నామపత్రాల సందడి
ఆదోని నియోజకవర్గ భాజపా భాజపా అభ్యర్థిగా డాక్టరు పార్థసారథి శుక్రవారం నామపత్రం దాఖలు చేశారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రంలో ఎన్నికల అధికారి శివ్నారయణశర్మకు తన నామపత్రాన్ని అందజేశారు.
ఆదోని గ్రామీణం, ఎస్కేడీ కాలనీ, న్యూస్టుడే: ఆదోని నియోజకవర్గ భాజపా భాజపా అభ్యర్థిగా డాక్టరు పార్థసారథి శుక్రవారం నామపత్రం దాఖలు చేశారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రంలో ఎన్నికల అధికారి శివ్నారయణశర్మకు తన నామపత్రాన్ని అందజేశారు. మధ్యాహ్నం 12.15 గంటలకు అభ్యర్థి పార్థసారథి, ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, భాజపా రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు చంద్రమౌళి, తెదేపా సీనియర్ నాయకులు భాస్కర్రెడ్డి, గుడిసె కృష్ణమ్మ, శ్రీకాంత్రెడ్డి, రామచంద్ర, అప్సర్బాషాతో కలిసి నామినేషన్ కేంద్రానికి హంగు ఆర్భాటం లేకుండా సాదాసీదాగా చేరుకున్నారు. నామినేషన్ కేంద్రంలోకి ఐదుగురే వెళ్లాలని పోలీసులు నిబంధన విధించారు. దీంతో భాజపా పొలిట్బ్యూరో సభ్యుడు చంద్రమౌళి, తెదేపా నాయకుడు శ్రీకాంత్రెడ్డిని లోపలికి వెళ్లకుండా తాలుకా ఎస్సై ఎర్రిస్వామి అడ్డుకున్నారు. కొద్దిసేపటికి లోపలికి పంపడంతో సమస్య సద్దుమణిగింది. ఆ తర్వాత ఎన్నికల నిబంధనల మేరకు కేవలం నామినేషన్ దాఖలుకు ఐదుగురు మాత్రమే ఉండాలని ఎన్నికల అధికారి చెప్పడంతో అభ్యర్థితో పాటు మీనాక్షినాయుడు, అప్సర్బాషా, న్యాయవాదులు శ్రీరాములు, వై.ఆర్.మల్లికార్జున మినహా మిగిలిన వారు బయటకు వచ్చేశారు.
పత్తికొండ గ్రామీణం, న్యూస్టుడే: పత్తికొండ నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కేఈ శ్యాంబాబు ఎన్నికల అధికారి నీలాపు రామలక్ష్మికి నామపత్రాలు దాఖలు చేశారు.
పత్తికొండ, పత్తికొండ గ్రామీణం, న్యూస్టుడే: పత్తికొండ వైకాపా అభ్యర్థిగా కంగాటి శ్రీదేవి నామినేషన్ వేశారు. శుక్రవారం తరలివచ్చిన కార్యకర్తలతో కలిసి ఆమె స్థానిక రహదారులు భవనాల శాఖ అతిథి గృహం వద్ద నుంచి ర్యాలీగా వెళ్లారు. కర్నూలు పార్లమెంటు నియోజవకర్గ వైకాపా అభ్యర్థి బీవై రామయ్య, పత్తికొండ మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్కుమార్రెడ్డి, తదితరులతో కలిసి ఆమె ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామలక్ష్మికి నామినేషన్ పత్రాలు అందజేశారు. శ్రీదేవి తన నామినేషన్ పత్రం దాఖలు చేసేందుకు ముందు సెంటిమెంట్గా.. స్వగ్రామమైన చెరుకులపాడుకు వెళ్లి, తన భర్త దివంగత నారాయణరెడ్డి సమాధి వద్ద నివాళి అర్పించి పత్తికొండకు బయల్దేరి వెళ్లారు.
ఆలూరు గ్రామీణ, న్యూస్టుడే: ఆలూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా విరూపాక్షి శుక్రవారం నామపత్రాలను దాఖలు చేశారు. కొంతమంది అనుచరులతో కలిసి వెళ్లి సాదాసీదాగా నామినేషన్ వేశారు. ఈ నెల 23న మరోసారి నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. వైకాపా నాయకులు శశికళ, ఆలూరు జడ్పీటీసీ సభ్యుడు చంద్రశేఖర్, న్యాయవాదులు లక్ష్మీకాంత్, ఆనంద్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరాచక పాలనను సాగనంపాలి
[ 02-05-2024]
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మిగనూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. -
నంద్యాల అభివృద్ధిని నాయకులు మరిచారు
[ 02-05-2024]
నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి నంద్యాలను అభివృద్ధి చేయకుండా, సమస్యలను పట్టించుకోలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్రెడ్డి విమర్శించారు. -
వైకాపా పాలనకు చరమగీతం పాడుదాం
[ 02-05-2024]
వైకాపా చేపట్టిన ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడాలని చిప్పగిరి మండల తెదేపా నాయకులు అన్నారు. -
తెదేపాలో చేరికలు
[ 02-05-2024]
మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో 30 కుటుంబాలు తెదేపాలో చేరారు. -
శ్యాంబాబును గెలిపించుకుందాం
[ 02-05-2024]
తెదేపా అభ్యర్థి కేఈ శ్యాంబాబుకు ఓటు వేసి గెలిపించుకోవాలని తెదేపా నాయకులు కేఈ.నిఖిలేష్, సుబ్బరాయుడు అన్నారు. -
మంచి మనిషిని చూసి ఓటెయ్యండి
[ 02-05-2024]
మంచి మనిషి సౌమ్యుడు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ను అధిక మెజార్టీతో గెలిపించాలని మాజీమంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మం నారాయణ అన్నారు. -
ఉపాధ్యాయ ఉద్యమ దార్శనికుడు దాచూరి రామిరెడ్డి
[ 02-05-2024]
ఉపాధ్యాయ ఉద్యమ దార్షనికుడు దాచూరి రామిరెడ్డి ఉద్యమ స్ఫూర్తి ఉపాధ్యాయ లోకానికి దిక్సూచి లాంటిదని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి నరసింహులు పేర్కొన్నారు. -
తెదేపాలో చేరికలు
[ 02-05-2024]
ఆదోని పట్టణంలో 3వ వార్డు బసన్న కట్ట, గోకర్ జెండా ప్రాంతానికి చెందిన 150 మంది వైకాపా కుటుంబాలు తెదేపాలో చేరారు. -
పెన్షన్ కోసం వృద్ధుల అవస్థలు
[ 02-05-2024]
ఆదోని పట్టణంలో పెన్షన్ దారులు బ్యాంకుల వద్ద గురువారం ఇబ్బందులు పడ్డారు. -
బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. -
కూటమి గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 02-05-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి గెలుపుతో రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని తెదేపా ఫ్లోర్ లీడర్ దయాసాగర్ అన్నారు. -
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి
[ 02-05-2024]
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని జేసీ, నంద్యాల ఎన్నికల అధికారి రాహుల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. -
అనారోగ్యంతో తెదేపా సీనియర్ నాయకుడి మృతి
[ 02-05-2024]
మండలంలోని కైరవాడి గ్రామంలో అనారోగ్యంతో తెదేపా సీనియర్ నాయకుడు గురువారం మృతి చెందారు. -
సకల జనుల సంక్షేమం
[ 02-05-2024]
ఒక్క రూపాయి కూడా కట్టే పని లేకుండానే.. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛను.. ఉద్యోగులు, యువత, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు.. ఇలా సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా తెదేపా, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో ఉందంటూ క్షేత్రస్థాయిలో ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. -
హామీలు గుప్పించి.. సేవలు వికటించి
[ 02-05-2024]
జగన్ ప్రభుత్వ ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఆసుపత్రి భవనాల నిర్వహణ గాలికొదిలేసింది. -
దారితప్పిన మాటలు.. పుర వాసులకు కష్టాలు
[ 02-05-2024]
-
4న లోకేశ్ రాక
[ 02-05-2024]
తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈనెల 4న నంద్యాలలో యువగళం సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ తెలిపారు. -
పింఛను దూరం 90 కి.మీ.
[ 02-05-2024]
జగన్నాటకంలో పండుటాకులు విలవిలలాడుతున్నారు. -
3 ఎమ్మెల్యేలు.. 6కి.మీ..18ఏళ్లు
[ 02-05-2024]
ఈ అంకెలు ఏంటీ అనుకుంటున్నారా..? సి.బెళగల్ మండలం కొండాపురం- ఇనగండ్ల మధ్య 6 కి.మీ. మట్టి రోడ్డును బీటీగా మారుస్తామని గత 18 ఏళ్లలో ముగ్గురు ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. -
మ్యానిఫెస్టోలో అన్నివర్గాలకు ప్రాధాన్యం
[ 02-05-2024]
రాష్ట్రంలోని అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు దర్పణం పట్టేలా తెదేపా-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో ఉందని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. -
గడప.. గడపలో అబద్ధాలు చెప్పండి!
[ 02-05-2024]
అన్ని వర్గాలను అలరించేలా ఉన్న తెదేపా మ్యానిఫెస్టోపై అవాస్తవాలు, అసత్య ప్రచారాలు చేయించేందుకు వైకాపా నాయకులు కుట్రలకు తెర తీశారు. -
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయం
[ 02-05-2024]
మండలంలోని నల్లచెలిమల, ఎంకే కొట్టాల, గుండ్లకొండ, గుడిమిరాళ్ల, బంటుపల్లి, బేతపల్లి, బండపల్లి, ఈదులదేవరబండ గ్రామాల్లో తెదేపా కూటమి అభ్యర్థి వీరభద్రగౌడు, జనసేన ఇన్ఛార్జి వెంకప్ప బుధవారం ప్రచారం నిర్వహించారు. -
మద్యం అమ్మకాలపై నిరంతర నిఘా
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లు, టూరిజం బార్లలో మద్యం అమ్మకాలపై నిఘా కెమెరాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా మద్య నిషేధ, ఆబ్కారీ శాఖ పర్యవేక్షణాధికారి, ఏపీఎస్బీసీఎల్ డిపో మేనేజర్ ఎం.సుధీర్బాబు తెలిపారు. -
అక్రమ మద్యం తరలిస్తూ పట్టుపడ్డ వైకాపా నాయకుడు
[ 02-05-2024]
అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న వైకాపా నాయకుడు శ్రీకాంత్రెడ్డితో పాటు మరో నలుగురిని సెబ్ పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఆలూరులో బుధవారం జరిగింది. -
డోన్లో 45.7 డిగ్రీలు
[ 02-05-2024]
పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. -
శిశువు అపహరణకు యత్నం
[ 02-05-2024]
కర్నూలు సర్వజన వైద్యశాలలోని గైనిక్ విభాగం నుంచి ప్రమీల అనే మహిళ బుధవారం రాత్రి 7 గంటలకు నవజాత శిశువును ఎత్తుకెళ్తూ సెక్యూరిటీ గార్డుకు పట్టుబడటం సంచలనంగా మారింది. -
హత్యాయత్నం కేసులో నిందితుడికి పదేళ్ల జైలు
[ 02-05-2024]
అనుమానంతో కట్టుకున్న భార్యను చంపేందుకు యత్నించిన నంద్యాల జిల్లా వెలుగోడుకు చెందిన రాజుకు పదేళ్ల జైలుశిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ కర్నూలు అదనపు అసిస్టెంట్ సెషన్స్ కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి