ఓటర్లకు చేరువ
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నికల సంఘం షెడ్యూలుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది.
పెరిగిన పోలింగ్ కేంద్రాలు
ఆదర్శ పోలింగ్ కేంద్రం(పాతచిత్రం)
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నికల సంఘం షెడ్యూలుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 25 వరకు స్వీకరించనున్నారు. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా కొత్త పోలింగ్ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు కేంద్రాల్లో వసతుల కల్పనపై దృష్టి సారించారు.
వసతుల కల్పనకు ప్రాధాన్యం
జిల్లాలో 5 నియోజకవర్గాల్లో కలిపి ప్రస్తుతం 1,616 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 2019 ఎన్నికల సమయంలో వీటి సంఖ్య 1,467 మాత్రమే. కొత్తగా 149 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఓటర్లకు సౌకర్యవంతంగా మారింది. కుటుంబ సభ్యులంతా ఒకే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులు, వయోవృద్ధులు, యువత, మహిళలకు ప్రత్యేక కేంద్రాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో వసతులపై నోడల్ అధికారి సోమేశ్వర్రావు ఆధ్వర్యంలో పరిశీలిస్తూ జిల్లా ఎన్నికల అధికారికి ఎప్పటికప్పుడు నివేదిక అందజేస్తున్నారు.
ఓటు సద్వినియోగంపై..
అర్హులందరూ ఓటరుగా నమోదయ్యేలా ఇటీవల చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో కొత్తగా ఓటు కోసం 73,702 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం వీరిలో అర్హులందరికీ ఈ ఎన్నికల్లోనే ఓటు హక్కు కల్పించనున్నారు. ఓటు హక్కు ఉన్నవారందూ ఓటింగ్లో పాల్గొనేలా చైతన్య కార్యక్రమాలను జిల్లా యంత్రాంగం నిర్వహిస్తోంది. నియోజకవర్గ కేంద్రాల్లో ఓటరు చైతన్య ర్యాలీలను నిర్వహించారు. సమర్థులనే ఎన్నుకునేలా ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చేందుకు కళాజాత ప్రదర్శనలు సైతం ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరు నూరైనా మెతుకు సీమలో గెలవాలి
[ 03-05-2024]
సిద్దిపేటలో నిర్వహించిన కాంగ్రెస్ రోడ్షో శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. -
ఒకేలా కన్పిస్తూ.. గెలుపోటములు శాసిస్తూ..
[ 03-05-2024]
ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులెవరనేది తేలిపోయింది. పోలింగ్కు తక్కువ రోజులే ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. -
కాంగ్రెస్కు ఓటేస్తే.. సీఎం అబద్ధాల్ని ఆమోదించినట్లే
[ 03-05-2024]
‘అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. గద్దెనెక్కాక ప్రజల్ని మోసం చేసింది. -
లోక్సభ పోరు.. మరింత హోరు
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
ఈ రోజు ఇలా.. రేపు అలా..
[ 03-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఓటూ ప్రాధాన్యమే. బూత్ స్థాయి నుంచి అన్ని పార్టీలు శ్రేణులను సిద్ధం చేస్తున్నాయి. -
భాజపాతోనే దేశాభివృద్ధి
[ 03-05-2024]
భాజపాతోనే దేశాభివృద్ధి సాధ్యమని మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. -
ఓటరు చైతన్యంపై ఆడియో ఆవిష్కరణ
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్శాతం పెంచేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ మనుచౌదరి పిలుపునిచ్చారు. -
కల నెరవేరిస్తేనే.. విద్యాప్రగతి
[ 03-05-2024]
విద్యతోనే ప్రగతి సాధ్యం.. పేదరిక నిర్మూలనకు ఎంతో దోహదపడుతుంది.. డిగ్రీ వరకు విద్యాభ్యాసానికి ప్రభుత్వపరంగా వసతులు ఉన్నా ఆపై చదువులకు ఇబ్బందులు తప్పడం లేదు.. ఎన్నికల సమయంలో విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పే నేతలు ఆ తర్వాత వదిలేస్తున్నారు. -
తొలి ఓటు వేశారోచ్
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తొలి సారిగా చేపట్టిన ఇంటి నుంచి ఓటు ప్రక్రియ సాఫీగా కొనసాగింది. -
రెండు కళ్లూ చాలవులే..
[ 03-05-2024]
కల్యాణ వేదికపై ఆసీనులైన శ్రీరామచంద్రమూర్తిని సీతమ్మవారు ఓరకంట చూసి చిరుమందహాసం చేస్తోంది.. పక్కనే మరో వేదికపై వరుడి అలంకరణలో ఉన్న పరమేశ్వరుడిని చూసిన పార్వతిదేవి సిగ్గులొలికిస్తోంది. -
విద్వేషాలు రెచ్చగొడుతున్న భాజపా
[ 03-05-2024]
ప్రజా సంక్షేమాన్ని విస్మరించి విద్వేషాలను రెచ్చగొడుతూ అప్రజాస్వామిక రాజకీయాలు సాగిస్తున్న భాజపాను ఓడించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. -
లక్ష్యం.. సాకారం చేసుకొని..
[ 03-05-2024]
సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఎంతోమంది ఈ కలల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని కలలు కంటుంటారు. -
కాంగ్రెస్ సర్కారుతోనే సంక్షేమం: మంత్రి పొన్న
[ 03-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ప్రజల సంక్షేమం, అభివృద్ధి జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్