పట్టాలెక్కని అధునాతన పరిజ్ఞానం
ఒడిశా రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. రైల్వే వ్యవస్థల్లో భద్రత ఎంతన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
నెమ్మదిగా సాగుతున్న రైల్వే ప్రాజెక్టులు
ఒడిశా ఘటనతోనైనా పనులు చేపట్టాలి
బోగోలు స్టేషన్ దగ్గర ఎత్తు తక్కువగా ఉన్న ప్లాట్ఫారం
ఈనాడు, కర్నూలు, బి క్యాంపు, మద్దికెర, వెల్దుర్తి, న్యూస్టుడే: ఒడిశా రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. రైల్వే వ్యవస్థల్లో భద్రత ఎంతన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 180 కి.మీ రైల్వే మార్గం ఉంది. పట్టాలపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎప్పటికప్పుడు అధునాతన మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయాలి. కాలానుగుణంగా అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఆచరణలోకి తీసుకురావాలి. స్టేషన్ల పరిధిలో రైల్వే వ్యవస్థను ఆధునికీకరించాలి. ఆ ప్రక్రియ అమలు ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల నేటికీ అత్యంత వెనుకబడి ఉందనే చెప్పుకోవచ్చు.
ఇంటర్ లాకింగ్ సదుపాయమేదీ
కర్నూలు నుంచి డోన్ మధ్య 14 లెవల్ క్రాసింగ్ గేట్లు ఉన్నాయి. అందులో ఎనిమిది గేట్లకు ఇంటర్ లాకింగ్ సదుపాయం లేదు. కర్నూలు- దూపాడు మధ్యలో లెవల్ క్రాసింగ్ గేటు నంబరు 137, దూపాడు- ఉలిందకొండ మధ్య ఎల్.సి. గేటు నంబరు 141, ఉలిందకొండ- వెల్దుర్తి మధ్య గేటు నంబర్లు 149, 150, వెల్దుర్తి బోగోలు మధ్య గేటు నంబర్లు 156, 158, బోగోలు-డోన్ మధ్య 162, 164 ఎల్.సి.గేట్లకు ఇంటర్ లాకింగ్ సదుపాయం లేకపోవడంతో మానవ తప్పిదాలు కారణంగా ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ ఇంటర్ లాకింగ్ సదుపాయం ఉన్న గేట్లను సమకూర్చకపోవడం గమనార్హం.
పట్టాలు పర్యవేక్షించేవారేరీ
ట్రాక్ నిర్వహణలో గ్యాంగ్మెన్ల పాత్ర కీలకం. రైలు పట్టాలు పూర్తిస్థాయిలో సురక్షితంగా ఉంచడంలో వీరిదే కీలకపాత్ర. స్టేషన్ల వారీగా నిర్ణీత సెక్షన్ల పరిధిలో వీరు విధులు నిర్వర్తిస్తుంటారు. ఏసెక్షన్లో ఎంత మంది ఉన్నారన్న విషయాలు అధికారులు గుట్టుగా ఉంచుతున్నారు. కీలక బాధ్యతలు నిర్వహించే గ్యాంగ్మెన్ల ఖాళీల సంఖ్య భారీగా ఉంది. కొరత కారణంగా అందుబాటులో ఉన్నవారిపై పని ఒత్తిడి పెరగడంతో పర్యవేక్షణ మొక్కుబడిగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి.
ప్రమాదకరంగా ప్లాట్ఫారం
బోగోలు, ఉలిందకొండల్లో ప్లాట్ఫారం ఎత్తు మరీ తక్కువగా ఉంది. వెల్దుర్తిలో రైలు మెట్లకు సరిపడా ఎత్తులో ప్లాట్ఫారం లేదు. కర్నూలు స్టేషన్లో నేటికీ మూడు ప్లాట్ఫారాలే ఉన్నాయి. మరో రెండు లైన్లు అందుబాటులో ఉన్నప్పటికీ వాటికి ప్లాట్ఫారాలు లేవు.
విషాద ఘటనలు
2002 డిసెంబరు 21న అర్ధరాత్రి 12.45 గంటలకు కాచిగూడ- బెంగళూరు రైలు పెండేకల్లు- పగిడిరాయి స్టేషన్ల మధ్య పట్టాలు తప్పింది. ఆ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 78 మంది గాయపడ్డారు. ఇంజిన్తోపాటు తొమ్మిది బోగీలు పట్టాలు తప్పాయి. ఏడు స్లీపర్, ఒక జనరల్ బోగీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు పట్టాలు కోసేయడంతోనే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారుల దర్యాప్తులో తేలింది. 2018 అక్టోబరు 3న కర్నూలు స్టేషన్ ఆవరణలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అదే ప్రాంతంలో 2019 మార్చి 3న వెంకటాద్రి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది.
ప్యానెల్ ఇంటర్ లాకింగే దిక్కు
* సిగ్నలింగ్ వ్యవస్థలో ఎస్ఎస్ఐ (సాలిడ్ స్టేట్ ఇంటర్ లాకింగ్) కన్నా అత్యాధునికమైన ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్(ఈఐ) ఏర్పాటు చేస్తున్నారు. డోన్ పరిధిలో డబ్లింగ్ చేసినప్పుడు ఎస్ఎస్ఐ నుంచి ఈఐకి మార్చారు. డోన్- నంద్యాల మధ్యనే అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది మిగిలిన ప్రాంతాల్లో నేటికీ పాత విధానాలే ఉపయోగిస్తున్నారు.
* బోగోలు, వెల్దుర్తి, ఉలిందకొండ, దూపాడు, కర్నూలు నగరంలో సుమారు 20 ఏళ్ల కిందటి ప్యానెల్ ఇంటర్ లాకింగ్(పి.ఐ.) పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. మానవ తప్పిదాల కారణంగా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. డోన్ నుంచి మహబూబ్నగర్ వరకు ప్రస్తుతం సింగిల్ లైన్ ఉంది. డబ్లింగ్ చేసినప్పుడు ఆధునిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావొచ్చన్న ఉద్దేశంతో వదిలేయడం గమనార్హం.
నత్తనడకన విద్యుదీకరణ
మద్దికెర- గుంతకల్లు మధ్య కొనసాగుతున్న డబ్లింగ్ పనులు
* గుంతకల్లు- గుంటూరు (403 కి.మీ) మార్గంలో రైల్వే డబ్లింగ్ పనులకు ఆ శాఖ రూ.3,280 కోట్లు మంజూరు చేసింది. 2018లో పనులు ప్రారంభించగా నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మద్దికెర- గుంతకల్లు మధ్య 10 కి.మీ మేరకు నత్తను తలపిస్తున్నాయి. డోన్- నంద్యాల మార్గంలో పలు చోట్ల పుట్ ఓవర్ బ్రిడ్జి పనులతో పాటు, ఇతర అభివృద్ధి పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.
* మల్లెపల్లె, బింగిదొడ్డి ప్రాంతాల్లో లెవల్ క్రాసింగ్ల దగ్గర అండర్పాస్ల నిర్మాణం, వెల్దుర్తి ప్లాట్ఫారం ఎత్తు పెంచే పనులు నత్తను తలపిస్తున్నాయి. బింగిదొడ్డికి వెళ్లే మార్గంలో రైల్వే భూగర్భ వంతెన నిర్మాణ పనుల్లో బండరాళ్ల మధ్య కంకర పోస్తుండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బుగ్గన నామినేషన్ పెండింగ్లో ఉంచిన ఎన్నికల అధికారి
[ 26-04-2024]
డోన్ వైకాపా అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి నామినేషన్ను ఎన్నికల అధికారి పెండింగ్లో ఉంచారు. -
ఇంటింటికి తెలుగుదేశం
[ 26-04-2024]
పెద్దకడుబుర్ మండలం జాలవడి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
[ 26-04-2024]
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి కుంటు పడింది
[ 26-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి అన్ని రంగాల్లో కుంటుపడిందని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి
[ 26-04-2024]
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు.. తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినిగించుకోవాలని సీఐ రమేష్బాబు తెలిపారు. -
హంద్రీ నీవా కట్టపై జగన్ కనికట్టు
[ 26-04-2024]
దూదేకొండ, కోతిరాళ్ల, కొత్తపల్లి, కనకదిన్నె, వెలమకూరు, ఆర్.మండగిరి, జె.అగ్రహారం గ్రామాల రైతులకు చెందిన సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందివ్వాలి. -
చేనేతలను విస్మరించిన వైకాపా
[ 26-04-2024]
సీఎం జగన్ ప్రభుత్వంలో చేనేతలను పూర్తిగా విస్మరించి, ఓట్లు కోసం రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ డాక్టర్ సంజీవ్కుమార్ ఆరోపించారు. -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
[ 26-04-2024]
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
పచ్చని సీమ చేస్తానంటివి.. పచ్చిక లేకుండా చేస్తివి
[ 26-04-2024]
శ్రీశైలం కుడిగట్టు కాల్వ(ఎస్సార్బీసీ)ను 2003లో పూర్తి చేశారు. పాములపాడు మండలం బనకచెర్ల నుంచి అవుకు రిజర్వాయర్ వరకు విస్తరించి ఉంది. దీని పరిధిలో 1.90 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. -
గడప గడపనా జగన్ ధోకా
[ 26-04-2024]
దేవనకొండ మండలంలో రూ.7.7 కోట్లతో 209 పనులు మంజూరు చేయగా ప్రస్తుతం 91 వివిధ దశల్లో ఉండగా మిగిలినవి ప్రారంభమే కాలేదు. -
నాసిరకం విత్తన ముఠాల నాయకుడు పోచా : బైరెడ్డి
[ 26-04-2024]
: ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి నాసిరకం విత్తన ముఠాల లీడరని రైతులే చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. -
ఏకపక్ష పల్లెలు.. అధికారంలో గుబులు
[ 26-04-2024]
అవుకు మండలం గుండ్లశింగవరం బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సొంతూరు.. ‘అధికారం’ ఉపయోగించి అక్కడ ప్రతిసారి పోలింగ్ ఏకపక్షంగా నడిపిస్తున్నారు. -
గులాబీ రంగుల్లో మునిగితేలారు
[ 26-04-2024]
చిన్నహోతూరు గ్రామస్థులంతా గులాబీ రంగులో మునిగితేలారు. సిద్ధరామేశ్వరస్వామి ఉత్సవాల ముగింపు సందర్భంగా వసంతోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. -
టీజీ.. క్రేజీ
[ 26-04-2024]
కర్నూలు నగరం.. జనసంద్రమైంది. వేలాది మంది తెదేపా, జనసేన, భాజపా, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, తెదేపా అభిమానుల భారీ ర్యాలీ నడుమ తెదేపా కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. -
నిధులు చెత్తపాలు.. సంపద ఉత్తిమాట
[ 26-04-2024]
చెత్త నుంచి సంపద సృష్టించాలనే లక్ష్యంతో రూ.లక్షలు వెచ్చించి ప్రభుత్వం చెత్త సందప కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
ఒక కుటుంబం.. రెండు పార్టీలు
[ 26-04-2024]
ఆళ్లగడ్డ రాజకీయం ఎప్పుడూ విచిత్రమే.. ప్రస్తుత ఎన్నికలో మరో విచిత్రం చోటు చేసుకుంది. పురపాలక ఛైర్మన్ కుటుంబంలో సభ్యులు రెండు పార్టీలకు మద్దతు పలుకుతుండటం చర్చనీయాంశంగా మారింది. -
విజేఈఈలు
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. బుధవారం రాత్రి ఫలితాలు విడుదలవగా ఉత్తమ పర్సంటైల్ సాధించారు. -
రామయ్యా.. ఇన్నాళ్లకు గుర్తుకొచ్చామా
[ 26-04-2024]
నగరంలోని పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, మేయర్ బీవై రామయ్య గురువారం కర్నూలు నగర పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. -
టీజీ భరత్ నామినేషన్ దాఖలు
[ 26-04-2024]
కర్నూలు అసెంబ్లీ స్థానానికి మొత్తం 56 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో తమ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారని నారాయణ కళాశాలల డీజీఎం గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. -
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కర్నూలు జిల్లాలో ఒక పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ