logo

వైకాపా పాలనలో హత్యా రాజకీయాలు

రాష్ట్రంలో హత్యా రాజకీయాలు పరాకాష్టకు చేరాయని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు దుయ్యబట్టారు.

Updated : 29 Nov 2022 06:23 IST

కర్నూలు డీఎస్పీకి ఫిర్యాదు పత్రం అందజేస్తున్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆకెపోగు ప్రభాకర్‌

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో హత్యా రాజకీయాలు పరాకాష్టకు చేరాయని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు దుయ్యబట్టారు. నగరంలోని తెదేపా కార్యాలయంలో ఆయన సోమవారం మాట్లాడారు. రాప్తాడులో పరిశ్రమ నెలకొల్పేందుకు జాకీ సంస్థ ముందుకు వస్తే రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి డబ్బులు డిమాండ్‌ చేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తెదేపా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డి.. చంద్రబాబు, నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు.

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, ఆయన సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఎస్పీ కె.వి.మహేష్‌కు ఫిర్యాదు పత్రం అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు