logo

తెదేపా అభ్యర్థిగా కచ్చితంగా పోటీ చేస్తా

మంత్రాలయం నియోజకవర్గం తెదేపా అభ్యర్థిగా కచ్చితంగా నేనే పోటీ చేస్తానని ఆ పార్టీ నాయకుడు తిక్కారెడ్డి అన్నారు.

Published : 28 Mar 2024 03:17 IST

మంత్రాలయంలో మాట్లాడుతున్న తిక్కారెడ్డి

మంత్రాలయం గ్రామీణం, న్యూస్‌టుడే: మంత్రాలయం నియోజకవర్గం తెదేపా అభ్యర్థిగా కచ్చితంగా నేనే పోటీ చేస్తానని ఆ పార్టీ నాయకుడు తిక్కారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మంత్రాలయంలోని తెదేపా కార్యాలయంలో కోసిగి మండలంలోని జుమ్మాలదిన్నె, గౌడుగల్‌, వందగల్‌, నేలకోసిగి, కోల్మన్‌పేట, దుద్ది ఆర్లబండ, గ్రామాల నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెదేపా అధిష్ఠానం కచ్చితంగా పునరాలోచించి తనకు మంత్రాలయం టికెట్‌ ప్రకటిస్తుందన్నారు. త్వరలో శుభవార్త వింటారన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా మంత్రాలయం మండల అధ్యక్షుడు పన్నాగ వెంకటేశప్ప స్వామి, భరద్వాజ్‌శెట్టి, వక్రాణి వెంకటేశ్వర్లు, నాడిగేని అయ్యన్న, చావిడి వెంకటేశ్‌, అమర్నాథ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, విజయరామిరెడ్డి, అశోక్‌రెడ్డి, సిద్దప్ప, రాగన్న, గవిగట్టు ఈరన్న పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని