అపజయాలే విజయానికి మెట్లుగా..
ఉన్నత లక్ష్య సాధనకు కఠోరంగా శ్రమించాలి.. తాత్కాలిక ఆనందాలను పక్కనపెట్టాలి.. అపజయాలు లెక్క చేయక ముందుకు సాగాలి
ఐపీఎస్ శిక్షణలో కొనసాగుతూనే లక్ష్యం చేరిక
శిక్షణలో అఖిల్
న్యూస్టుడే, సిద్దిపేట, కొండపాక గ్రామీణం: ఉన్నత లక్ష్య సాధనకు కఠోరంగా శ్రమించాలి.. తాత్కాలిక ఆనందాలను పక్కనపెట్టాలి.. అపజయాలు లెక్క చేయక ముందుకు సాగాలి.. ఇలా చేసిన గ్రామీణ వ్యవసాయ కుటుంబానికి చెందిన ఓ యువకుడు సివిల్ సర్వీసెస్ సాధించి తల్లిదండ్రులు సగర్వంగా నిలిచేలా చేశారు. అతడే సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన బుద్ధి అఖిల్. అఖిల భారత స్థాయిలో 321వ ర్యాంకు సాధించి ఔరా అనిపించారు. వైఫల్యాలకు వెరవకుండా లోపాలు బేరీజు వేసుకొని ఐదో ప్రయత్నంలో లక్ష్యాన్ని సాధించడం విశేషం.
కొండపాకకు చెందిన బుద్ధి లలిత, నరేశ్ దంపతులకు ఇద్దరు కుమారులు. మధ్య తరగతి కుటుంబం. వ్యవసాయమే జీవనాధారం. నరేశ్ సిద్దిపేటలో 28 ఏళ్లు కాంపౌండర్గా పని చేశారు. మూడేళ్లుగా కొండపాకలో పీఎంపీగా చేస్తూ సాగును వదల్లేదు. పెద్ద కుమారుడు అఖిల్ (26) మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవారు. చిన్నకుమారుడు అజయ్ డిగ్రీ పూర్తి చేశారు. అఖిల్ ఇంటర్ వరకు సిద్దిపేటలోని ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుకున్నారు. పదిలో 9.8 జీపీఏ, ఇంటర్ (ఎంపీసీ) 972 మార్కులు సాధించారు. వరంగల్లో కాకతీయ విశ్వవిద్యాలయంలో సివిల్ ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకున్నారు. 85 శాతం మార్కులతో సత్తా చాటారు. ఈ యువ కెరటం.. బాల్యంలోనే ఐఏఎస్ కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఐఏఎస్ స్మితాసబర్వాల్ ఉమ్మడి మెదక్ కలెక్టర్గా పని చేసినప్పుడు అఖిల్ ఏడో తరగతి చదువుతున్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని, తండ్రి ప్రోత్సాహంతో సివిల్ సర్వీసెస్ సాధనే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
ఇంటి నుంచే సన్నద్ధం..
2018లో ఇంజినీరింగ్ పూర్తవగానే యూపీఎస్సీకి సిద్ధమయ్యారు. ఇంట్లో నుంచే చదివారు. 2019లో తొలి యత్నంలో ఆశించిన ఫలితం దక్కలేదు. 2020లో ఇదే అనుభవం ఎదురైంది. 2021లో 566వ ర్యాంకుతో ఐపీఎస్కు ఎంపికయ్యారు. ఐఏఎస్ లక్ష్యంగా నిర్దేశించుకున్న అఖిల్ శిక్షణకు వెళ్లకుండా ఏడాది పాటు సెలవు తీసుకున్నారు. 2022లో మరోమారు యత్నించగా నిరాశే మిగిలింది. 2023లో పరీక్ష రాశారు. గతేడాది డిసెంబరులో ఐపీఎస్ శిక్షణకు పయనమయ్యారు. మెరుగైన ఫలితాలు సాధించి విరామ సమయంలో సన్నద్ధమై గత జనవరిలో ముఖాముఖికి హాజరయ్యారు.
పొలం పనుల్లోనూ..
అఖిల్ తండ్రి నరేశ్ పది, తల్లి లలిత ఏడో తరగతి చదివారు. తమ పిల్లలు కష్టపడొద్దని, చదివిస్తే ఉన్నతస్థాయిలో ఉంటారనే కాంక్షతో ప్రోత్సహించారు. అఖిల్ రోజులో 10 నుంచి 12 గంటల సమయాన్ని కేటాయించారు. వ్యవసాయ పనుల్లోనూ పాలుపంచుకున్నారు. అన్ని వేడుకలకు దూరంగా ఉన్నారు. లక్ష్య సాధన తర్వాత అందర్నీ కలవవచ్చనే ఆశావహ దృక్పథంతో శ్రమించారు. ఇష్టమైన క్రికెట్నూ దూరం పెట్టారు.
ఆనందంతో ఎగిరి గంతేశా..
- నరేశ్, అఖిల్ తండ్రి
సంతోషంగా ఉంది. మా కుటుంబంలో సాధారణ ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే గొప్ప అనే భావన ఉండేది. నా కొడుకు మంగళవారం మధ్యాహ్నం ఫోన్ చేసి ‘బాపూ నేను ఐఏఎస్ సాధించా’నని చెప్పగానే ఆనందంతో ఎగిరి గంతేశా. ఆనంద భాష్పాలతో నోట మాట రాలేదు. మా బలగంలో తొలి ప్రభుత్వ, ఉన్నత ఉద్యోగం ఇదే. అతడి కష్టం ఫలించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టు సాధించేలా..
[ 29-04-2024]
కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే కృతనిశ్చయంతో ఉన్న భారతీయ జనతాపార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పదేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఓటర్ల వద్దకు వెళ్తోంది. -
రణమా.. ఉపసంహరణమా!
[ 29-04-2024]
నామపత్రాల దాఖలు... పరిశీలన ముగిసింది. ఇక బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటించడమే తరువాయి. ఎవరు ఉంటారు... ఎవరెవరు ఉపసంహరించుకుంటారనేది నేడు తేలనుంది. గతంలో ఎన్నడు లేని విధంగా పెద్దసంఖ్యలో నామపత్రాలను దాఖలు చేశారు. -
భారాసతోనే ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు
[ 29-04-2024]
కాంగ్రెస్ సర్కారు రాష్ట్రాన్ని నట్టేట ముంచిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. ఆదివారం రాత్రి చిన్నశంకరంపేట, వెల్దుర్తి, శివ్వంపేట మండలాల్లో భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. -
మోదీ.. బీసీ.. ట్రస్టు..
[ 29-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పట్టున్న నియోజకవర్గాలపై దృష్టి సారించాయి. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఆయా పార్టీల ముఖ్య నేతలు పైకి ప్రసంగాలు చేస్తూనే తెరచాటు మంత్రాంగాలు నడుపుతున్నారు. -
మహిళా వాణి.. వినిపించదేమి..!
[ 29-04-2024]
మెదక్ లోక్సభ పురుడు పోసుకొని 72 ఏళ్లయింది. ఈ స్థానం నుంచి ఇప్పటివరకు కేవలం ముగ్గురు మహిళలే ఎంపీలుగా ఎన్నికవడం గమనార్హం. తాజా ఎన్నికల్లోనూ 54 మంది బరిలో ఉండగా, వీరిలో మహిళా అభ్యర్థులు శూన్యం.. కీలకమైన చట్టసభల్లో ఆశించిన స్థాయిలో అవకాశాలుదక్కకపోవడం గమనార్హం. -
కల సాకారమయ్యేలా.. భరోసానిచ్చేలా..
[ 29-04-2024]
ఉన్నత విద్య అభ్యసించి నచ్చిన రంగంలో రాణించి సత్తా చాటాలన్నది ఎంతోమంది నిరుపేద విద్యార్థుల కల. అనివార్య కారణాలు, ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలోనే మానేసి ఏదో ఓ పని చేసుకుంటుంటారు. -
తాగేదెలా?
[ 29-04-2024]
జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీటిని సరఫరా చేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు పదేపదే చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. నిబంధనల ప్రకారం ట్యాంకులను శుభ్రం చేయకపోవడం, పైపులైన్ల లీకేజీలతో నీరు కలుషితమవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ అత్యంత కీలకం. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ అప్రమత్తమైంది. పోలింగ్ రోజున గొడవలు సృష్టించే రౌడీలు, కేడీలు, పాత నేరస్థుల కదలికపై ప్రత్యేక నిఘా పెట్టింది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించింది. -
ప్రజాశక్తితో.. ఏడాదిలో కేసీఆర్ రాష్ట్రాన్ని శాసిస్తారు
[ 29-04-2024]
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్