కొత్తగా వచ్చింది ఇద్దరు స్థిరత్వం చూపింది ఇద్దరు
సిద్దిపేట జిల్లాలో కేసీఆర్, హరీశ్రావు తమ గెలుపును మరోసారి స్థిరం చేసుకోగా... కొత్త ప్రభాకర్రెడ్డి, పొన్నం ప్రభాకర్ మొదటిసారి విజయం వరించి వచ్చారు. శాసనసభా ఎన్నికల ఫలితాల్లో సిద్దిపేటలో భారాస అభ్యర్థి హరీశ్రావు చక్కటి మెజార్టీని కైవసం చేసుకున్నారు.
సిద్దిపేట ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఫలితాల అనంతరం కొత్త ప్రభాకర్ రెడ్డికి ధ్రువీకరణ పత్రం అందజేస్తున్న అదనపు పాలనాధికారి గరిమ అగ్రవాల్
సిద్దిపేట జిల్లాలో కేసీఆర్, హరీశ్రావు తమ గెలుపును మరోసారి స్థిరం చేసుకోగా... కొత్త ప్రభాకర్రెడ్డి, పొన్నం ప్రభాకర్ మొదటిసారి విజయం వరించి వచ్చారు. శాసనసభా ఎన్నికల ఫలితాల్లో సిద్దిపేటలో భారాస అభ్యర్థి హరీశ్రావు చక్కటి మెజార్టీని కైవసం చేసుకున్నారు. గజ్వేల్లో కొంత ఆధిక్యం తగ్గినా కేసీఆర్ హ్యాట్రిక్ గెలుపు జాబితాలో చేరారు. మెదక్ ఎంపీగా సేవలందిస్తూనే కొత్త ప్రభాకర్రెడ్డి.. దుబ్బాకలో జరిగిన పోటీలో సత్తా చాటారు. పొన్నం ప్రభాకర్ మాత్రం హుస్నాబాద్లో వొడితల సతీశ్కుమార్ హ్యాట్రిక్ కలకు గండి కొట్టారు. రాజకీయ జీవితంలో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు.
‘హరీశ్’మయం
ఎమ్మెల్యేగా ఎన్నికైన హరీశ్రావు తరఫున భారాస ఏజెంటు మోహన్లాల్, నాయకుడు పాల సాయిరాంకు ధ్రువపత్రాన్ని అందిస్తున్న రిటర్నింగ్ అధికారి రమేశ్బాబు - న్యూస్టుడే, సిద్దిపేట, గజ్వేల్
న్యూస్టుడే, సిద్దిపేట, అర్బన్, టౌన్, చిన్నకోడూరు, నంగునూరు: సిద్దిపేటలో తన్నీరు హరీశ్రావు గెలవగా మిగిలిన మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధరావతు (డిపాజిట్) దక్కలేదు. సిద్దిపేట నియోజకవర్గంలో మొత్తం 1,81,834 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 21 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అందులో భారాస నుంచి హరీశ్రావు - 1,05,515, కాంగ్రెస్ అభ్యర్థి పూజల హరికృష్ణ - 23,206, భాజపా అభ్యర్థి దూది శ్రీకాంత్రెడ్డి - 23,201, బీఎస్పీ అభ్యర్థి చక్రధర్- 16,610 ఓట్లు పొందారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస అభ్యర్థి హరికృష్ణపై హరీశ్.. 82,308 ఓట్లతో ఘన విజయం సాధించారు. కాగా గత ఎన్నికల్లో హరీశ్రావు 1,18,699 ఓట్ల మెజార్టీని పొందారు. గతంతో పోల్చితే ఈసారి 36,391 ఓట్లు తగ్గాయి. 2018 ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్, భాజపా, బీఎస్పీ పార్టీలు నియోజకవర్గంలో పుంజుకున్నాయి. నాడు కాంగ్రెస్ పొత్తులో భాగంగా తెజస అభ్యర్థి భవానిరెడ్డి బరిలో నిలవగా సమీప ప్రత్యర్థిగా ఆమె 12,596 ఓట్లు పొందారు. తరువాతి స్థానంలో భాజపా 11,266, బీఎస్పీ అభ్యర్థులు 718 ఓట్లు ఖాతాలో వేసుకున్నారు. అప్పట్లో కూడా భారాస ప్రత్యర్థులకు ఎవరికి డిపాజిట్ దక్కలేదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ సమీప ప్రత్యర్థిగా నిలిచింది. భాజపా తన ప్రభావాన్ని చాటింది. హస్తం, కమలం పార్టీల మధ్య 5 ఓట్లు మాత్రమే తేడాగా ఉంది. ఇక బీఎస్పీ అభ్యర్థి గతంతో పోల్చితే 15,892 అధికంగా ఓట్లు సాధించడం గమనార్హం.
తగ్గినా.. హ్యాట్రిక్
ఎమ్మెల్యేగా ఎన్నికైన కేసీఆర్ తరఫున ధ్రువీకరణ పత్రాన్ని ఎఫ్డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డికి అందిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ అదనపు కలెక్టర్లు
గజ్వేల్: గజ్వేల్లో 2014లో మొత్తం 86,694 ఓట్లుసాధించిన కేసీఆర్ 19,391 మెజారిటీతో గెలుపొందారు. 2018లో ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పోటీ చేసిన ఆయనకు 125444 ఓట్లు రాగా 58290 మెజారిటీతో గెలిచారిఉ.రెండోసారి గజ్వేల్ నుంచి పోటీ చేసి ఇప్పుడు 111684 ఓట్లు వచ్చాయి. 45031 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గతం కంటే 13259 మెజారిటీ తగ్గింది. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డికి 74443 ఓట్లు వచ్చాయి. 7175 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014లో పోటీ చేసిన నర్సారెడ్డికి 34085 ఓట్లు వచ్చాయి. కేసీఆర్ చేతిలో ఓడారు.ఇప్పుడు రెండోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు 32568 ఓట్లు వచ్చాయి.
హుస్నాబాద్కు మకాం మార్చి..
పాలనాధికారి ప్రశాంత్ జీవన్పాటిల్ నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుంటున్న హుస్నాబాద్ విజేత పొన్నం ప్రభాకర్, ఆర్ఓ బెన్షాలోమ్ ఇతర అధికారులు
హుస్నాబాద్: హుస్నాబాద్ శాసనసభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఘన విజయం సాధించారు. ఆయన భారాస అభ్యర్థి, శాసనసభ్యుడు వొడితల సతీశ్కుమార్పై 19,344 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ స్థానానికి మొత్తం 19మంది అభ్యర్ధులు రంగంలో ఉండగా ప్రధానంగా కాంగ్రెస్, భారాస మధ్యనే పోటీ జరిగింది. ఎన్నికల్లో మొత్తం ఓట్లు 205017 పోల్ అయ్యాయి. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి ప్రభాకర్కు 99,769ఓట్లు రాగా, భారాస అభ్యర్థి సతీశ్కుమార్కు 81291 ఓట్లు లభించాయి. భాజపా అభ్యర్థి బొమ్మ శ్రీరాంచక్రవర్తికి 8338 ఓట్లు వచ్చాయి. మూణ్నెల్ల క్రితం హుస్నాబాద్కు ప్రభాకర్ మకాం మార్చారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రధానంగా మెట్టప్రాంతానికి సాగునీరందించే గౌరవెల్లి, గండిపల్లి, తోటపల్లి రిజర్వాయర్లను కాంగ్రెస్ హయాంలో 2007లో శంకుస్థాపన చేసినా ఇంతవరకు పూర్తి చేయలేదని ప్రధానంగా ప్రచారం చేశారు. మాజీ శాసనసభ్యుడు ప్రవీణ్రెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డితో కలసి ప్రచారం నిర్వహించడం ఇరుపార్టీలో ఐక్యత కన్పించింది. ముఖ్యంగా ప్రియాంక గాంధీ సభకు భారీగా జనం తరలిరావడం, పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ వైద్య కళాశాల ప్రకటించడం ఆకట్టుకుంది. 2018 ఎన్నికల్లో తెరాస అభ్యర్థి వొడితల సతీశ్కుమార్, ప్రజాకూటమి సీపీఐ అభ్యర్థి చాడ వెంకటరెడ్డిపై 70,530 మెజారిటితో విజయం సాధించారు. 2014 లో వొడితల సతీశ్కుమార్ కాంగ్రెస్ అభ్యర్థి అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డిపై 34,269 ఓట్లతో విజయం సాధించారు.
ఉప ఎన్నిక ప్రభావం నిల్
చేగుంట: దుబ్బాకలో భాజపా, కాంగ్రెస్ ప్రభావం చూపలేకపోయాయి. మొత్తం 11 మంది రంగంలో ఉన్నారు. మొత్తం ఓట్లు 1,98,100. ఇందులో పోలైనవి 1,74,834 ఓట్లు. భారాస అభ్యర్ధి కొత్త ప్రభాకర్రెడ్డికి 97,879, భాజపా అభ్యర్ధి రఘునందన్రావుకు 44,366, కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్రెడ్డికి 25,235 ఓట్లు వచ్చాయి.భాజపా అభ్యర్థి రఘునందన్రావుకు 2018లో 22,595 ఓట్లు వచ్చాయి.నాడు రామలింగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిని 62,421 మెజారిటీతో ఓడించారు. 2020 ఉప ఎన్నికల్లో రఘునందన్రావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 63,352 ఓట్లు వచ్చాయి.2020తో పోల్చితే ఇప్పుడు రఘునందన్రావుకు 18,966 ఓట్లు తక్కువగా వచ్చాయి.
సిద్దిపేట ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా సాగింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలను లెక్కించారు. అనంతరం ఈవీఎంలవి చేపట్టారు. ఎన్నికల సిబ్బంది ఆదివారం తెల్లవారుజాము నుంచే విధుల్లో చేరారు. అధికారుల పర్యవేక్షణలో ప్రశాంతంగా పూర్తయింది.
న్యూస్టుడే, సిద్దిపేట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు..
[ 28-04-2024]
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం సదాశివపేట పట్టణంలో చోటుచేసుకొంది. -
లోక్సభ నియోజకవర్గ ఓటర్లు @ 18.28 లక్షలు
[ 28-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 18.28 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. -
ఎండ ప్రచండం.. ప్రచారానికి గండం!
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ పూర్తయింది. మెదక్ లోక్సభ స్థానానికి సంబంధించి తొలి అంకం ముగిసి అభ్యర్థుల లెక్కతేలింది. ఇక ప్రచారం మరింతగా వేడెక్కనుంది. -
భారాస హయాంలోనే తెలంగాణ అభివృద్ధి: పద్మ
[ 28-04-2024]
పద్నాలుగు ఏళ్ల పోరాటం వల్ల ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందని, అనంతరం ప్రభుత్వం ఏర్పాటయ్యాక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి...అన్ని రంగాలను ముందుకు నడిపి తొమ్మిదిన్నరేళ్లలో భారాస అధినేత కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా -
కాంగ్రెస్ను గెలిపిస్తేనే పురోగతి
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే మెదక్ అభివృద్ధి జరుగుతుందని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. -
డార్మిటరీలో స్నేహం.. చోరీల వ్యూహం
[ 28-04-2024]
ఎంజీబీఎస్ వద్ద ఉన్న డార్మిటరీలో పరిచయమై సెల్ఫోన్, ద్విచక్రవాహనాలను దొంగలిస్తూ జల్సాలు చేస్తున్న ఇద్దరు నిందితులను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. -
వక్ఫ్బోర్డు స్థలాల్లో ఆగని ఆక్రమణల పర్వం
[ 28-04-2024]
రాజకీయ పలుకుబడి ధీమాతో కబ్జాదారులు వక్ఫ్బోర్డు స్థలాల్లో ఇష్టారీతిన నిర్మాణాలు చేపడుతున్నారు. ఇటీవల వక్ఫ్బోర్డుకు ఛైర్మన్ను నియమించిన నేపథ్యంలోనైనా వాటి స్థలాల్లో ఆక్రమణలకు అడ్డుకట్ట పడుతుందని భావించినా... -
తెలంగాణ గాంధీ కేసీఆర్: చింతా ప్రభాకర్
[ 28-04-2024]
ప్రాణాల సైతం లెక్కచేయకుండా తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్ తెలంగాణ గాంధీ అని సంగారెడ్డి ఎమ్మెల్యే, భారాస జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు. -
పెరుగుతుందా.. తగ్గుతుందా..!
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు రూపొందించుకుని ప్రచారం చేస్తున్నాయి. జహీరాబాద్ లోక్సభ పరిధిలో మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో పోలింగ్శాతం ప్రభావంపై ఆయా పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. -
కేసీఆర్ ఒక్కరే!
[ 28-04-2024]
గజ్వేల్ నుంచి పార్లమెంటు బరిలో గెలిచిన నేతగా కేసీఆర్ ఒక్కరే రికార్డు సృష్టించారు. గజ్వేల్ నియోజకవర్గం 2008 వరకు అప్పటి సిద్దిపేట లోక్సభ స్థానం పరిధిలో ఉండేది. -
పోలింగ్ కేంద్రాలు.. సమగ్ర వివరాలు
[ 28-04-2024]
ఈ సారి లోక్సభ ఎన్నికలను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఎలాంటి అవకతవకలు, అక్రమాలు జరగకుండా ఉండేలా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. -
ఓట్లు కురిసె.. ఆధిక్యం మెరిసె..
[ 28-04-2024]
పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధిస్తేనే ముందంజలో నిలుస్తారు. ఇదే ఎన్నికల్లోనూ వర్తిస్తుంది. తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ఓట్ల ఆధిక్యమే కీలకం. అందుకే పోటీదారులు దీనిపై ప్రత్యేక దృష్టిసారిస్తారు. -
హైదరాబాద్ వీడి చేవెళ్లలో చేరి..
[ 28-04-2024]
జిల్లా కేంద్రమైన వికారాబాద్, తాండూరు, చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్లు 2008 వరకు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉండేవి. -
ఎన్నికల సంఘం వాట్సాప్ ఛానల్...
[ 28-04-2024]
సాంకేతికతలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటోంది ఎన్నికల సంఘం. ఐదేళ్లకోసారి జరిగే ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక మార్పు కనిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం హోరెత్తుతోంది. -
61వ రాజ్యాంగ సవరణతో..
[ 28-04-2024]
తొలినాళ్లలో ఓటు వేయడానికి కనీస వయసు 21 ఏళ్లుగా ఉండేది. దీన్ని రాజ్యాంగంలోనూ పొందుపర్చారు. అయితే 1988లో 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించాలని అప్పటి పాలకులు నిర్ణయించారు.
తాజా వార్తలు (Latest News)
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్