విద్యారంగానికి పది శాతం పైగా నిధుల కేటాయింపు
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించిందని, బడ్జెట్లో 10 శాతం పైగా నిధులు కేటాయించి, వినియోగిస్తున్నట్లు మంత్రి హరీశ్రావు అన్నారు.
ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు
బ్యాటరీ ట్రైసైకిళ్ల వితరణ సందర్భంగా దివ్యాంగులతో మంత్రి హరీశ్రావు, తానా ప్రతినిధులు, అధికారులు
సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించిందని, బడ్జెట్లో 10 శాతం పైగా నిధులు కేటాయించి, వినియోగిస్తున్నట్లు మంత్రి హరీశ్రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలను రద్దు చేసిందని, రాష్ట్రం వాటి బాధ్యత తీసుకుంటోందన్నారు. సిద్దిపేటలో కొనసాగుతున్న జిల్లా స్థాయి ప్రేరణ, వైజ్ఞానిక ప్రదర్శనను శుక్రవారం సందర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే వైద్యవిద్య, అటవి, వ్యవసాయం, మత్స్య, పశుసంవర్ధక, ఇతర విద్యా అనుబంధ సంస్థలపై ఏటా రూ.వేల కోట్ల నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం ఆవిర్భావానికి ముందు విద్యారంగానికి ప్రతి సంవత్సరం రూ.9 వేల కోట్లు నిధులు వెచ్చిస్తే ప్రస్తుతం రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. ఎనిమిదో తరగతి మొదలు ఇంటర్ చదివే విద్యార్థినులకు హెల్త్ - హైజెనిక్, శానిటరీ కిట్ల పంపిణీని మరో 20 రోజుల్లో ప్రారంభిస్తామని వెల్లడించారు. తద్వారా 13 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుందని వివరించారు.
తానా సహకారం
తానా సహకారంతో దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లు, గ్రామాల్లో చదివే విద్యార్థినులకు సైకిళ్లు, ఇద్దరికి ల్యాప్టాప్లు పంపిణీ చేశారు. సిద్దిపేట, ఇర్కోడు, నారాయణరావుపేట, చిన్నకోడూరు, నంగునూరు, బెజ్జంకి ప్రాంతాలకు చెందిన ఆరుగురు దివ్యాంగులకు తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) ఫౌండేషన్ సహకారంతో సుమారు ఇరవై మందికి అందజేశారు. తానా ప్రతినిధులు నిరంజన్, రవి, విశ్వనాథ్, సురేశ్, శ్రీనివాస్, నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఆయా కార్యక్రమాల్లో డీఈఓ శ్రీనివాస్రెడ్డి, తెరాస రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, ఆర్డీవో అనంతరెడ్డి, సుడా అధ్యక్షుడు రవీందర్రెడ్డి, డీఈ ఖాజా తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడు రంగులు ఎగరాలి.. మెతుకు సీమ మురవాలి
[ 10-05-2024]
ముష్కరుల చేతిలో ఇందిరాగాంధీ తూటాలకు బలైనప్పుడు దేశానికి ప్రధానిగా, మెదక్కు ఎంపీగా ఉన్నారని, చివరి శ్వాస, ఆఖరి రక్తపుబొట్టు చిందేవరకు ఈ ప్రాంతానికి ఆమె ప్రాతినిధ]్యం వహించారని.. మెదక్ ఎంపీగా కొనసాగుతుండగానే ఆమె కన్ను మూశారని సీఎం రేవంత్రెడ్డి గుర్తుచేశారు. -
343 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
[ 10-05-2024]
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. -
ఓటెందుకు వేయాలంటే..
[ 10-05-2024]
ఎంత ఎక్కువ పోలింగ్ నమోదైతే అంత చక్కటి తీర్పు వస్తుందన్నది నిపుణుల మాట. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికలో గణనీయంగా పోలింగ్ నమోదవుతున్నా.. -
భారాస అభ్యర్థికి మద్దతిస్తూ తీర్మానం
[ 10-05-2024]
చిన్నకోడూరు మండలంలోని విఠలాపూర్ యాదవ సంఘం సభ్యులు మెదక్ భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి ఓట్లు వేస్తామని గురువారం ఏకగ్రీవ తీర్మానం చేసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. -
ప్రతిష్ఠాత్మకం.. సార్వత్రికం
[ 10-05-2024]
పార్టీ అభ్యర్థి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూనే సొంత నియోజకవర్గంలో మెజార్టీ సాధించడం జహీరాబాద్ లోక్సభ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. -
స్థానిక నాయకా.. బాధ్యత నీదిక!
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికలు ఏడు అసెంబ్లీ నియోజవర్గాలకు విస్తరించి ఉండటంతో సమయాభావంతో అభ్యర్థులు, స్టార్ ప్రచారకర్తలు అన్నిచోట్లా రోడ్డుషోలు, కార్నర్ మీటింగ్లు, ఇంటింటి ప్రచారాలు చేపట్టలేరు. -
వేగులు.. నేతలకు గుబులు
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గరపడింది. ఈ నెల 13న పోలింగ్ నిర్వహించనున్నారు. -
ఓటు పవిత్రమైనది
[ 10-05-2024]
ఓటు పవిత్రమైనది. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఇది మన బాధ్యతగా గుర్తించాలి. -
నిజమైన హిందూ ధర్మ పరిరక్షకుడు కేసీఆర్
[ 10-05-2024]
‘శత చండీ హోమం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలో కాంగ్రెస్, భాజపా ముఖ్యమంత్రులు ఎవరూ ఈ హోమం చేయలేదు. -
మోదీతో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉండవు
[ 10-05-2024]
కేంద్రంలో నరేంద్రమోదీ మళ్లీ ప్రధాని అయితే ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉండవని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. -
12 వేల కోట్లతో అభివృద్ధి చేశా: బండి సంజయ్
[ 10-05-2024]
కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీలు ఇచ్చి మోసం చేసిందని, వీటి అమలుకు ప్రశ్నించేది, కోట్లాడేది తానేనని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
గురుశిష్యుల ప్రయాణమే.. బ్రహ్మచారి
[ 10-05-2024]
ముప్పై ఏళ్ల గురుశిష్యుల కలల ప్రయాణంతో పురుడుపోసుకుంది బ్రహ్మచారి చిత్రం. -
మద్యం తాగొద్దన్నందుకు తండ్రిని హతమార్చిన తనయుడు
[ 10-05-2024]
మద్యం తాగి కుటుంబ సభ్యులను హింసిస్తున్నావని, పద్ధతి మార్చుకోవాలని సూచించిన తండ్రిని, తనయుడు కత్తితో పొడిచి చంపిన ఘటన సిద్దిపేట జిల్లాలో దౌల్తాబాద్ మండలంలో చోటుచేసుకుంది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 10-05-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా నిందితుణ్ని కుకునూరుపల్లి పోలీసులు అరెస్టు చేశారు.