బోగస్ ఓట్లే పావులుగా
పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నకిలీ, బోగస్ ఓట్లు భారీగా నమోదయ్యాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వైకాపా వ్యూహం
ఈనాడు - కర్నూలు: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నకిలీ, బోగస్ ఓట్లు భారీగా నమోదయ్యాయి. యూడైస్లో నమోదైన ఉపాధ్యాయుల సంఖ్య, ఓటర్ల నమోదుకు పొంతన కుదరడం లేదు. ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు వాలంటీర్లతో నిర్వహించిన ఇంటింటి సర్వేలో తేలింది. ఈ ప్రభావం ఎన్నికలపై పడే ప్రమాదం ఉందని గ్రహించి అధికారం అడ్డుపెట్టుకుని వైకాపా పావులు కదుపుతోంది. ప్రైవేటు పాఠశాలల్లో అనర్హులను ఓటర్లుగా నమోదు చేయించి గెలుపు బాటలు వేసుకునేందుకు ఆ పార్టీ నాయకులు యత్నిస్తున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాక బీఎల్వోలు, రెవెన్యూ సిబ్బంది పరిశీలించాలి. ప్రభుత్వ టీచర్లు విధులకు వెళ్లాక ఫోన్ చేసి స్పందించలేదన్న కారణం బూచీగా చూపి తిరస్కరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు జిల్లా నుంచి 6,793, నంద్యాలలో 5,017 దరఖాస్తులు అందాయి. 2017 ఎమ్మెల్సీ ఎన్నికలకు భిన్నంగా ప్రైవేటు యాజమాన్యాల నుంచి సుమారు 8 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి.
నంద్యాలలో మరీ ఎక్కువ
* 33 ఏళ్ల క్రితం నంద్యాలలో ఏర్పాటైన ఓ ప్రైవేటు పాఠశాలలోని 50 మంది ఉపాధ్యాయులకు ఓటు హక్కు లభించింది. ఈ పాఠశాల కరస్పాండెంట్తో చర్చించిన అధికార పార్టీ నాయకుల నుంచి వచ్చిన జాబితా ప్రకారమే ఓటర్లుగా చేరిపోయారు.
* నంద్యాల పట్టణం కాంతి నగర్లోని ఓ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు ఓటర్ల జాబితాలో చేరగా వీరు అధికారికంగా ఎక్కడా పీఎఫ్ కలిగి లేరు.
* నంద్యాల పట్టణం పాత పట్టణంలో వైకాపా నాయకుని పాఠశాలలో ఆరుగురికి ఓటు హక్కు వచ్చింది. అధికార పార్టీ సానుభూతిపరులైన ఓ కార్పొరేట్ పాఠశాల నుంచి ఎనిమిది మందికి, మరో పాఠశాల నుంచి నలుగురికి ఓటు హక్కు కల్పించారు.
ఆర్థిక మంత్రి ఇలాకాలో..
* బేతంచెర్లలో ఓ ఉపాధ్యాయుడికి ఏకంగా ఐదు ఓట్లు ఉన్నాయి. యూడైస్లో ఆయన పేరే లేకపోవడం గమనార్హం. ఇక్కడ 53 మంది ప్రైవేటు పాఠశాలల టీచర్లు, 23 మంది ప్రభుత్వ (రెగ్యులర్) ఉపాధ్యాయులు ఉన్నారు. అనర్హులైన వారికి ప్రాధాన్యం కల్పించి రెగ్యులర్ టీచర్ల దరఖాస్తులు తిరస్కరించారు.
తప్పుల కుప్ప
* శ్రీశైలంలో 33 బోగస్ ఓట్లు గుర్తించారు. పట్టభద్రుల ఓటర్ల నమోదు కోసమని చెప్పి సంతకాలు తీసుకెళ్లి ఉపాధ్యాయ ఓటర్లుగా నమోదు చేయించారు. తమకు ఎలాంటి సంబంధం లేదు.. ఆ ఓట్లు తొలగించాలంటూ 22 మంది అర్జీలు పెట్టుకున్నారంటే అధికార పార్టీ పెత్తనం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
* కర్నూలు జిల్లాలోని ఓ పాఠశాలలో యూడైస్ ప్రకారం ఎనిమిది మంది ప్రాథమిక బోధన చేసే వారే ఉన్నారు. కానీ ఇక్కడి నుంచి 17 మంది దరఖాస్తులు చేసుకోవడం గమనార్హం.
* కోడుమూరులో ఓ పాఠశాలను ఈ ఏడాది హైస్కూలుగా ఉన్నతీకరించారు. గతేడాది వరకు ప్రాథమికోన్నత పాఠశాల (యూపీ)గానే ఉంది. మూడేళ్ల సర్వీసు లేకపోయినా ఏడుగురు ఓటర్లుగా నమోదయ్యారు.
* నంద్యాలలో రెండేళ్ల క్రితం ఏర్పాటైన ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడిని ఓటరు జాబితాలో చేర్చారు. ఇక్కడ ఇప్పటి వరకు ఉన్నత తరగతులు నిర్వహించడం లేదు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి
ప్రభుత్వ గుర్తింపు కలిగి ఉన్న ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో మూడేళ్ల సర్వీసుకు తగ్గకుండా పని చేసి ఉండాలి. ఆదాయ పన్నుతోపాటు ఈపీఎఫ్ సౌకర్యం, జీతభత్యాలకు సంబంధించి బ్యాంకు స్టేట్మెంట్ వివరాలు పొందు పరచాలి. సదరు వ్యక్తి ఆరు నుంచి పది వరకు బోధించాలి.. 2022 నవంబరు ఒకటి నాటికి ఆరేళ్ల కాలంలో మూడేళ్లపాటు ఒకేచోట పని చేసి ఉండాలి. ఇవన్నీ నిర్ధారించిన తర్వాతే జిల్లా విద్యాశాఖాధికారి సంతకం చేయాల్సి ఉండగా ఇవేమీ పట్టించుకోలేదు. నకిలీ.. బోగస్ ఓట్లు తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఏపీటీఎఫ్ నాయకులు ఫిర్యాదు చేశారు.
గుడ్డిగా ఆమోదం
అధికార పార్టీ నేతలు కరస్పాండెంట్లతో చర్చించి సంబంధిత ఉపాధ్యాయుల జాబితా తీసుకుంటున్నారు. నంద్యాలలో రెండు పోలింగ్ కేంద్రాల పరిధిలో ఏకంగా 1,080 ఓట్లు నమోదు అయ్యాయి. వారం రోజుల క్రితం నంద్యాలలో ఓ ప్రజాప్రతినిధి ప్రైవేటు పాఠశాలల యజమానులతో సమావేశం నిర్వహించి భారీ విందు ఇచ్చి బోగస్ ఓట్లు నమోదు చేయించారు. అధికార ఒత్తిళ్లకు తలొగ్గి ప్రైవేటు పాఠశాలల యజమానులు తీసుకొస్తున్న దరఖాస్తులు ఏమాత్రం పరిశీలించకుండా విద్యాశాఖాధికారులు సంతకం, సీల్ వేసినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
[ 26-04-2024]
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి కుంటు పడింది
[ 26-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి అన్ని రంగాల్లో కుంటుపడిందని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి
[ 26-04-2024]
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు.. తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినిగించుకోవాలని సీఐ రమేష్బాబు తెలిపారు. -
హంద్రీ నీవా కట్టపై జగన్ కనికట్టు
[ 26-04-2024]
దూదేకొండ, కోతిరాళ్ల, కొత్తపల్లి, కనకదిన్నె, వెలమకూరు, ఆర్.మండగిరి, జె.అగ్రహారం గ్రామాల రైతులకు చెందిన సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందివ్వాలి. -
చేనేతలను విస్మరించిన వైకాపా
[ 26-04-2024]
సీఎం జగన్ ప్రభుత్వంలో చేనేతలను పూర్తిగా విస్మరించి, ఓట్లు కోసం రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ డాక్టర్ సంజీవ్కుమార్ ఆరోపించారు. -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
[ 26-04-2024]
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
పచ్చని సీమ చేస్తానంటివి.. పచ్చిక లేకుండా చేస్తివి
[ 26-04-2024]
శ్రీశైలం కుడిగట్టు కాల్వ(ఎస్సార్బీసీ)ను 2003లో పూర్తి చేశారు. పాములపాడు మండలం బనకచెర్ల నుంచి అవుకు రిజర్వాయర్ వరకు విస్తరించి ఉంది. దీని పరిధిలో 1.90 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. -
గడప గడపనా జగన్ ధోకా
[ 26-04-2024]
దేవనకొండ మండలంలో రూ.7.7 కోట్లతో 209 పనులు మంజూరు చేయగా ప్రస్తుతం 91 వివిధ దశల్లో ఉండగా మిగిలినవి ప్రారంభమే కాలేదు. -
నాసిరకం విత్తన ముఠాల నాయకుడు పోచా : బైరెడ్డి
[ 26-04-2024]
: ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి నాసిరకం విత్తన ముఠాల లీడరని రైతులే చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. -
ఏకపక్ష పల్లెలు.. అధికారంలో గుబులు
[ 26-04-2024]
అవుకు మండలం గుండ్లశింగవరం బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సొంతూరు.. ‘అధికారం’ ఉపయోగించి అక్కడ ప్రతిసారి పోలింగ్ ఏకపక్షంగా నడిపిస్తున్నారు. -
గులాబీ రంగుల్లో మునిగితేలారు
[ 26-04-2024]
చిన్నహోతూరు గ్రామస్థులంతా గులాబీ రంగులో మునిగితేలారు. సిద్ధరామేశ్వరస్వామి ఉత్సవాల ముగింపు సందర్భంగా వసంతోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. -
టీజీ.. క్రేజీ
[ 26-04-2024]
కర్నూలు నగరం.. జనసంద్రమైంది. వేలాది మంది తెదేపా, జనసేన, భాజపా, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, తెదేపా అభిమానుల భారీ ర్యాలీ నడుమ తెదేపా కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. -
నిధులు చెత్తపాలు.. సంపద ఉత్తిమాట
[ 26-04-2024]
చెత్త నుంచి సంపద సృష్టించాలనే లక్ష్యంతో రూ.లక్షలు వెచ్చించి ప్రభుత్వం చెత్త సందప కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
ఒక కుటుంబం.. రెండు పార్టీలు
[ 26-04-2024]
ఆళ్లగడ్డ రాజకీయం ఎప్పుడూ విచిత్రమే.. ప్రస్తుత ఎన్నికలో మరో విచిత్రం చోటు చేసుకుంది. పురపాలక ఛైర్మన్ కుటుంబంలో సభ్యులు రెండు పార్టీలకు మద్దతు పలుకుతుండటం చర్చనీయాంశంగా మారింది. -
విజేఈఈలు
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. బుధవారం రాత్రి ఫలితాలు విడుదలవగా ఉత్తమ పర్సంటైల్ సాధించారు. -
రామయ్యా.. ఇన్నాళ్లకు గుర్తుకొచ్చామా
[ 26-04-2024]
నగరంలోని పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, మేయర్ బీవై రామయ్య గురువారం కర్నూలు నగర పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. -
టీజీ భరత్ నామినేషన్ దాఖలు
[ 26-04-2024]
కర్నూలు అసెంబ్లీ స్థానానికి మొత్తం 56 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో తమ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారని నారాయణ కళాశాలల డీజీఎం గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. -
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కర్నూలు జిల్లాలో ఒక పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..