నీడ చాటున నిధులు మాయం
ధన్వాడ మండలం కంసాన్పల్లి పంచాయతీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలో ఈ ఏడాది పదివేల మొక్కల్ని పెంచుతున్నారు.
కంసాన్పల్లి నర్సరీలో ఏర్పాటు చేసిన షేడ్నెట్
న్యూస్టుడే, నారాయణపేట న్యూటౌన్: ధన్వాడ మండలం కంసాన్పల్లి పంచాయతీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలో ఈ ఏడాది పదివేల మొక్కల్ని పెంచుతున్నారు. ఎండల తీవ్రత మూలంగా మొక్కలకు నీడ కల్పించేందుకు ఇటీవల పంచాయతీ షేడ్నెట్(నీడ కోసం పరదా)లను కొనుగోలు చేసింది. పదివేల మొక్కలకు రెండింటిని కొనుగోలు చేసి ఏర్పాటు చేశారు. పంచాయతీ కార్యదర్శులు ధర వెల్లడించడంలేదు కానీ ఒక్కొక్క నెట్కు రూ. మూడు వేల వరకు ఖర్చు అవుతున్నాయి. ఈ లెక్కన రెండింటికి కలిపి రూ. ఆరు వేలు ఖర్చు పెట్టారు. పరదాలను శాశ్వత ప్రతిపాదికన కాకుండా తాత్కాలికంగా ఏర్పాటు చేస్తుండటంతో చిన్నపాటి గాలులకే చిరిగిపోతూ పనికి రాకుండా పోతున్నాయి.\
ఉమ్మడి పాలమూరు జిల్లాలో శాశ్వత ప్రాతిపదికన నర్సరీలకు షేడ్నెట్లను ఏర్పాటు చేయడం లేదు. తాత్కాలిక నెట్లను రెండు, మూడుసార్లు ఏర్పాటుచేసి నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. ఉమ్మడిజిల్లాలో 1684 నర్సరీలు ఉన్నాయి. ఈ ఏడాది ప్రతి చోటా పది వేల నుంచి 20 వేల వరకు మొక్కలు పెంచుతున్నారు. ఇవి కాకుండా పాత మొక్కలు ఉండనే ఉన్నాయి. వీటన్నింటి నీడ కోసం వెచ్చిస్తున్న ప్రజాధనం షేడ్నెట్ల పాలవుతోంది.. కొనేటప్పుడు నాణ్యత ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
ఏటా రూ. కోట్ల ఖర్చు
చిన్న పంచాయతీల్లో పదివేల వరకు మొక్కలు పెంచుతుండగా, పెద్ద పంచాయతీల్లో 20వేల వరకు మొక్కల్ని ఏర్పాటు చేశారు. ధన్వాడ మండలం కంసాన్పల్లిలో పెంచుతున్న పది వేల మొక్కకు రెండు షేడ్నెట్లు సరిపోలేదు. కనీసం మూడైనా కావాలి. 20వేల మొక్కలు పెంచుతున్న చోట అయిదు లేక అరైనా అవసరం పడుతుంది. ఈ లెక్కన ఒక్కొక్క నర్సరీకి ప్రతి ఏటా నీడ కోసం రూ. 18వేల వరకు ఖర్చు అవుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 1684 నర్సరీలకు ఏటా రూ.3,03,12,000 వరకు ఖర్చవుతోంది. ఇంత మొత్తంలో పంచాయతీలు వెచ్చిస్తున్నా ఒనగూరిన ఫలితం ఏమీ ఉండటం లేదు. ఈ ఏడాది కొనుగోలు చేసిన పరదాలు నర్సరీ గడువు తీరక ముందే చినిగిపోతున్నాయి. చిన్న పాటి ఈదురు గాలులు వస్తే అంతే సంగతి..ప్రైవేటు నర్సరీలో ఏర్పాటు చేసుకునే విధంగా శాశ్వత ప్రతిపాదికన షేడ్నెట్ల ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో నర్సరీల సంఖ్య
మహబూబ్నగర్ 441
జోగులాంబ గద్వాల 255
నారాయణపేట 280
వనపర్తి 255
నాగర్కర్నూల్ 453
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలమూరులో గెలిచి.. దిల్లీలో మెరిసి
[ 28-04-2024]
వెనకబడిన ప్రాంతంగా పేరున్న మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం ఉద్దండులైన ఎంపీలను అందించింది. ఇక్కడ గెలిచిన పలువురికి మంత్రి పదవులు దక్కగా కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. -
భారాస హయాంలోనే అభివృద్ధి
[ 28-04-2024]
50 ఏళ్ల కాంగ్రెస్, తెదేపా పాలనలో పాలమూరుకు ఏమైనా న్యాయం జరిగిందా? అని భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఆయన చేపట్టిన ‘పోరుబాట’ బస్సుయాత్ర శనివారం నాగర్కర్నూల్లో కొనసాగింది. -
యువత.. మార్చేను నేతలరాత
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పాలమూరులోని రెండు లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములపై యువ ఓటర్లు కీలక భూమిక పోషించనున్నారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు యువ మంత్రం జపిస్తున్నారు. -
రానున్న ఐదురోజులు వడగాల్పులు: కలెక్టరు హెచ్చరిక
[ 28-04-2024]
రానున్న ఐదు రోజులు నారాయణపేట జిల్లాలో తీవ్రమైన వడగాల్పులతో పాటు ఉష్ణ్రోగ్రతలు రికార్డు స్థాయిలో 45డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. -
నేడు గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి పరీక్ష
[ 28-04-2024]
మహాత్మా జ్యోతిబా ఫులే వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 28న టీఎస్ ఆర్జేసీ, ఆర్డీసీ సెట్ - 2024 నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి రవిప్రకాశ్ తెలిపారు. -
ఓటర్లు ప్రలోభాలకు లొంగొద్దు
[ 28-04-2024]
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఓటరు విధిగా వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. ఈ నెల 29న ఓటరు చైతన్య శోభాయాత్ర పేరుతో జిల్లా కేంద్రంలో మెగా ర్యాలీ నిర్వహించే కార్యక్రమంపై -
అత్యవసరమైతే తప్ప ఎండలో తిరగొద్దు: కలెక్టర్
[ 28-04-2024]
జిల్లాలో వచ్చే ఐదు రోజులు తీవ్రమైన వడగాలులతో పాటు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 45 డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సంతోష్ సూచించారు. -
క్రియాశీల నేతలకు ‘స్థానిక’ ఎన్నికల్లో ప్రాధాన్యం
[ 28-04-2024]
భాజపా, భారాస అసత్య ప్రచారాలను తిప్పి కొట్టేందుకు కార్యకర్తలు కట్టుబడి పనిచేయాలని.. లోక్సభ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే యువజన కాంగ్రెస్ కార్యకర్తల్లో 60 శాతం మందికి స్థానిక ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తామని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, -
కృష్ణానీటిపై జగన్తో కేసీఆర్ చీకటి ఒప్పందం : యెన్నం
[ 28-04-2024]
కృష్ణానది నీటిని ఆంధ్రప్రదేశ్కు ఇచ్చేలా జగన్తో అప్పటి సీఎం కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
దామరగిద్దలో వివాహిత దారుణహత్య
[ 28-04-2024]
దామరగిద్దలో మహిళ దారుణ హత్యకు గురైన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన మహిళ మరో ఇంట్లో మృతదేహమై కనిపించింది. -
రాజ్యాంగ పరిరక్షణ అందరి కర్తవ్యం
[ 28-04-2024]
రాజ్యాంగ పరిరక్షణ అందరి కర్తవ్యమని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీసీ చర్చి మైదానంలో భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి నిర్వహించిన సభకు కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. -
నేడు బీసీ గురుకులాల్లో ప్రవేశానికి పరీక్ష
[ 28-04-2024]
మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు బీసీ గురుకులాల జిల్లా సమన్వయకర్త సుగుణశ్రీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!