జిల్లాకు రెండు కార్పొరేషన్ పదవులు
రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాకు చెందిన ఇద్దరికి అవకాశం దక్కింది. పార్టీ ఉన్నతికి చేసిన సేవలకు గుర్తింపు దక్కిందని నియామకమైన నేతలు అభిప్రాయపడుతున్నారు.
సంగారెడ్డి టౌన్, న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాకు చెందిన ఇద్దరికి అవకాశం దక్కింది. పార్టీ ఉన్నతికి చేసిన సేవలకు గుర్తింపు దక్కిందని నియామకమైన నేతలు అభిప్రాయపడుతున్నారు.
టీఎస్ఐఐసీ ఛైర్పర్సన్గా నిర్మలారెడ్డి
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తూర్పు నిర్మలారెడ్డికి పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీఎస్ఐఐసీ) ఛైర్పర్సన్ పదవి దక్కింది. పార్టీ అధికారంలో లేని సమయంలోనూ ఆమె జిల్లా అధ్యక్షురాలిగా సేవలందించారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఏ పిలుపునిచ్చినా విజయవంతం చేశారు. ఆమె భర్త తూర్పు జయప్రకాశ్రెడ్డి(జగ్గారెడ్డి) ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. జగ్గారెడ్డికి ప్రభుత్వంలో ఏదైనా కీలక పదవి దక్కుతుందని కార్యకర్తలు నమ్మకంతో ఉన్నారు. తాజాగా నిర్మలారెడ్డికి నామినేటెడ్ పదవి దక్కింది. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తానని నిర్మలారెడ్డి తెలిపారు. పారిశ్రామికపరంగా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వపరంగా అన్ని వసతులు కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.
ఫిలిం డెవలప్మెంట్ సంస్థ ఛైర్మన్గా గిరిధర్రెడ్డి
జహీరాబాద్ అర్బన్, జహీరాబాద్, న్యూస్టుడే: జహీరాబాద్ ఎంపీపీ ఎన్.గిరిధర్రెడ్డిని రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ సంస్థ ఛైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జహీరాబాద్ మండలం చిరాగ్పల్లికి చెందిన నందారం గిరిధర్రెడ్డి 2019లో కాంగ్రెస్ తరఫున ఎంపీపీగా ఎన్నికయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓటమి పాలైనప్పటికీ.. మాజీ మంత్రి గీతారెడ్డితో సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతూ ముందుకు సాగారు. ఆయన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి తోడల్లుడు కావడం.. సీఎం రేవంత్రెడ్డితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటంతో రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్ పదవి దక్కింది. ఆదివారం గిరిధర్రెడ్డిని ఆ పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమర్శల జోరు.. కేరింతల హోరు
[ 01-05-2024]
మెదక్ జిల్లా అల్లాదుర్గం చిల్వేర్ ఐబీ చౌరస్తాలో మంగళవారం మెదక్-జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల భాజపా విశాల్ జనసభ కమలదళంలో ఆద్యంతం ఉత్తేజం నింపింది. కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రధాని నరేంద్రమోదీ దుయ్యబట్టారు. -
కార్మికుల రాత మార్చే నేత కావాలి
[ 01-05-2024]
చేగుంట మండలం రెడ్డిపల్లిలోని ఓ పరిశ్రమకు చెందిన 15 మంది కార్మికులను శిథిలావస్థకు చేరిన గదిలో నివాసం ఉంచారు. గతేడాది ఆగస్టులో భారీ వర్షానికి గోడలు కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందగా, ఐదుగురికి పైగా తీవ్రంగా గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. -
శతశాతం ప్రగతి..!
[ 01-05-2024]
నిర్దిష్ట ప్రణాళికకు శ్రమించే తత్వం తోడయితే.. సత్ఫలితాలు సాధ్యం. ఉపాధ్యాయుల అనుశీలన.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అనేక సర్కారు బడులు శతశాతం ఫలితాలు సాధించి భళా అనిపించాయి. -
సమన్వయంతో పని చేయండి
[ 01-05-2024]
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భేషజాలకు పోకుండా ముఖ్యులు సమన్వయంతో పని చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్మున్షీ అన్నారు. మంగళవారం పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో మెదక్ అభ్యర్థి నీలం మధు కార్యాలయంలో పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. -
శాతం పెరిగె.. స్థానం దిగజారె!
[ 01-05-2024]
పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో మెతుకుసీమ విద్యార్థులు సత్తాచాటారు. ఈసారి ఫలితాల్లో కాస్త మెరుగుపడగా.. రాష్ట్ర స్థాయిలో స్థానం దిగజారింది. -
‘పది’లో ద్వితీయస్థానం అభినందనీయం: మంత్రి పొన్నం ప్రభాకర్
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా ద్వితీయ స్థానంలో నిలవడంపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. -
పెళ్లింట విషాదం..
[ 01-05-2024]
వివాహం జరిగి మూడు రోజులు కాలేదు.. సంతోషంగా ద్విచక్ర వాహనంపై కొత్త దంపతులిద్దరు వెళ్లగా.. మృత్యురూపంలో దూసుకొచ్చిన లారీ నూతన వరుడిని బలి తీసుకుంది. -
ఓటు పాఠం.. అవగాహన కీలకం
[ 01-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటింగ్ కీలకమన్నది అందరికీ తెలిసిందే. 18 ఏళ్లకు ఓటు హక్కు పొందవచ్చు. అయితే అంతకంటే ముందే విద్యార్థిగా ఉన్న సమయంలో పోలింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు పదో తరగతి సాంఘిక శాస్త్రంలో 16వ పాఠంగా ‘భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ’ పాఠ్యాంశాన్ని పొందుపర్చారు. -
సరకుల అక్రమ తరలింపు.. ఇద్దరి తొలగింపు
[ 01-05-2024]
హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయం నుంచి బియ్యం, పప్పులు ఇతర సామగ్రి అక్రమ తరలింపు వ్యవహారంపై ఇన్ఛార్జి ప్రిన్సిపల్ 27న పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారని విద్యాలయాల ప్రాంతీయ సమన్వయకర్త డీఎస్ వెంకన్న మంగళవారం తెలిపారు. -
అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
[ 01-05-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గం నుంచి 44 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భాజపా, భారాస, బీఎస్పీ అభ్యర్థుల గుర్తులు పోనూ.. మిగిలిన గుర్తింపు, రిజిస్టర్డ్ పార్టీల, స్వతంత్ర అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ ఎన్నికల చిహ్నాలను కేటాయించారు. -
ఫలితం అద్వితీయం..స్థానం పదిలం
[ 01-05-2024]
పదో తరగతి వార్షిక ఫలితాల్లో సిద్దిపేట జిల్లా సత్తా చాటింది. రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచి హవా కొనసాగించింది. గత విద్యా సంవత్సర స్థానాన్ని పదిలం చేసుకుంటూ.. ప్రత్యేకత నిలిపింది. 98.65 శాతం విద్యార్థులు పాసయ్యారు. -
డీఈఓకు సన్మానం
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచినందుకు గాను పలు ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర