ఇంధనం పీల్చేస్తున్న దోమలు
పురపాలక సంఘాల్లో దోమల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు దోమలు చొరబడి ఇంధనాన్ని పీల్చేస్తున్నాయి.
ఫాగింగ్ పేరుతో నిధుల పక్కదారి
డోన్లో పిచికారీ చేస్తున్న సిబ్బంది
న్యూస్టుడే, ఆదోని పురపాలకం,నగరపాలక సంస్థ, డోన్ పట్టణం: పురపాలక సంఘాల్లో దోమల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు దోమలు చొరబడి ఇంధనాన్ని పీల్చేస్తున్నాయి. అదేలా అని సందేహం కలుగుతోందా? దోమా.. దోమా.. ఎందుకు కుట్టావ్? అంటే పురపాలక సిబ్బంది ఫాగింగ్ చేయలేదు.. అందట. సిబ్బందిని అడిగితే.. వాటి నివారణకు నిధులు ఖర్చు చేస్తే.. మా జేబులెలా నిండుతాయని అన్నారట. ఇదీ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పురపాలక సంఘాల పరిస్థితి.
* ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పురపాలక సంఘాల్లో ప్రజలు దోమల బెడదతో బెంబేెలెత్తిపోతున్నారు. దోమల నివారణకు పటిష్టమైన నివారణ చర్యలు కానరావడం లేదు. రోజురోజుకు జనాభాతో పాటు పట్టణాల విస్తీర్ణం పెరుగుతోంది. దానికి తగ్గట్లు పారిశుద్ధ్య సమస్యలు పెరిగిపోతున్నా.. పూర్తిస్థాయిలో శుభ్రత పనులు జరగడం లేదు. సచివాలయాలు ఏర్పాటైనా.. ప్రజారోగ్య సిబ్బందిని నియమించినా ప్రయోజనం శూన్యమే. ఎక్కడా యంత్రాలు పట్టుకుని పిచికారీ చేసిన దాఖలాలు లేవు. రూ.లక్షలు వ్యయం చేసి కొనుగోలు చేసిన యంత్రాలు మూలన పడేశారు. గతంలో ఫాగింగ్ చేసిన వార్డుల్లో జనం నుంచి సిబ్బంది సంతకాలు తీసుకునేవారు. ఇలాంటి విధానమే లేకుండా పోయింది. రానున్నది వర్షాకాలం. దోమల బెడదతో రోగాలు వెంటాడుతాయి. ప్రజారోగ్య విభాగం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.
* గతేడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు డోన్లో దోమల మందు పిచికారీ కోసం రూ.3.48 లక్షలు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపారు. గతేడాది మార్చి నుంచి జూన్ వరకు నాలుగు నెలల పాటు ఫాగింగ్ చేసిన దాఖలాలు లేవు. ఆ తర్వాత పైపై పనులు చేపట్టి మమ అనిపించారు. పాత ఫాగింగ్ యంత్రాలు మరమ్మతులకు గురవడంతో మూలన పెట్టారు. తాజాగా మరో రెండు కొత్తగా కొనుగోలు చేశారు. డోన్ పట్టణంలోనూ డీజిల్ పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఏటా ఖర్చు రూ.లక్షల్లో..
దోమల నివారణకు కర్నూలు నగరపాలక సంస్థలో రూ.50 లక్షలు, నంద్యాల పురపాలక సంఘంలో రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు, ఆదోని రూ.10 లక్షలు, ఎమ్మిగనూరు రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలు, మిగిలిన మున్సిపాలిటీల్లో రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు.
* దోమల నివారణలో మలాథియన్ ద్రావకం కీలకం. దాని పేరు చెప్పి కిరోసిన్ పోసి.. పైపైన ఫాగింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిజానికి యంత్రాల ట్యాంకు సామర్థ్యానికి తగ్గట్లు పెట్రోలు, డీజిల్లో మలాథియన్ మిశ్రమం కలిపి ఫాగింగ్ చేయాలి. ఇవేమీ పాటించకుండా మొక్కుబడిగా చేపడుతూ.. జేబులు నింపుకొంటున్నారు.
సొమ్ము చేసుకుంటూ..
దోమల నివారణలో ఉపయోగించే ఇంధనం పక్కదారి పడుతోంది. ఫాగింగ్ యంత్రాలకు, వాటిని వినియోగించే ఆటోలకు ఇంధనం అవసరం. పెట్రోలు, డీజిల్ కొనుగోలుకు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. కొనుగోలు కోసం పురపాలక సంఘం ఒప్పందం చేసుకున్న పెట్రోలు బంకుల్లో తీసుకున్న ఇంధనాన్ని వినియోగించకుండా పక్కదారి పట్టించి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆదోని పట్టణంలోని ఓ పెట్రోలు పంపులో ఇలానే సిబ్బంది అమ్ముకుంటూ పట్టుబడ్డారు. కర్నూలులోనూ ఇంధనం అమ్ముకున్న ఘటన వెలుగుచూసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ పరిశీలించిన సబ్ కలెక్టర్
[ 07-05-2024]
ఆదోని నియోజకవర్గానికి సంబంధించి పురపాలక నెహ్రూ మెమోరియల్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని, ఓటింగ్ సరళి, నిర్వహణ ఏర్పాట్లను ఆదోని ఎన్నికల అధికారి/సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పరిశీలించారు. -
ప్రశాంతంగా రెండవ రోజు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
[ 07-05-2024]
ఆదోని నియోజకవర్గంలో సజావుగా రెండవ రోజు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహణ సాగిందని సబ్ కలెక్టర్/ ఆదోని ఎన్నికల అధికారి శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు. -
చేనేతలకు అండగా కూటమి
[ 07-05-2024]
చేనేత కార్మికులకు సంక్షేమం అభివృద్ధితో పాటు ఉపాధి కల్పించేందుకు కూటమి అండగా ఉంటుందని తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
హంద్రీ తూము ఏర్పాటు చేస్తాం
[ 07-05-2024]
కూటమి అధికారంలో రాగానే హంద్రీ కాలువపై తూము ఏర్పాటు చేసి ఏబీసీ కాలువను అభివృద్ధి చేస్తామని ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ కుమారుడు మల్లికార్జున గౌడ్ అన్నారు. -
కబ్జాల కాటసాని కథ తేల్చుదాం
[ 07-05-2024]
గజ్జల కొండలో రూ.కోట్ల విలువైన గ్రావెల్ను తవ్వేశారు.. వక్ఫ్ భూములు కబ్జా చేశారు.. జగన్నాథగట్టు భూములు కొల్లగొట్టారు.. పాత్రికేయుల భూములు కబ్జా చేశారు.. కబ్జాల రెడ్డి.. కాటసాని కథ తేల్చుదామని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. పాణికేశ్వరస్వామి భూములు ఆక్రమించారని, నకలీ పత్రాలు సృష్టించారని దుయ్యబట్టారు. -
ఉద్యోగుల ఓట్లు గల్లంతు
[ 07-05-2024]
పోస్టల్ బ్యాలట్ వినియోగంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో వందలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. ఎక్కడా సరైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించలేదు. -
రవ్వలకొండ చరిత్రకు సమాధి
[ 07-05-2024]
కాలజ్ఞానం చరిత్రను మట్టి మాఫియా ఖతం చేస్తోంది.. ‘అధికారం’ తోడుగా ఉండటం.. యంత్రాంగం పట్టించుకోకపోవడంతో రెచ్చిపోతోంది.. 2000 హెక్టార్లలో విస్తరించిన రవ్వలకొండను మట్టి మాఫియా తవ్వేస్తోంది. -
ఉద్యోగుల ఓట్లు గల్లంతు
[ 07-05-2024]
పోస్టల్ బ్యాలట్ వినియోగంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో వందలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. ఎక్కడా సరైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించలేదు. -
రవ్వలకొండ చరిత్రకు జలసఆది
[ 07-05-2024]
కలుషిత జలం పురవాలసులను కలవరపెడుతోంది. తాగునీటి పైపులైన్లు ఏకంగా మురుగు కాలువల్లోనే ఉండటంతో తాగునీటిలో మురుగు కలుస్తోందని ఆందోళన చెందుతున్నారు. -
‘స్మార్ట్’గా జగన్ బురిడీ
[ 07-05-2024]
మధ్య తరగతి కుటుంబాల కోసం లాభాపేక్ష లేకుండా అందుబాటు ధరలో లేఅవుట్లు తీసుకొస్తున్నాం.. ప్రతి నియోజకవర్గంలోనూ ఏర్పాటు చేసి సొంతింటి కలను సాకారం చేయబోతున్నాం.. అక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.! -
రానున్నది చంద్రన్న రాజ్యం: తిక్కారెడ్డి
[ 07-05-2024]
రానున్నది చంద్రన్న రాజ్యమని కర్నూలు జిల్లా తెదేపా పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఎమ్మిగనూరు పట్టణంలోని తిలక్నగర్, చెన్నకేశవకాలనీలో ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడుతో కలిసి ప్రచారం చేశారు. -
మాదిగలను మోసం చేసిన వైకాపాకు బుద్ధి చెప్పాలి: మంద కృష్ణ మాదిగ
[ 07-05-2024]
రాష్ట్రంలో మాదిగలను మోసం చేసిన వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం పెద్దకడబూరు మండలం కంబళదిన్నె గ్రామంలో మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి నిర్వహిస్తున్న రోడ్డు షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
8 వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగం
[ 07-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బంది ఈ నెల 6, 7, 8 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి సృజన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్