లైంగిక వేధింపులు.. చిత్రహింసలు.. విసిగిపోయి భర్తను చంపేసినభార్య
భార్య మనసు గ్రహించకుండా పడక గదిలో లైంగికంగా చిత్రహింసలు పెడుతున్న భర్త తీరుపై విసిగిపోయి కడతేర్చింది ఇల్లాలు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగింది. చిన్నకోడూరు మండలం
వివరాలు సేకరిస్తున్న ఎస్ఐ రాజేశ్
చిన్నకోడూరు, న్యూస్టుడే: భార్య మనసు గ్రహించకుండా పడక గదిలో లైంగికంగా చిత్రహింసలు పెడుతున్న భర్త తీరుపై విసిగిపోయి కడతేర్చింది ఇల్లాలు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగింది. చిన్నకోడూరు మండలం విఠలాపూర్ గ్రామానికి చెందిన మర్కంటి ఎల్లయ్య (55), నర్సవ్వ (50) దంపతులు. ముప్పై ఏళ్ల కిందట వివాహమైంది. ఇద్దరు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారి కుమార్తె రేణుకకు గ్రామంలోనే ఇచ్చి ఏడేళ్ల క్రితం పెళ్లి చేశారు. భార్యాభర్తలిద్దరు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. నర్సవ్వను ఆమె భర్త ఏళ్లుగా వేధిస్తున్నాడు. శారీరకంగా కలవాలంటూ తరచూ గొడవపడుతూ ఇష్టారీతిన కొట్టేవాడు. చిన్నపాటి కారణాలకు చితకబాదేవాడు. మూడు నెలల క్రితం కూర సరిగా వండలేదని బాదాడు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకొని గొడవ సద్దుమణిగించారు.
గత సోమవారం భార్య దగ్గరికి రానివ్వక పోవడంతో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ గొడ్డలి కర్రతో కొట్టాడు. ఆమె గ్రామంలోని కుమార్తె ఇంటికి వెళ్లింది. మరోసారి పెద్దలు నచ్చజెప్పడంతో తిరిగి వచ్చింది. బుధవారం రాత్రి మరోసారి లైంగికంగా వేధించాడు. అర్ధరాత్రి తరువాత మరోసారి సతాయించగా ఆమె తీవ్రంగా వ్యతిరేకించింది. ఆమె బయటకు వెళ్లే మార్గం లేకుండా ఇంటి గడియ వేసి, గొడ్డలి కర్రతో భార్యపై ఎల్లయ్య మళ్లీ దాడి చేశాడు. అనంతరం అతను నిద్రలోకి జారుకోగా శారీరక హింసను భరించలేని నర్సవ్వ అక్కడే ఉన్న గొడ్డలితో భర్త మెడ పైన వేటు వేసింది. ఫలితంగా ఎల్లయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తెల్లవారుజామున స్థానికులు గమనించి కుమార్తె కుటుంబానికి చెప్పారు. రక్తపు మడుగులో ఉన్న ఎల్లయ్యను చూసి హతాశులయ్యారు. సీఐ సురేందర్రెడ్డి, ఎస్ఐ రాజేశ్ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. అక్కడే ఉన్న నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న కష్టాలను రోదిస్తూ ఆవేదనాభరితంగా వివరించింది. కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త హామీలు ఇవ్వక.. పాతవి రద్దు చేస్తున్నారు
[ 08-05-2024]
‘కాంగ్రెస్, తెదేపా ప్రభుత్వాల హయాంలో ఘనపూర్ ఆనకట్ట నాశనమైంది, భారాస ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.150 కోట్లతో బాగు చేశాం, ఆనకట్ట ఎత్తుపెంచాం. -
లాడ్జిలో భారీగా వస్త్రాలు స్వాధీనం
[ 08-05-2024]
రామాయంపేట పట్టణంలోని ఓ లాడ్జిలో ఎన్నికల్లో పంపిణీ చేయడానికి సామగ్రి దాచి ఉంచారనే ఫిర్యాదు నేపథ్యంలో మంగళవారం పోలీసులు తనిఖీలు చేశారు. -
ఆరుగాలం పంట.. ఆగమాగం
[ 08-05-2024]
జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. మంగళవారం కురిసిన అకాల వర్షానికి ఆరుబయట ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. -
ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరు?
[ 08-05-2024]
ఇండియా కూటమిలోని పార్టీలు అవినీతిలో కూరుకుపోయి ఉన్నాయని భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఆ పార్టీ మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్రావుకు మద్దతుగా నిర్వహించిన రోడ్షో, కొత్త బస్టాండ్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన ప్రసంగించారు. -
పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం
[ 08-05-2024]
సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాట మేరకు ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని మెదక్ కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి నీలం మధు అన్నారు -
అనుత్తీర్ణులపై ప్రత్యేక శ్రద్ధ
[ 08-05-2024]
ఇంటర్మీడియట్ ఫలితాలు ఈసారి ఆశించిన స్థాయిలో రాలేదు. గత ఏడాదితో పోల్చితే రెండు స్థానాలు ఎగబాకి ఈ ఏడాది కాస్త మెరుగైన ఫలితాలు వచ్చాయి -
ప్రజాస్వామ్య ఆయువుపట్టు.. ఓటరన్నా నిలబెట్టు
[ 08-05-2024]
ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు.. ఓటు. దాని సద్వినియోగంతోనే మనతో పాటు సమాజానికి మేలు చేకూరుతుంది. ఇదే నినాదంతో పలు సంస్థలు, సంఘాల ప్రతినిధులు ఓటరు చైతన్యానికి కంకణబద్ధులయ్యారు. -
పోలీసులు, ఎమ్మెల్యే పేర్లతో వసూళ్లు
[ 08-05-2024]
పోలీసులు, ఎమ్మెల్యే పేరు చెప్పి.. సీఎం రేవంత్రెడ్డి తమ్ముడితో సంబంధాలు ఉన్నాయంటూ ఇసుక, ఇతర వ్యాపారుల నుంచి డబ్బులు డిమాండు చేస్తూ అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్న నిందితుడిని మంగళవారం మెదక్ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
వలస ఓటరు కలిసొచ్చేనా ..
[ 08-05-2024]
ఎన్నికల్లో ప్రతి ఓటరూ కీలకమే. ఉపాధికి వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారిని సైతం స్వగ్రామాలకు రప్పించేందుకు నాయకులు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
కర్షకుల కరుణకు నేతల ఆరాటం
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటోంది. పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలు ప్రచార జోరు పెంచాయి. జిల్లా ఓటర్లలో అత్యధికులది రైతు కుటుంబాల నేపథ్యమే. -
వ్యవసాయాన్ని విధ్వంసం చేసిన కాంగ్రెస్
[ 08-05-2024]
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వ్యవసాయాన్ని విధ్వంసం చేసిందని కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బి.వినోద్కుమార్ విమర్శించారు -
‘గౌరవెల్లి’ నీరందించడమే అత్యంత ప్రాధాన్యం
[ 08-05-2024]
గౌరవెల్లి రిజర్వాయరు ద్వారా సాగునీరందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.
తాజా వార్తలు (Latest News)
-
భారత్లోకి గూగుల్ వ్యాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
-
పల్నాడు జిల్లాలో వైకాపా దౌర్జన్యం.. తెదేపా కార్యకర్తలపై రాళ్ల దాడి
-
ఓటీటీలో ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
రైతులెవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి తుమ్మల
-
ఓడితే ‘నాకౌట్’ కష్టాలు తప్పవు.. ‘ఉప్పల్’లో వరుణుడు ఏం చేసేనో?
-
‘ఆ 20 నిమిషాలు నా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు’: పూంఛ్ ఉగ్రదాడిపై ప్రత్యక్షసాక్షి