logo

గద్వాల పట్టణంలో భారీ చోరీ

జిల్లాలో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.  గురువారం గద్వాల పట్టణంలో భారీ చోరీ జరిగింది.

Published : 28 Mar 2024 10:53 IST

రాజోలి: జిల్లాలో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.  గురువారం గద్వాల పట్టణంలో భారీ చోరీ జరిగింది.  పట్టణంలోని లింగంబాగ్ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి  ఇంటికి తాళం వేసి  సొంత పనుల నిమిత్తం బెంగళూరు పట్టణానికి వెళ్లారు. బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తలుపులకు వేసిన తాళాలు  పగలగొట్టి బీరువాలో దాచిన  రూ.10 లక్షలకు పైగా నగదు, 40 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు.  ఈ రోజు ఉదయం వెంకటేశ్వర్లు ఇంటికి వచ్చి చూసే సరికి  తాళాలు పగులగొట్టి ఉన్నాయి. దీంతో  చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.  ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని