అత్యధికులు పట్టభద్రులే!
శాసనసభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది పట్టభద్రులే ఉన్నారు. వీరిలో అధికులు కోటీశ్వరులు కావడం గమనార్హం. చదువుకున్న వారు రాజకీయాలపై ఆసక్తి చూపడమే కాకుండా, రాణిస్తున్న సందర్భాలు అధికంగానే ఉన్నాయి.
జిల్లాలోని ప్రధాన పార్టీల అభ్యర్థుల విద్యా నేపథ్యం
శాసనసభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది పట్టభద్రులే ఉన్నారు. వీరిలో అధికులు కోటీశ్వరులు కావడం గమనార్హం. చదువుకున్న వారు రాజకీయాలపై ఆసక్తి చూపడమే కాకుండా, రాణిస్తున్న సందర్భాలు అధికంగానే ఉన్నాయి. జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థుల విద్యా నేపథ్యం, అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తులు, నేర చరితపై కథనం.
- న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్, జోగిపేట, జహీరాబాద్, నారాయణఖేడ్, జిన్నారం.
వైద్య, న్యాయ వృత్తి నుంచి..
నారాయణఖేడ్ కాంగ్రెస్ అభ్యర్థి పట్లోళ్ల సంజీవరెడ్డి ఎంబీబీఎస్, డిప్లొమా ఇన్ చైల్డ్హెల్త్(డీసీˆహెచ్) చదువుకున్నారు. ఖేడ్ భాజపా అభ్యర్థి జన్వాడే సంగప్ప పీˆజీ(ఎంసీˆజే) పూర్తి చేశారు. సంగారెడ్డిలో బహుజన రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న మ్యాతరి మనోహర్ బీఏ, ఎల్ఎల్బీ చదివారు. సంగారెడ్డి నుంచి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి పి.బాపురెడ్డి బీఏ, ఎల్ఎల్ఎం, కోవూరి సత్యనారాయణ గౌడ్ ఎంఏ, కొల్కూర్ ప్రతాప్ ఎంబీ బీఈడీ పూర్తి చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి పదో తరగతి, భారాస అభ్యర్థి చింతా ప్రభాకర్ పది, భాజపా అభ్యర్థి పులిమామిడి రాజు పది వరకు చదివారు. అందోలు కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనరసింహ బీటెక్(సివిల్ ఇంజినీరింగ్) పూర్తి చేశారు. అందోలు భాజపా అభ్యర్థి, సినీ నటుడు పల్లి బాబూమోహన్ బీఏ చదివారు. అందోలు భారాస అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ ఎల్ఎల్బీ పూర్తి చేశారు. నారాయణఖేడ్ భారాస అభ్యర్థి మహారెడ్డి భూపాల్రెడ్డి బీఎస్సీ పూర్తి చేశారు. జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎ.చంద్రశేఖర్ బీఎస్సీ పూర్తి చేసి కొంతకాలం పశువైద్యాధికారిగా పనిచేశారు. జహీరాబాద్ భారాస అభ్యర్థి కె.మాణిక్రావు ఇంజినీరింగ్ చదివి ఆర్టీఓగా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు.
కోటీశ్వరులూ ఎక్కువే..
నామినేషన్ల సమయంలో పేర్కొన్న అఫిడవిట్ల ప్రకారం జిల్లాలో సంగారెడ్డి భాజపా అభ్యర్థి పులిమామిడి రాజుకు ఎక్కువ ఆస్తులు (స్థిర, చరాస్తులు) ఉన్నాయి. జిల్లాలోని అయిదు నియోజకవర్గాల పరిధిలో 13 మంది అభ్యర్థులు కోటీశ్వరులు కావడం గమనార్హం.
కొందరిపై పోలీసు కేసులు
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై అత్యధికంగా 20 కేసులు నమోదయ్యాయి. ఖేడ్ భారాస అభ్యర్థి భూపాల్రెడ్డిపై రెండు, ఖేడ్ కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డిపై మూడు, ఖేడ్ భాజపా అభ్యర్థి సంగప్పపై రెండు, జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్పై నాలుగు కేసులున్నాయి.
వీరికి అప్పులు లేవు
జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా అప్పులు లేనివారు ముగ్గురున్నారు. జగ్గారెడ్డి, చింతా ప్రభాకర్, బాబూమోహన్లకు అప్పులు లేనట్లు ఎన్నికల అఫిడవిట్లలో చూపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోక్సభ నియోజకవర్గ ఓటర్లు జీ 18.28 లక్షలు
[ 28-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 18.28 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. -
ఎండ ప్రచండం.. ప్రచారానికి గండం!
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ పూర్తయింది. మెదక్ లోక్సభ స్థానానికి సంబంధించి తొలి అంకం ముగిసి అభ్యర్థుల లెక్కతేలింది. ఇక ప్రచారం మరింతగా వేడెక్కనుంది. -
భారాస హయాంలోనే తెలంగాణ అభివృద్ధి: పద్మ
[ 28-04-2024]
పద్నాలుగు ఏళ్ల పోరాటం వల్ల ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందని, అనంతరం ప్రభుత్వం ఏర్పాటయ్యాక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి...అన్ని రంగాలను ముందుకు నడిపి తొమ్మిదిన్నరేళ్లలో భారాస అధినేత కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా -
కాంగ్రెస్ను గెలిపిస్తేనే పురోగతి
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే మెదక్ అభివృద్ధి జరుగుతుందని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. -
డార్మిటరీలో స్నేహం.. చోరీల వ్యూహం
[ 28-04-2024]
ఎంజీబీఎస్ వద్ద ఉన్న డార్మిటరీలో పరిచయమై సెల్ఫోన్, ద్విచక్రవాహనాలను దొంగలిస్తూ జల్సాలు చేస్తున్న ఇద్దరు నిందితులను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. -
వక్ఫ్బోర్డు స్థలాల్లో ఆగని ఆక్రమణల పర్వం
[ 28-04-2024]
రాజకీయ పలుకుబడి ధీమాతో కబ్జాదారులు వక్ఫ్బోర్డు స్థలాల్లో ఇష్టారీతిన నిర్మాణాలు చేపడుతున్నారు. ఇటీవల వక్ఫ్బోర్డుకు ఛైర్మన్ను నియమించిన నేపథ్యంలోనైనా వాటి స్థలాల్లో ఆక్రమణలకు అడ్డుకట్ట పడుతుందని భావించినా... -
తెలంగాణ గాంధీ కేసీఆర్: చింతా ప్రభాకర్
[ 28-04-2024]
ప్రాణాల సైతం లెక్కచేయకుండా తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్ తెలంగాణ గాంధీ అని సంగారెడ్డి ఎమ్మెల్యే, భారాస జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు. -
పెరుగుతుందా.. తగ్గుతుందా..!
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు రూపొందించుకుని ప్రచారం చేస్తున్నాయి. జహీరాబాద్ లోక్సభ పరిధిలో మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో పోలింగ్శాతం ప్రభావంపై ఆయా పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. -
కేసీఆర్ ఒక్కరే!
[ 28-04-2024]
గజ్వేల్ నుంచి పార్లమెంటు బరిలో గెలిచిన నేతగా కేసీఆర్ ఒక్కరే రికార్డు సృష్టించారు. గజ్వేల్ నియోజకవర్గం 2008 వరకు అప్పటి సిద్దిపేట లోక్సభ స్థానం పరిధిలో ఉండేది. -
పోలింగ్ కేంద్రాలు.. సమగ్ర వివరాలు
[ 28-04-2024]
ఈ సారి లోక్సభ ఎన్నికలను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఎలాంటి అవకతవకలు, అక్రమాలు జరగకుండా ఉండేలా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. -
ఓట్లు కురిసె.. ఆధిక్యం మెరిసె..
[ 28-04-2024]
పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధిస్తేనే ముందంజలో నిలుస్తారు. ఇదే ఎన్నికల్లోనూ వర్తిస్తుంది. తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ఓట్ల ఆధిక్యమే కీలకం. అందుకే పోటీదారులు దీనిపై ప్రత్యేక దృష్టిసారిస్తారు. -
హైదరాబాద్ వీడి చేవెళ్లలో చేరి..
[ 28-04-2024]
జిల్లా కేంద్రమైన వికారాబాద్, తాండూరు, చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్లు 2008 వరకు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉండేవి. -
ఎన్నికల సంఘం వాట్సాప్ ఛానల్...
[ 28-04-2024]
సాంకేతికతలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటోంది ఎన్నికల సంఘం. ఐదేళ్లకోసారి జరిగే ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక మార్పు కనిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం హోరెత్తుతోంది. -
61వ రాజ్యాంగ సవరణతో..
[ 28-04-2024]
తొలినాళ్లలో ఓటు వేయడానికి కనీస వయసు 21 ఏళ్లుగా ఉండేది. దీన్ని రాజ్యాంగంలోనూ పొందుపర్చారు. అయితే 1988లో 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించాలని అప్పటి పాలకులు నిర్ణయించారు.