పల్లెల్లో గెలిచి.. పదవులు వరించి
చట్టసభల్లో ప్రజాప్రతినిధులుగా ఎంపికయ్యే వారికి గతంలో పాలనాపరంగా అనుభవం ఉంటే ప్రజలకు మరింత మేలు జరిగే అవకాశం ఉంటుంది. గ్రామస్థాయిలో పరిపాలన కొనసాగించిన వారికి అన్ని అంశాలపై అవగాహన ఉండటంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తారు.
న్యూస్టుడే,మెదక్, చేగుంట, వెల్దుర్తి
చట్టసభల్లో ప్రజాప్రతినిధులుగా ఎంపికయ్యే వారికి గతంలో పాలనాపరంగా అనుభవం ఉంటే ప్రజలకు మరింత మేలు జరిగే అవకాశం ఉంటుంది. గ్రామస్థాయిలో పరిపాలన కొనసాగించిన వారికి అన్ని అంశాలపై అవగాహన ఉండటంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తారు. సర్పంచి, పంచాయతీ సమితి అధ్యక్షుడిగా, జడ్పీటీసీ సభ్యుడిగా, ఎంపీపీగా ఆయా పదవుల్లో కొనసాగిన వారు అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యేగా, ఎంపీలుగా ఎన్నికయ్యారు. వారికి క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాసమస్యలపై పూర్తిస్థాయిలో పట్టు ఉండడంతో పాటు, వారి తరఫున పోరాడే అవకాశం ఉంటుంది. ఈ అంశంపై ‘న్యూస్టుడే’ కథనం...
సీఎం సభను విజయవంతం చేయండి
నర్సాపూర్: ఈనెల 16న నర్సాపూర్లో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభను జయప్రదం చేయాలని భారాస అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి కోరారు. ఈ మేరకు నర్సాపూర్లో వెల్దుర్తి వెళ్లే మార్గంలోని ప్రాంతాలను సీఎం బహిరంగ సభ నిర్వహణకు ఆదివారం సాయంత్రం పరిశీలించారు. నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు.
వలస ఓటర్లపై వల
టేక్మాల్: ఎన్నికలు రాగానే గ్రామాల నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లపై నాయకులు దృష్టి సారిస్తారు. టేక్మాల్ మండల పరిధిలోని సూరంపల్లి, కమ్మరికత్త, దాదాయిపల్లి, ఎల్లుపేట, కోరంపల్లి, ధనుర, తదితర గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లి నివాసం ఉంటున్నారు. వారి వివరాలను, చరవాణి నంబర్లు సేకరించి ఆయా పార్టీల నాయకులు జాబితా రూపొందించారు. వారికి నాయకులు ఫోన్ చేసి తమ పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రయాణ ఖర్చులు సైతం ఇస్తామని ఎర వేస్తున్నారు.
11 ఏళ్ల పాటు...
పాపన్నపేట మండలం యూసుఫ్పేటకు చెందిన పట్లోళ్ల కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎంపికయ్యారు. 1970లో పట్లోళ్ల నారాయణరెడ్డి యూసుఫ్పేట సర్పంచిగా గెలుపొందారు. 11ఏళ్ల పాటు పనిచేశారు. పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ తరఫున పోటీచేసి 1989లో మెదక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994 వరకు కొనసాగి, ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2004లో ఆయన కుమారుడు శశిధర్రెడ్డి జనతా పార్టీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా..
చెరుకు ముత్యంరెడ్డి మొదట తొగుట సర్పంచిగా దాదాపు 18 ఏళ్లు పనిచేశారు. అనంతరం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989, 1994, 1999లో దొమ్మాట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో నాలుగో సారి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెదేపా హయాంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా, శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్గా నియామకం అయ్యారు. సర్పంచి తర్వాత సహకార సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
సర్పంచి నుంచి ఎమ్మెల్యేగా
పాపన్నపేట మండలం కొత్తపల్లికి చెందిన కరణం రామచందర్రావు. 1972లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1966లో కొత్తపల్లి గ్రామానికి సర్పంచిగా పనిచేశారు. 1972లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన తొలిసారే శాసనసభలో అడుగుపెట్టారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1983లో ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో తొలిసారి మంత్రి పదవి వరించింది. చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలో మంబోజిపల్లిలో నిజాం చక్కెర కర్మాగారం, మెదక్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటైంది.
సర్పంచిగా 22 ఏళ్ల అనుభవం
రామాయంపేట మాజీ ఎమ్మెల్యే అంతిరెడ్డిగారి విఠల్రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా కొనసాగారు. మెదక్ జిల్లా మాసాయిపేటకు చెందిన ఆయన యువజన సంఘం అధ్యక్షుడి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి 1986, 1994లలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1959 నుంచి 1981 వరకు మాసాయిపేట సర్పంచిగా కొనసాగారు. 1981 నుంచి 1986 వరకు రామాయంపేట సమితి అధ్యక్షుడిగా వ్యవహరించాను. సర్పంచిగా 22ఏళ్లు, సమితి అధ్యక్షునిగా అయిదేళ్లు, ఎమ్మెల్యేగా రెండు దఫాలు పదవులు చేపట్టిన అనుభవంఆయనది.
వార్డు సభ్యుడిగా గెలిచి..
చేగుంట మండలం పొలంపల్లికి చెందిన రామన్నగారి శ్రీనివాస్రెడ్డి(ఆర్ఎస్ వాసురెడ్డి) మొదట చేగుంట ఉప సర్పంచిగా పనిచేశారు. గతంలో పొలంపల్లి చేగుంట మదిర గ్రామంగా ఉండేది. అక్కడ వార్డు సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం చేగుంట ఉప సర్పంచిగా ఎన్నికయ్యారు. 1985లో రామాయంపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాలుగేళ్ల పాటు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేశారు.
మండలం ఒకటి.. ఓటు వేసేది మరోటి
తూప్రాన్, మనోహరాబాద్: గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ మండలం పరికిబండ, పోతారం గౌతోజి గూడెం మూడు గ్రామాల ప్రజలు నర్సాపూర్ నియోజకవర్గ అభ్యర్థులకు ఓటు వేయనున్నారు. మూడు గ్రామాలు గతంలో శివ్వంపేట మండలంలో ఉండగా, గ్రామపంచాయతీలు ఏర్పాటు సమయంలో మనోహరాబాద్ మండలంలోకి కలిపారు. ఈ మూడు గ్రామాల ప్రజలు పేరుకు గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నా ఓటు మాత్రం నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రాతినిథ్యం వహించే అభ్యర్థులకు వేయనున్నారు. ఈ మూడు గ్రామాల్లో గజ్వేల్ నియోజకవర్గ నాయకులతో పాటు నర్సాపూర్ నియోజకవర్గ నాయకులు సైతం ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఎమ్మెల్యే పేరుతో కాలనీ
నర్సాపూర్: ప్రజాప్రతినిధులు అందించిన సేవలకు గుర్తింపుగా ప్రజలు వారిపై అభిమానం చాటుతారు. నర్సాపూర్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన చౌటి జగన్నాథరావు పేరు మీద నర్సాపూర్లో ఓ కాలనీ ఉంది. నర్సాపూర్కు చెందిన జగన్నాథరావు 1980లో అంజయ్య మంత్రివర్గంలో ఆబ్కారీ మంత్రిగా పనిచేశారు. 1982లో భవనం వెంకట్రాంరెడ్డి మంత్రి వర్గంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇదే సమయంలో ఆయన ఇక్కడ వంద మందికి పైగా ఇళ్లు లేని పేదలకు ప్రభుత్వం నుంచి అసైన్డు భూములను కేటాయించారు. స్థలాలు పొందిన పేదలు ప్రభుత్వ సహకారంతో అప్పట్లో పక్కా ఇళ్లను నిర్మించుకున్నారు. జగన్నాథరావు హయాంలో ఈ కాలనీ ఏర్పాటు కావడంతో ఆయన పేరు పెట్టారు. దీన్ని ఆనుకొని మాజీ మంత్రి సునీతారెడ్డి పేరుతో కూడా ఓ కాలనీ ఏర్పాటైంది. ఆమె ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రెండొందల మందికి పైగా పేదలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు కేటాయించారు. వారు సొంత ఇళ్లను నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి నుంచే ఓటు.. చైతన్యం చాటు
[ 02-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువ ఎనలేనిది. దాన్ని పొందడమే కాకుండా.. వినియోగించుకోవడం అత్యంత ప్రధానం. వంద శాతం ఓటింగ్ ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యం. వయోభారం, అంగవైకల్యంతో నడవలేని స్థితిలో ఉన్న వారిలో కొందరు ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. -
ఓటింగ్ శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి
[ 02-05-2024]
ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉండడంతో అవసరమైన బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లను సిద్ధం చేస్తున్నారు. -
గోబెల్స్ ప్రచారం నమ్మొద్దు: హరీశ్రావు
[ 02-05-2024]
భాజపా అభ్యర్థి రఘునందన్రావు కల్పిత దృశ్యాలు సృష్టించి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. గత దుబ్బాక ఉప ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అభ్యర్థి భారాసలో చేరారని వీడియో సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందారన్నారు. -
వసతులు కొరవడి.. అన్నదాత అలజడి
[ 02-05-2024]
జిల్లాలో యాసంగి వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉత్పత్తులు చేతికి అందడంతో ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకు వస్తున్నారు. -
ఎండ పెరిగి.. మీటర్లు తిరిగి
[ 02-05-2024]
ఎండల తీవ్రత పెరగడంతో విద్యుత్తు వినియోగం పెరిగి గృహజ్యోతి కింద జీరో బిల్లులు పొందే లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయింది. ప్రభుత్వ నిబంధనల మేరకు 200 యూనిట్లలోపు వినియోగించుకునే వారికి జీరో బిల్లు ఇస్తారు. -
రాజ్యాంగ పరిరక్షణకే కాంగ్రెస్కు మద్దతు
[ 02-05-2024]
ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నామని ఆచార్య కోదండరాం అన్నారు. బుధవారం మెదక్లో ఆయన మాట్లాడారు. -
కార్మికుల హక్కుల సాధనకు ఐక్య పోరాటం
[ 02-05-2024]
కార్మికుల హక్కుల సాధన కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ పిలుపునిచ్చారు. కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకొని బుధవారం కౌడిపల్లి మండల కేంద్రంలో భవన -
అప్రమత్తతోనే ప్రశాంతం
[ 02-05-2024]
ఎన్నికలు సజావుగా సాగాలంటే.. అన్ని స్థాయిల్లో అప్రమత్తత అవసరం. ప్రధానంగా పటిష్ఠ బందోబస్తు.. నిఘా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. లోక్సభ ఎన్నికల వేళ నూతన సాంకేతికత తోడుగా ప్రశాంతంగా ఎన్నికల క్రతువు పూర్తి చేసేందుకు చర్యలు ఆరంభించారు. -
రాజకీయ భవిష్యత్తు.. చేరికలను ప్రోత్సహిస్తూ..
[ 02-05-2024]
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బల్దియాకు చెందిన సీనియర్ నేత రాబోయే పురపాలిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలన్న తలంపుతో తన అనుచరులతో ఓ ప్రధాన పార్టీ నుంచి మరో ప్రధాన పార్టీలో చేరిపోయారు. -
కేసీఆర్ మా ఫోన్లు ట్యాపింగ్ చేయించారు
[ 02-05-2024]
మల్లన్న సాగర్ నిర్వాసితులమైన తమ ఫోన్లను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్యాపింగ్ చేయించారని నిర్వాసితులు ఎండీ హయాతుద్దీన్, వై.శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. బుధవారం సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో వారు మాట్లాడుతూ.. -
జొన్న రైతులకు బకాయిల బెంగ
[ 02-05-2024]
అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. పంట సాగు నుంచి విపణికి తరలించి విక్రయాలు చేపట్టే వరకు ఇదే పరిస్థితి. ఇన్ని ఇబ్బందులను అధిగమించినా పంట విక్రయాల బిల్లుల చెల్లింపులో జాప్యం వల్ల కర్షకులకు ఎదురుచూపులు తప్పడం లేదు. -
మహిళా సంఘాలకు సీఎస్సీ కేంద్రాలు
[ 02-05-2024]
పొదుపులు.. బ్యాంకుల్లో అప్పులు తీసుకోవడం.. జమ చేయడం వరకే పరిమితమైన మహిళా పొదుపు సంఘాల సభ్యులు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన పనులు చేపట్టనున్నారు. -
7, 8 తేదీల్లో మాక్ పోలింగ్పై శిక్షణ
[ 02-05-2024]
ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. -
ఓటమి భయంతోనే భాజపా ఆరోపణలు
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా తక్కువ సీట్లకే పరిమితమయ్యే పరిస్థితి ఉందని, అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్పై ఆరోపణలు చేస్తున్నారని జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ ఆరోపించారు. -
నకిలీ పత్రాలతో ప్లాట్ల విక్రయం
[ 02-05-2024]
నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లు విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బుధవారం ఎస్పీ చెన్నూరి రూపేష్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమీన్పూర్కు చెందిన దుర్గాప్రసాద్, సుబ్బారావు, రవి గౌడ్ ముఠాగా ఏర్పడ్డారు.