి ఉంటుంది.
* ఒకేసారి ఒకే సమయానికి ఉపాధ్యాయులందరూ ముఖ ఆధారిత హాజరుకు ప్రయత్నిస్తే సర్వర్ బలహీనంగా ఉండటంతో కష్టతరంగా మారింది. తీరా ఉదయం 9:05 గంటలకు ప్రార్థన ప్రారంభించి 9:15 గంటలకు తరగతి గదుల్లో విద్యార్థులను కూర్చొబెడతారు. మొదటి గంట చదువు చెప్పేదాని కంటే విద్యార్థుల హాజరు వేయడానికే సరిపోతుంది. ఆ తర్వాత మూత్రశాలలు, భోజన చిత్రాలు అప్లోడు చేయాల్సి ఉంటుంది. వీటిలో ఏ యాప్ మొరాయించినా ఉపాధ్యాయులకు నరకమే.
తిరుగుతూనే ఉంది
యాప్ పని చేయడం లేదని చరవాణులు చూపుతున్న ఉపాధ్యాయులు
యాప్ ఆధారిత హాజరుకు మంగళవారం డోన్ పట్టణం పాతపేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చరవాణిల ద్వారా డౌన్లోడ్ చేసుకునేందుకు ఉపాధ్యాయులు ప్రయత్నించారు. సర్వర్ ఓపెన్ కాకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందారు. విద్యార్థుల ఆన్లైన్ హాజరు, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన చిత్రాలను యాప్లో అప్లోడ్ చేసేందుకు సర్వర్ సక్రమంగా పని చేయకపోవడంతో వారు దిక్కు తోచని పరిస్థితిలో ఉండిపోయారు. ప్రభుత్వం తప్పనిసరి అనడంతో చరవాణులను ముందు పెట్టుకుని ఎంత ప్రయత్నిస్తున్నా సర్వర్ తిరుగుతూనే ఉందని వారు పేర్కొన్నారు. డోన్ తాలూకా ఫ్యాప్టో ఛైర్మన్ జి.వెంకటరమణ మాట్లాడుతూ.. గందరగోళంగా ఉన్న స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సిమ్స్) ఏపీ హాజరు యాప్ను ఇన్స్టాల్ చేసుకోవద్దని ఉపాధ్యాయులకు సూచించారు. ఉపాధ్యాయుల సొంత చరవాణుల్లో ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే వ్యక్తిగత డేటాకు భద్రత ఉండదని అభిప్రాయపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికీ చాలా మంది ఉపాధ్యాయులకు స్మార్ట్ ఫోన్లు లేవని, అందువల్ల ఈ యాప్ను వ్యతిరేకించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనిపై రాష్ట్ర ఫ్యాప్టో నాయకత్వం నుంచి స్పష్టమైన నిర్ణయం ఇచ్చే వరకు యాప్ను ఇన్స్టాల్ చేసుకోవద్దని ఉపాధ్యాయులను కోరారు.
- న్యూస్టుడే, డోన్ పట్టణం
ఆదోని పట్టణంలో నెహ్రూ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో 36 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా కేవలం ఇద్దరే యాప్లో హాజరు శాతం నమోదు చేశారు. యాప్ పని చేయక మిగిలిన వారు చరవాణితో కుస్తీ పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకూ యాప్ పని చేయలేదని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
- ఆదోని విద్య
ఆదోని పట్టణంలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 45 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా ఒక్కరూ యాప్లో నమోదు చేయలేకపోయారు. ఆదోని నియోజకవర్గంలో దాదాపు అన్ని పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. హాజరు కోసమే ఇంత కుస్తీ పడితే విద్యార్థులకు పాఠం ఎప్పుడు చెప్పాలని కొందరు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.
- ఆదోని విద్య
ఉమ్మడి జిల్లాలో
ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 2,825
ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు 13,458
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
మండలంలోని అల్లూరు వైకాపా నాయకులు శుక్రవారం అల్లూరు గ్రామంలో వైకాపాను వీడి తెదేపాలో చేరారు. -
సిద్దాపురం ఎత్తిపోతల ద్వార ప్రతి ఎకరాకు సాగు నీరందిస్తాం
[ 26-04-2024]
తెదేపా అధికారంలోకి రాగానే సిద్దాపురం ఎత్తిపోతల కాలువలు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగు నీరందిస్తామని నంద్యాల పార్లమెంట్ తెదేపా బాధ్యుడు మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్య అన్నారు. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి
[ 26-04-2024]
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా నాయకుడు డి.విష్ణువర్థన్ రెడ్డి పేర్కొన్నారు. -
బుగ్గన నామినేషన్ పెండింగ్లో ఉంచిన ఎన్నికల అధికారి
[ 26-04-2024]
డోన్ వైకాపా అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి నామినేషన్ను ఎన్నికల అధికారి పెండింగ్లో ఉంచారు. -
ఇంటింటికి తెలుగుదేశం
[ 26-04-2024]
పెద్దకడుబుర్ మండలం జాలవడి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
[ 26-04-2024]
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి కుంటు పడింది
[ 26-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి అన్ని రంగాల్లో కుంటుపడిందని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి
[ 26-04-2024]
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు.. తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినిగించుకోవాలని సీఐ రమేష్బాబు తెలిపారు. -
హంద్రీ నీవా కట్టపై జగన్ కనికట్టు
[ 26-04-2024]
దూదేకొండ, కోతిరాళ్ల, కొత్తపల్లి, కనకదిన్నె, వెలమకూరు, ఆర్.మండగిరి, జె.అగ్రహారం గ్రామాల రైతులకు చెందిన సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందివ్వాలి. -
చేనేతలను విస్మరించిన వైకాపా
[ 26-04-2024]
సీఎం జగన్ ప్రభుత్వంలో చేనేతలను పూర్తిగా విస్మరించి, ఓట్లు కోసం రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ డాక్టర్ సంజీవ్కుమార్ ఆరోపించారు. -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
[ 26-04-2024]
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
పచ్చని సీమ చేస్తానంటివి.. పచ్చిక లేకుండా చేస్తివి
[ 26-04-2024]
శ్రీశైలం కుడిగట్టు కాల్వ(ఎస్సార్బీసీ)ను 2003లో పూర్తి చేశారు. పాములపాడు మండలం బనకచెర్ల నుంచి అవుకు రిజర్వాయర్ వరకు విస్తరించి ఉంది. దీని పరిధిలో 1.90 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. -
గడప గడపనా జగన్ ధోకా
[ 26-04-2024]
దేవనకొండ మండలంలో రూ.7.7 కోట్లతో 209 పనులు మంజూరు చేయగా ప్రస్తుతం 91 వివిధ దశల్లో ఉండగా మిగిలినవి ప్రారంభమే కాలేదు. -
నాసిరకం విత్తన ముఠాల నాయకుడు పోచా : బైరెడ్డి
[ 26-04-2024]
: ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి నాసిరకం విత్తన ముఠాల లీడరని రైతులే చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. -
ఏకపక్ష పల్లెలు.. అధికారంలో గుబులు
[ 26-04-2024]
అవుకు మండలం గుండ్లశింగవరం బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సొంతూరు.. ‘అధికారం’ ఉపయోగించి అక్కడ ప్రతిసారి పోలింగ్ ఏకపక్షంగా నడిపిస్తున్నారు. -
గులాబీ రంగుల్లో మునిగితేలారు
[ 26-04-2024]
చిన్నహోతూరు గ్రామస్థులంతా గులాబీ రంగులో మునిగితేలారు. సిద్ధరామేశ్వరస్వామి ఉత్సవాల ముగింపు సందర్భంగా వసంతోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. -
టీజీ.. క్రేజీ
[ 26-04-2024]
కర్నూలు నగరం.. జనసంద్రమైంది. వేలాది మంది తెదేపా, జనసేన, భాజపా, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, తెదేపా అభిమానుల భారీ ర్యాలీ నడుమ తెదేపా కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. -
నిధులు చెత్తపాలు.. సంపద ఉత్తిమాట
[ 26-04-2024]
చెత్త నుంచి సంపద సృష్టించాలనే లక్ష్యంతో రూ.లక్షలు వెచ్చించి ప్రభుత్వం చెత్త సందప కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
ఒక కుటుంబం.. రెండు పార్టీలు
[ 26-04-2024]
ఆళ్లగడ్డ రాజకీయం ఎప్పుడూ విచిత్రమే.. ప్రస్తుత ఎన్నికలో మరో విచిత్రం చోటు చేసుకుంది. పురపాలక ఛైర్మన్ కుటుంబంలో సభ్యులు రెండు పార్టీలకు మద్దతు పలుకుతుండటం చర్చనీయాంశంగా మారింది. -
విజేఈఈలు
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. బుధవారం రాత్రి ఫలితాలు విడుదలవగా ఉత్తమ పర్సంటైల్ సాధించారు. -
రామయ్యా.. ఇన్నాళ్లకు గుర్తుకొచ్చామా
[ 26-04-2024]
నగరంలోని పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, మేయర్ బీవై రామయ్య గురువారం కర్నూలు నగర పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. -
టీజీ భరత్ నామినేషన్ దాఖలు
[ 26-04-2024]
కర్నూలు అసెంబ్లీ స్థానానికి మొత్తం 56 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో తమ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారని నారాయణ కళాశాలల డీజీఎం గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. -
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కర్నూలు జిల్లాలో ఒక పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా