జోరుగా జూదం.. జీవితాలు ఛిద్రం
ప్రభుత్వం నిషేధించిన జూదం జిల్లాలో జోరుగా సాగుతోంది. గతంలో పట్టణాల్లోని క్లబ్లకు వెళ్లిన జూదరులు ఇప్పుడు మారుమూల పల్లెల్లోనే మకాం వేస్తున్నారు.
మూడు నెలల్లోనే 24 స్థావరాలపై దాడులు.. 78 మంది అరెస్టు
న్యూస్టుడే, చేర్యాల: ప్రభుత్వం నిషేధించిన జూదం జిల్లాలో జోరుగా సాగుతోంది. గతంలో పట్టణాల్లోని క్లబ్లకు వెళ్లిన జూదరులు ఇప్పుడు మారుమూల పల్లెల్లోనే మకాం వేస్తున్నారు. కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వీరు యువకులు, గ్రామాల్లోని అమాయకులకు ఎరవేసి ఇందులోకి లాగుతున్నారు. కొంతకాలంగా పోలీసులు నిర్వహిస్తున్న దాడుల్లో పట్టుబడిన వారిలో ఎక్కువగా యువకులే ఉన్నారు. లక్షల రూపాయలు పెట్టి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు.
గుట్టలు, చెట్ల పొదలే స్థావరాలు
నివాసాలతో పాటు జనసంచారం తక్కవగా ఉండే గుట్టలు, గుబురుగా ఉండే చెట్ల పొదలే జూదానికి ప్రధాన అడ్డాలవుతున్నాయి. వాగుల పక్కన ఉన్న చిన్నపాటి అడవులు, రైతులు పెంచుతున్న తోటల్లోనూ ఆడుతున్నారు. పోలీసులు వస్తున్నప్పుడు సమాచారం ఇవ్వడానికి కొందరిని కాపలాగా పెట్టుకుంటున్నారు. వారికి సుమారు రూ.5 వేల వరకు ఇస్తుంటారు. జూదమాట నిర్వహణే ఉపాధిగా కొందరు మలుచుకున్నారు. రహస్య అడ్డాలు ఏర్పాటు చేసి, ఫోన్లు చేసి ఆటగాళ్లను రప్పించినందుకు ఒక్కో ఆటకు రూ.1 వేయి నుంచి రూ.3 వేల వరకు నిర్వాహకులు తీసుకుంటున్నారు.
క్లబ్ తరహాలో టోకెన్ల విధానం
పట్టణాలు, నగరాల్లోని క్లబ్బుల మాదిరిగా పల్లెల్లోనూ నిర్వాహకులు డబ్బు డిపాజిట్ చేసిన వారికి టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇటీవల చేర్యాల మండలం చుంచనకోట గుట్టల్లో పోలీసులు దాడి చేసినపుడు కాయిన్లు దొరకడం ఇందుకు నిదర్శనం. జూదంలో రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు, ఇతర వ్యాపారులు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు... యువత, విద్యార్థులు మాత్రం రూ.500 నుంచి రూ.5000 వరకు ఆటలో పణంగా పెడుతున్నారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఎక్కువగా ఇళ్లల్లోనే ఆడుతున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులు విశ్వసనీయ సమాచారంతో దాడులు నిర్వహించి నిందితులను పట్టుకుంటున్నారు.
ఓవైపు కౌన్సిలింగ్.. మరోవైపు కఠిన చర్యలు
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 23 కేసులు నమోదు కాగా రూ.4,45,212 నగదు స్వాధీనం చేసుకున్నారు. కొందరు పరారీలో ఉండగా 78 మందిని అరెస్టు చేశారు. కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్న జూదం నియంత్రించాలంటే కౌన్సిలింగ్ చేయాలి. కఠిన చర్యలు, శిక్షల ద్వారా కట్టడి చేయాలి. ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దాడులతో కొంతమేర సత్ఫలితాలిస్తున్నాయి.
కొన్ని సంఘటనలు
- మార్చి 20న చుంచనకోట శివారు మామిడి తోటలో హైదరాబాద్ నుంచి వచ్చి ఆడారు. దాడులతో పారిపోయారు. రూ.10 వేల టోకెన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్దూరులో ఇటీవల ఆరుగురిని అరెస్టు చేశారు.
- మార్చి 21న సిద్దిపేట గ్రామీణ ఠాణా పరిధి బంజేరుపల్లి శివారులో చెట్ల మధ్య ఆడుతున్న ఏడుగురు పట్టుబడ్డారు.
- మార్చి 26న సిద్దిపేట టూటౌన్ పరిధిలో టాస్క్ఫోర్స్, పోలీసుల దాడిలో ఏడుగురు అరెస్టయ్యారు.
- ఏప్రిల్ 7న సిద్దిపేట వన్టౌన్ పరిధిలోని కంచర్ బజార్లోని ఓ ఇంట్లో జూదం ఆడుతూ ఆరుగురు దొరికారు.
- చేర్యాల పట్టణం 4వ వార్డులో ఈనెల 10న ప్రైవేటు క్లినిక్లో సోదాలు చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
- ఈ సంఘటనల్లో మొత్తం రూ.1,16,187 నగదు, 35 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.
సమాచారం ఇవ్వండి, చర్యలు తీసుకుంటాం
-అనూరాధ, సీపీ
తక్కువ సమయంలో, ఏమీ కష్టపడకుండానే ఎక్కువ సంపాదించవచ్చన్న దురాశే కుటుంబాల ఛిన్నాభిన్నానికి కారణమవుతోంది. జూదం నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. ‘టాస్క్ఫోర్స్’ని ఏర్పాటు చేసి నిఘా పెట్టాం. ఎక్కడైనా జూదం ఆడుతున్నా.. అనుమతి లేకుండా ఇసుక, రేషన్ బియ్యం రవాణా చేసినట్టు ఎవరికైనా తెలిస్తే ఫోన్ చేసి చెప్పండి. చర్యలు తీసుకుంటాం. సిద్దిపేట టాస్క్ఫోర్స్ అధికారుల ఫోన్ నంబర్లు 87126 67445, 87126 67446, 87126 67447. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టు సాధించేలా..
[ 29-04-2024]
కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే కృతనిశ్చయంతో ఉన్న భారతీయ జనతాపార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పదేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఓటర్ల వద్దకు వెళ్తోంది. -
రణమా.. ఉపసంహరణమా!
[ 29-04-2024]
నామపత్రాల దాఖలు... పరిశీలన ముగిసింది. ఇక బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటించడమే తరువాయి. ఎవరు ఉంటారు... ఎవరెవరు ఉపసంహరించుకుంటారనేది నేడు తేలనుంది. గతంలో ఎన్నడు లేని విధంగా పెద్దసంఖ్యలో నామపత్రాలను దాఖలు చేశారు. -
భారాసతోనే ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు
[ 29-04-2024]
కాంగ్రెస్ సర్కారు రాష్ట్రాన్ని నట్టేట ముంచిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. ఆదివారం రాత్రి చిన్నశంకరంపేట, వెల్దుర్తి, శివ్వంపేట మండలాల్లో భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. -
మోదీ.. బీసీ.. ట్రస్టు..
[ 29-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పట్టున్న నియోజకవర్గాలపై దృష్టి సారించాయి. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఆయా పార్టీల ముఖ్య నేతలు పైకి ప్రసంగాలు చేస్తూనే తెరచాటు మంత్రాంగాలు నడుపుతున్నారు. -
మహిళా వాణి.. వినిపించదేమి..!
[ 29-04-2024]
మెదక్ లోక్సభ పురుడు పోసుకొని 72 ఏళ్లయింది. ఈ స్థానం నుంచి ఇప్పటివరకు కేవలం ముగ్గురు మహిళలే ఎంపీలుగా ఎన్నికవడం గమనార్హం. తాజా ఎన్నికల్లోనూ 54 మంది బరిలో ఉండగా, వీరిలో మహిళా అభ్యర్థులు శూన్యం.. కీలకమైన చట్టసభల్లో ఆశించిన స్థాయిలో అవకాశాలుదక్కకపోవడం గమనార్హం. -
కల సాకారమయ్యేలా.. భరోసానిచ్చేలా..
[ 29-04-2024]
ఉన్నత విద్య అభ్యసించి నచ్చిన రంగంలో రాణించి సత్తా చాటాలన్నది ఎంతోమంది నిరుపేద విద్యార్థుల కల. అనివార్య కారణాలు, ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలోనే మానేసి ఏదో ఓ పని చేసుకుంటుంటారు. -
తాగేదెలా?
[ 29-04-2024]
జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీటిని సరఫరా చేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు పదేపదే చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. నిబంధనల ప్రకారం ట్యాంకులను శుభ్రం చేయకపోవడం, పైపులైన్ల లీకేజీలతో నీరు కలుషితమవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ అత్యంత కీలకం. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ అప్రమత్తమైంది. పోలింగ్ రోజున గొడవలు సృష్టించే రౌడీలు, కేడీలు, పాత నేరస్థుల కదలికపై ప్రత్యేక నిఘా పెట్టింది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించింది. -
ప్రజాశక్తితో.. ఏడాదిలో కేసీఆర్ రాష్ట్రాన్ని శాసిస్తారు
[ 29-04-2024]
తాజా వార్తలు (Latest News)
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!