logo

ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

శాంతినగర్ పోలీస్ స్టేషన్‌లో గురువారం జిల్లా ఎస్పీ రితిరాజ్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 13 మంది బాధితులు వివిధ సమస్యలపై ఆమెకు ఫిర్యాదులు అందజేశారు.

Published : 28 Mar 2024 18:41 IST

రాజోలి: శాంతినగర్ పోలీస్ స్టేషన్‌లో గురువారం జిల్లా ఎస్పీ రితిరాజ్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 13 మంది బాధితులు వివిధ సమస్యలపై ఆమెకు ఫిర్యాదులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని, ప్రజా సమస్యలపైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా భరోసా కల్పించాలని ఆమె అధికారులకు సూచించారు. గతంలో నమోదు అయిన కేసులను పరిశీలించారు. కార్యక్రమంలో  డీఎస్పీ శ్రీ కె.సత్య నారాయణ, శాంతి నగర్ సీఐ రత్నం, ఎస్సై సంతోష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని