Chandrayaan-3: చంద్రయాన్-3లో జోగులాంబ గద్వాల జిల్లా యువకుడు
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లికి చెందిన కృష్ణ కుమ్మరి చంద్రయాన్ - 3 మిషన్లో 2 పేలోడ్స్ (ఏహెచ్వీసీ), (ఐఎల్ఎస్ఏ)కి డేటా ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ రాశారు.
ఉండవల్లి, న్యూస్టుడే: జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లికి చెందిన కృష్ణ కుమ్మరి చంద్రయాన్ - 3 మిషన్లో 2 పేలోడ్స్ (ఏహెచ్వీసీ), (ఐఎల్ఎస్ఏ)కి డేటా ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ రాశారు. కూలి పనులు చేస్తూ జీవనం సాగించే ఉండవల్లికి చెందిన లక్ష్మీదేవి, మద్దిలేటి దంపతుల కృష్ణ కుమ్మరి, శకుంతల సంతానం. కృష్ణ విద్యాభ్యాసం 1 నుంచి 10 వరకు ఉండవల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో కొనసాగింది. 10వ తరగతి 2008 పూర్తి చేసి మూడేళ్లు తిరుపతిలో డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డీసీఎంఈ) చేశాడు. ఈ-సెట్ పరీక్ష రాసి హైదరాబాదులో (2011 - 2014 ) సీఎస్ఈ (కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్) చేశారు. కళాశాల ప్లెస్మెంట్లో భాగంగా టెరా డేటా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో మూడున్నర సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. ఉద్యోగం చేస్తూనే ఇస్రోలో ఐసీఆర్బీ (ఇస్రో సెంట్రలైజడ్ రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష) రాసి ఆల్ఇండియా స్థాయిలో 4వ ర్యాంకు సాధించారు. అనంతరం 2018 జనవరిలో సైంటిస్ట్ లెవల్ ఉద్యోగం (గ్రూప్ ‘ఏ’ గెజిడెట్ అధికారి) యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (యూఆర్ఎస్సీ) / ఇస్రోలో ఓ యూనిట్ ల్యాబొరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్ (ఎల్ఈఓఎస్) బెంగళూరులో సాధించారు.
చంద్రయాన్ - 3లో ప్రస్థానం..: చంద్రయాన్ - 3 అనేక కేంద్రాలు పనిచేశాయి. మిషన్లోని 2 పేలోడ్స్లో 5 మంది సభ్యులు పనిచేసినా, వీటిలో ఎల్హెచ్వీసీ, ఐఎల్ఎస్ఏకు కృష్ణ కుమ్మరి డేటా ప్రాసెసింగ్ అనాలసిస్ సాఫ్ట్వేర్ రాసినట్లు తెలిపారు. ఎల్హెచ్వీసీ అంటే హారిజాంటల్ వెలాసిటీని చెబుతుందని, ఐఎల్ఎస్ఏ అంటే చంద్రుడిపై వచ్చే కంపనాలు గుర్తించి రికార్డు చేస్తుందని కృష్ణ తెలిపారు. ఈ సాఫ్ట్వేర్ పేలోడ్స్ నుంచి వచ్చే డేటాని ఐఎస్టీఆర్ఏసీ, బెంగళూరు అందుకుంటుందన్నారు. చంద్రయాన్ -3 మిషన్కు 6 నెలల పాటు పని చేసినట్లు వివరించారు. చంద్రయాన్ -3 మిషన్ 100 శాతం విజయవంతం అవుతుందని ఆశిస్తున్నారు.
క్యారమ్స్లోనూ ప్రతిభ: ల్యాబోరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్ (ఎల్ఈఓఎస్), బెంగళూరులో తోటి సెంటిస్టులతో ఆడే క్యారమ్స్ పోటీల్లో రెండేళ్లు వరుసగా ఛాంపియన్గా నిలిచారు. తిరువనంతపురంలో జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఏరోస్పేస్ క్వాలిటీ అండ్ రిలయబిలిటీ (ఎన్సీఏక్యూఆర్-2022) కార్యక్రమంలో నేషనల్ వైడ్ మెంబర్గా పాల్గొన్నట్లు వివరించారు.
పోలియోకు ఆయుర్వేద వైద్యం: ఐదేళ్ల వయస్సులో తనకు పోలియో సోకి నరాలు చచ్చుబడ్డాయని దీనికి అయిజలోని ఆయుర్వేద వైద్యుడు రామేశ్వర్రెడ్డి వద్ద వైద్యం పొందినట్లు వివరించారు. 10 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి స్వతంత్రంగా లేచి తన పనులు చేసుకునేవాడనని వివరించారు. దాదాపు 23 ఏళ్ల పాటు ఆయుర్వేద మందులు వాడినట్లు చెబుతున్నారు. తోకవడ్లతో చేసిన గంజి శరీరానికి పూసి గంట తర్వాత స్నానం చేస్తే నరాల్లో రక్తప్రసరణ జరిగి కండరాలు వదులు అయ్యేవని వివరిస్తున్నారు. తల్లిదండ్రులు జన్మనిచ్చారని వైద్యుడు పునర్జన్మ నిచ్చారని, తాత స్ఫూర్తితో రాణిస్తున్నట్లు కృష్ణ అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలమూరులో గెలిచి.. దిల్లీలో మెరిసి
[ 28-04-2024]
వెనకబడిన ప్రాంతంగా పేరున్న మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం ఉద్దండులైన ఎంపీలను అందించింది. ఇక్కడ గెలిచిన పలువురికి మంత్రి పదవులు దక్కగా కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. -
భారాస హయాంలోనే అభివృద్ధి
[ 28-04-2024]
50 ఏళ్ల కాంగ్రెస్, తెదేపా పాలనలో పాలమూరుకు ఏమైనా న్యాయం జరిగిందా? అని భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఆయన చేపట్టిన ‘పోరుబాట’ బస్సుయాత్ర శనివారం నాగర్కర్నూల్లో కొనసాగింది. -
యువత.. మార్చేను నేతలరాత
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పాలమూరులోని రెండు లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములపై యువ ఓటర్లు కీలక భూమిక పోషించనున్నారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు యువ మంత్రం జపిస్తున్నారు. -
రానున్న ఐదురోజులు వడగాల్పులు: కలెక్టరు హెచ్చరిక
[ 28-04-2024]
రానున్న ఐదు రోజులు నారాయణపేట జిల్లాలో తీవ్రమైన వడగాల్పులతో పాటు ఉష్ణ్రోగ్రతలు రికార్డు స్థాయిలో 45డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. -
నేడు గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి పరీక్ష
[ 28-04-2024]
మహాత్మా జ్యోతిబా ఫులే వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 28న టీఎస్ ఆర్జేసీ, ఆర్డీసీ సెట్ - 2024 నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి రవిప్రకాశ్ తెలిపారు. -
ఓటర్లు ప్రలోభాలకు లొంగొద్దు
[ 28-04-2024]
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఓటరు విధిగా వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. ఈ నెల 29న ఓటరు చైతన్య శోభాయాత్ర పేరుతో జిల్లా కేంద్రంలో మెగా ర్యాలీ నిర్వహించే కార్యక్రమంపై -
అత్యవసరమైతే తప్ప ఎండలో తిరగొద్దు: కలెక్టర్
[ 28-04-2024]
జిల్లాలో వచ్చే ఐదు రోజులు తీవ్రమైన వడగాలులతో పాటు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 45 డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సంతోష్ సూచించారు. -
క్రియాశీల నేతలకు ‘స్థానిక’ ఎన్నికల్లో ప్రాధాన్యం
[ 28-04-2024]
భాజపా, భారాస అసత్య ప్రచారాలను తిప్పి కొట్టేందుకు కార్యకర్తలు కట్టుబడి పనిచేయాలని.. లోక్సభ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే యువజన కాంగ్రెస్ కార్యకర్తల్లో 60 శాతం మందికి స్థానిక ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తామని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, -
కృష్ణానీటిపై జగన్తో కేసీఆర్ చీకటి ఒప్పందం : యెన్నం
[ 28-04-2024]
కృష్ణానది నీటిని ఆంధ్రప్రదేశ్కు ఇచ్చేలా జగన్తో అప్పటి సీఎం కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
దామరగిద్దలో వివాహిత దారుణహత్య
[ 28-04-2024]
దామరగిద్దలో మహిళ దారుణ హత్యకు గురైన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన మహిళ మరో ఇంట్లో మృతదేహమై కనిపించింది. -
రాజ్యాంగ పరిరక్షణ అందరి కర్తవ్యం
[ 28-04-2024]
రాజ్యాంగ పరిరక్షణ అందరి కర్తవ్యమని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీసీ చర్చి మైదానంలో భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి నిర్వహించిన సభకు కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. -
నేడు బీసీ గురుకులాల్లో ప్రవేశానికి పరీక్ష
[ 28-04-2024]
మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు బీసీ గురుకులాల జిల్లా సమన్వయకర్త సుగుణశ్రీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!