వైకాపాను భూ స్థాపితం చేయాలి
ఈ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేయాలని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు తహసీల్దారు కార్యాలయంలో గురువారం ఆయన నామపత్రం దాఖలు చేశారు.
బుడ్డా రాజశేఖర్
భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు
ఆత్మకూరు, నంద్యాల బొమ్మలసత్రం, న్యూస్టుడే : ఈ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేయాలని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు తహసీల్దారు కార్యాలయంలో గురువారం ఆయన నామపత్రం దాఖలు చేశారు. అనంతరం ఆత్మకూరులోని గౌడ్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. సహజ వనరులను దోచుకుని, పేదవారిని అణచివేసిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కరవైందన్నారు. జగన్రెడ్డి బాదుడుతో బెంబేలెత్తిపోయిన జనం ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయం వెనుక జలాలను ఎత్తిపోసి వరదరాజస్వామి ప్రాజెక్టును నింపకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని 2019 ఎన్నికల ముందు చెప్పిన శిల్పా చక్రపాణిరెడ్డి మాట తప్పి ఈ రోజు నామినేషన్ వేశారని ధ్వజమెత్తారు. శ్రీశైల దేవస్థానంలో కొడుకు పేరుమీద ప్రైవేటు ఏజెన్సీ పెట్టి నాలుగో తరగతి ఉద్యోగుల వేతనాలు దోచుకుంటున్నారని ఆరోపించారు. దేవస్థానం నెలనెలా రూ.18 వేలు చెల్లిస్తుంటే అందులో ఉద్యోగులకు రూ.9 వేలు మాత్రమే ఇచ్చి మిగతా సొమ్ము స్వాహా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా అధికారంలోకి రాగానే వర్ధన్ బ్యాంక్లో చేసిన మోసాలు వెలికితీసి శిల్పాను పోలీసు జీపు ఎక్కిస్తానని హెచ్చరించారు. ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కాకుండా ఇతర ప్రాంతాల వారికి శ్రీశైల దేవస్థానంలో ఉద్యోగాలు ఇచ్చారని ధ్వజమెత్తారు. తాము గెలిస్తే స్థానికేతరులను తొలగించి స్థానిక యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. శిల్పా అనుచరులు గంజాయి విక్రయిస్తూ యువతను బానిసలుగా మారుస్తున్నారని, అధికారంలోకి వచ్చాక వారి భరతం పడతామన్నారు. మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ.. జగన్మోహన్రెడ్డి ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని ముంచేశారని విమర్శించారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిని శ్రీశైలం నుంచి తరిమివేయాలన్నారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ తెదేపా ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు, శ్రీశైల నియోజకవర్గంలో బుడ్డా రాజన్న రాజ్యం రావాలన్నారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బుడ్డాను, ఎంపీగా తనను గెలిపించాలని కోరారు. తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, బుడ్డా సతీమణి శైలజ, కుమార్తె మేఘనారెడ్డి, జనసేన, భాజపా నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాలో చేరికలు
[ 02-05-2024]
మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో 30 కుటుంబాలు తెదేపాలో చేరారు. -
శ్యాంబాబును గెలిపించుకుందాం
[ 02-05-2024]
తెదేపా అభ్యర్థి కేఈ శ్యాంబాబుకు ఓటు వేసి గెలిపించుకోవాలని తెదేపా నాయకులు కేఈ.నిఖిలేష్, సుబ్బరాయుడు అన్నారు. -
మంచి మనిషిని చూసి ఓటెయ్యండి
[ 02-05-2024]
మంచి మనిషి సౌమ్యుడు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ను అధిక మెజార్టీతో గెలిపించాలని మాజీమంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మం నారాయణ అన్నారు. -
ఉపాధ్యాయ ఉద్యమ దార్శనికుడు దాచూరి రామిరెడ్డి
[ 02-05-2024]
ఉపాధ్యాయ ఉద్యమ దార్షనికుడు దాచూరి రామిరెడ్డి ఉద్యమ స్ఫూర్తి ఉపాధ్యాయ లోకానికి దిక్సూచి లాంటిదని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి నరసింహులు పేర్కొన్నారు. -
తెదేపాలో చేరికలు
[ 02-05-2024]
ఆదోని పట్టణంలో 3వ వార్డు బసన్న కట్ట, గోకర్ జెండా ప్రాంతానికి చెందిన 150 మంది వైకాపా కుటుంబాలు తెదేపాలో చేరారు. -
పెన్షన్ కోసం వృద్ధుల అవస్థలు
[ 02-05-2024]
ఆదోని పట్టణంలో పెన్షన్ దారులు బ్యాంకుల వద్ద గురువారం ఇబ్బందులు పడ్డారు. -
బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. -
కూటమి గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 02-05-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి గెలుపుతో రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని తెదేపా ఫ్లోర్ లీడర్ దయాసాగర్ అన్నారు. -
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి
[ 02-05-2024]
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని జేసీ, నంద్యాల ఎన్నికల అధికారి రాహుల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. -
అనారోగ్యంతో తెదేపా సీనియర్ నాయకుడి మృతి
[ 02-05-2024]
మండలంలోని కైరవాడి గ్రామంలో అనారోగ్యంతో తెదేపా సీనియర్ నాయకుడు గురువారం మృతి చెందారు. -
సకల జనుల సంక్షేమం
[ 02-05-2024]
ఒక్క రూపాయి కూడా కట్టే పని లేకుండానే.. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛను.. ఉద్యోగులు, యువత, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు.. ఇలా సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా తెదేపా, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో ఉందంటూ క్షేత్రస్థాయిలో ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. -
హామీలు గుప్పించి.. సేవలు వికటించి
[ 02-05-2024]
జగన్ ప్రభుత్వ ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఆసుపత్రి భవనాల నిర్వహణ గాలికొదిలేసింది. -
దారితప్పిన మాటలు.. పుర వాసులకు కష్టాలు
[ 02-05-2024]
-
4న లోకేశ్ రాక
[ 02-05-2024]
తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈనెల 4న నంద్యాలలో యువగళం సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ తెలిపారు. -
పింఛను దూరం 90 కి.మీ.
[ 02-05-2024]
జగన్నాటకంలో పండుటాకులు విలవిలలాడుతున్నారు. -
3 ఎమ్మెల్యేలు.. 6కి.మీ..18ఏళ్లు
[ 02-05-2024]
ఈ అంకెలు ఏంటీ అనుకుంటున్నారా..? సి.బెళగల్ మండలం కొండాపురం- ఇనగండ్ల మధ్య 6 కి.మీ. మట్టి రోడ్డును బీటీగా మారుస్తామని గత 18 ఏళ్లలో ముగ్గురు ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. -
మ్యానిఫెస్టోలో అన్నివర్గాలకు ప్రాధాన్యం
[ 02-05-2024]
రాష్ట్రంలోని అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు దర్పణం పట్టేలా తెదేపా-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో ఉందని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. -
గడప.. గడపలో అబద్ధాలు చెప్పండి!
[ 02-05-2024]
అన్ని వర్గాలను అలరించేలా ఉన్న తెదేపా మ్యానిఫెస్టోపై అవాస్తవాలు, అసత్య ప్రచారాలు చేయించేందుకు వైకాపా నాయకులు కుట్రలకు తెర తీశారు. -
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయం
[ 02-05-2024]
మండలంలోని నల్లచెలిమల, ఎంకే కొట్టాల, గుండ్లకొండ, గుడిమిరాళ్ల, బంటుపల్లి, బేతపల్లి, బండపల్లి, ఈదులదేవరబండ గ్రామాల్లో తెదేపా కూటమి అభ్యర్థి వీరభద్రగౌడు, జనసేన ఇన్ఛార్జి వెంకప్ప బుధవారం ప్రచారం నిర్వహించారు. -
మద్యం అమ్మకాలపై నిరంతర నిఘా
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లు, టూరిజం బార్లలో మద్యం అమ్మకాలపై నిఘా కెమెరాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా మద్య నిషేధ, ఆబ్కారీ శాఖ పర్యవేక్షణాధికారి, ఏపీఎస్బీసీఎల్ డిపో మేనేజర్ ఎం.సుధీర్బాబు తెలిపారు. -
అక్రమ మద్యం తరలిస్తూ పట్టుపడ్డ వైకాపా నాయకుడు
[ 02-05-2024]
అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న వైకాపా నాయకుడు శ్రీకాంత్రెడ్డితో పాటు మరో నలుగురిని సెబ్ పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఆలూరులో బుధవారం జరిగింది. -
డోన్లో 45.7 డిగ్రీలు
[ 02-05-2024]
పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. -
శిశువు అపహరణకు యత్నం
[ 02-05-2024]
కర్నూలు సర్వజన వైద్యశాలలోని గైనిక్ విభాగం నుంచి ప్రమీల అనే మహిళ బుధవారం రాత్రి 7 గంటలకు నవజాత శిశువును ఎత్తుకెళ్తూ సెక్యూరిటీ గార్డుకు పట్టుబడటం సంచలనంగా మారింది. -
హత్యాయత్నం కేసులో నిందితుడికి పదేళ్ల జైలు
[ 02-05-2024]
అనుమానంతో కట్టుకున్న భార్యను చంపేందుకు యత్నించిన నంద్యాల జిల్లా వెలుగోడుకు చెందిన రాజుకు పదేళ్ల జైలుశిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ కర్నూలు అదనపు అసిస్టెంట్ సెషన్స్ కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం