ఓటు వజ్రాయుధం నమోదుకిదే తరుణం
ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైంది. రాజ్యాంగం ప్రజల చేతిలో పెట్టిన వజ్రాయుధం ఇది. సరైన ప్రజాప్రతినిధిని ఎన్నుకునేందుకు సామాన్యుడి చేతిలో తిరుగులేని అస్త్రంగా మారుతుంది.
ఏప్రిల్ 15 వరకు గడువు
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్: ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైంది. రాజ్యాంగం ప్రజల చేతిలో పెట్టిన వజ్రాయుధం ఇది. సరైన ప్రజాప్రతినిధిని ఎన్నుకునేందుకు సామాన్యుడి చేతిలో తిరుగులేని అస్త్రంగా మారుతుంది. సమర్థుల ఎన్నికతో తమ తలరాతలు మారుతాయని ప్రజలు విశ్వసిస్తుంటారు. లోక్సభ ఎన్నికలకు షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని సూచిస్తోంది. ఏప్రిల్ 15వ తేదీ వరకు అవకాశం కల్పించిన నేపథ్యంలో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరముంది.
అంతర్జాలంలో అవకాశం..
ఓటు హక్కు ప్రజాస్వామ్యాన్ని పరిపుష్ఠం చేస్తుంది. పారదర్శకంగా వినియోగించుకుంటే.. బంగారు భవితకు బాటలు వేస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం వివిధ దశల్లో ఓటరుగా నమోదయ్యే అవకాశం కల్పిస్తోంది. గత నెల వరకు ప్రత్యేక సవరణ కార్యక్రమాలు నిర్వహించారు. తుది ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా జనవరి 6న ముసాయిదా జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నూతన నమోదు సహా మార్పులు, చేర్పులు, సవరణలకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటూ కల్పించారు. ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. దీంతో పెద్దమొత్తంలో దరఖాస్తులు సమర్పించారు. అయినప్పటికి మరో మారు ఓటరు జాబితాలో పేరు లేని వారు, కొత్తగా నమోదు చేసుకునే వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది. అందుకు ఫారం-6ని పూరించి ఆన్లైన్లో లేదా బీఎల్వో, తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించవచ్చు. ఆన్లైన్లోhttps:///nvsp.in, https:/// ceotelangana.nic.in, https:///voters.eci.gov.in/ పోర్టల్ లేదా చరవాణిలో voter help app (vha) ద్వారా నమోదుకు అవకాశం కల్పించారు.
సంగారెడ్డి, అందోలులో మహిళలే అధికం
2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 15.27 లక్షలు. 13 ఏళ్ల వ్యవధిలో ఆ సంఖ్య భారీగా పెరిగింది. ఫిబ్రవరి 8న విడుదల చేసిన ఓటరు తుది జాబితా ప్రకారం జిల్లా ఓటర్ల సంఖ్య 14,18,688. అందులో పురుష ఓటర్లు 7,11,011, మహిళలు 7,07,538, ఇతరులు 139 మంది ఉన్నారు. సంఖ్యాపరంగా జిల్లా వ్యాప్తంగా పురుషులదే పైచేయి. సంగారెడ్డి, అందోలు నియోజకవర్గాల్లో మాత్రం పురుషులతో పోల్చితే మహిళలు అధికంగా ఉండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టు సాధించేలా..
[ 29-04-2024]
కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే కృతనిశ్చయంతో ఉన్న భారతీయ జనతాపార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పదేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఓటర్ల వద్దకు వెళ్తోంది. -
రణమా.. ఉపసంహరణమా!
[ 29-04-2024]
నామపత్రాల దాఖలు... పరిశీలన ముగిసింది. ఇక బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటించడమే తరువాయి. ఎవరు ఉంటారు... ఎవరెవరు ఉపసంహరించుకుంటారనేది నేడు తేలనుంది. గతంలో ఎన్నడు లేని విధంగా పెద్దసంఖ్యలో నామపత్రాలను దాఖలు చేశారు. -
భారాసతోనే ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు
[ 29-04-2024]
కాంగ్రెస్ సర్కారు రాష్ట్రాన్ని నట్టేట ముంచిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. ఆదివారం రాత్రి చిన్నశంకరంపేట, వెల్దుర్తి, శివ్వంపేట మండలాల్లో భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. -
మోదీ.. బీసీ.. ట్రస్టు..
[ 29-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పట్టున్న నియోజకవర్గాలపై దృష్టి సారించాయి. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఆయా పార్టీల ముఖ్య నేతలు పైకి ప్రసంగాలు చేస్తూనే తెరచాటు మంత్రాంగాలు నడుపుతున్నారు. -
మహిళా వాణి.. వినిపించదేమి..!
[ 29-04-2024]
మెదక్ లోక్సభ పురుడు పోసుకొని 72 ఏళ్లయింది. ఈ స్థానం నుంచి ఇప్పటివరకు కేవలం ముగ్గురు మహిళలే ఎంపీలుగా ఎన్నికవడం గమనార్హం. తాజా ఎన్నికల్లోనూ 54 మంది బరిలో ఉండగా, వీరిలో మహిళా అభ్యర్థులు శూన్యం.. కీలకమైన చట్టసభల్లో ఆశించిన స్థాయిలో అవకాశాలుదక్కకపోవడం గమనార్హం. -
కల సాకారమయ్యేలా.. భరోసానిచ్చేలా..
[ 29-04-2024]
ఉన్నత విద్య అభ్యసించి నచ్చిన రంగంలో రాణించి సత్తా చాటాలన్నది ఎంతోమంది నిరుపేద విద్యార్థుల కల. అనివార్య కారణాలు, ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలోనే మానేసి ఏదో ఓ పని చేసుకుంటుంటారు. -
తాగేదెలా?
[ 29-04-2024]
జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీటిని సరఫరా చేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు పదేపదే చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. నిబంధనల ప్రకారం ట్యాంకులను శుభ్రం చేయకపోవడం, పైపులైన్ల లీకేజీలతో నీరు కలుషితమవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ అత్యంత కీలకం. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ అప్రమత్తమైంది. పోలింగ్ రోజున గొడవలు సృష్టించే రౌడీలు, కేడీలు, పాత నేరస్థుల కదలికపై ప్రత్యేక నిఘా పెట్టింది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించింది. -
ప్రజాశక్తితో.. ఏడాదిలో కేసీఆర్ రాష్ట్రాన్ని శాసిస్తారు
[ 29-04-2024]
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్