రూ.కోట్లలో వ్యయం.. వసతులు మృగ్యం!
గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. యువత, చిన్నారులను ఆటల వైపు మళ్లీంచి వారిని శారీరకంగా ధృడంగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ లక్ష్యం.
క్రీడా ప్రాంగణాల దుస్థితి
నారాయణరావుపేటలో ఇలా..
న్యూస్టుడే, సిద్దిపేట అర్బన్: గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. యువత, చిన్నారులను ఆటల వైపు మళ్లీంచి వారిని శారీరకంగా ధృడంగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ లక్ష్యం. క్షేత్రస్థాయిలో లక్ష్యం నీరుగారిపోతోంది. లెక్కలు చూపించేందుకే అన్నట్టుగా అనేకచోట్ల కేవలం బోర్డుల ఏర్పాటుతో పనులు ముగించారు. జిల్లాలో 499 గ్రామ పంచాయతీలు ఉండగా 455లో క్రీడా ప్రాంగణాలకు స్థలాలు గుర్తించారు. అధికారిక లెక్కల ప్రకారం 422 పంచాయతీల్లో క్రీడా ప్రాంగణాలు పూర్తయ్యాయి. చాలా గ్రామాల్లో అనుకూలంగా లేని స్థలాలను కేటాయించారు. వాటి ఏర్పాటుకు మొత్తం రూ.2.6 కోట్లు ఖర్చు చేశారు. ఎకరం స్థలంలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో కోర్టులు వాటితో పాటు మూడు కోర్టులు లాంగ్ జంప్, వ్యాయామం చేసేందుకు ఒకటి, రెండు వరుసల లైన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొన్నిచోట్ల కేవలం రెండు, మూడు గుంటల భూమిలో చదును చేసి పరికరాలు ఏర్పాటు చేశారు. ఎస్ఐ, కానిస్టేబుల్ రెండో దశ పరీక్షకు సాధన చేసేందుకు ఉపయోగ పడతాయనుకుంటే నిరాశ అవుతోంది.
కొనుగోలు కేంద్రాలుగా..
గ్రామీణ ప్రాంతాల్లో ఆయా క్రీడా ప్రాంగణాలను ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా మార్చారు. నారాయణరావుపేట మండలం కేంద్రంలో రూ.26 వేలు ఖర్చు చేశారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రం అయింది. సిద్దిపేట గ్రామీణ మండలం పుల్లూరు ఉన్నత పాఠశాలలో రూ.42,464 ఖర్చు పెట్టి ఏర్పాటు చేసినా వృథాగా ఉంది. అక్కడ పిచ్చిమొక్కలు పెరిగాయి. సిద్దిపేట గ్రామీణ మండలం పెద్దలింగారెడ్డిపల్లిలో తక్కువ స్థలంలో రూ.12,443 వ్యయంతో క్రీడా పరికరాలు ఏర్పాటు చేశారు. బెజ్జంకి మండలంలో 23 పంచాయతీలు ఉండగా 15 గ్రామాల్లో స్థల సేకరణ పూర్తి చేసి క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. నర్సింహులపల్లి, చీలాపూర్పల్లి, చీలాపూర్, ముత్తన్నపేట, దేవక్కపల్లి గ్రామాల్లో స్థల సేకరణ పూర్తి కాలేదు. లక్ష్మీపూర్, వీరాపూర్, గూడెం గ్రామాల్లో స్థలాలు అనువుగా లేవు. సగానికి పైగా పంచాయతీల్లో బోర్డుల ఏర్పాటు మినహా మిగిలిన పనులు ముందుకు సాగడం లేదు. మైదానం చదును, క్రీడా సామగ్రి, ఇతర సదుపాయాల ఏర్పాటుకు పంచాయతీలే ఖర్చు భరించాల్సి ఉంది. తర్వాత ఉపాధిహామీ పథకం కింద అందజేస్తారు. పనుల ఒత్తిడి, ఆర్థిక భారంతో సర్పంచులు ఉత్సాహన్ని చూపలేకపోతున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు పనులు చేపట్టిన పంచాయతీలకు బిల్లుల మంజూరే లేదు. సర్పంచులు, సిబ్బందితో మాట్లాడి క్రీడా వసతుల ఏర్పాటు, ఇతరత్రా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..