జన గణనకు కసరత్తు
పదేళ్లకోసారి చేపట్టే జన గణనకు మరో అడుగు పడింది. ఇప్పటికే వివిధ ప్రక్రియలు పూర్తికాగా.. లెక్కింపునకు అవసరమైన సిబ్బంది నియామకం, శిక్షణపై ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఏప్రిల్ నుంచి జనాభా లెక్కింపు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి. ఇందుకు అవసరమైన రెవెన్యూ, సరిహద్దుల నిర్ధారణకు ఉమ్మడి జిల్లాల అధికారులు నడుం బిగించారు. కొత్త జిల్లాల ప్రాతిపదికనే వివరాలు సేకరించేందుకు కార్యాచరణను సిద్ధం చేశారు. 2020లోనే జనగణన చేపట్టాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా ముందుకు సాగలేదు. ప్రస్తుతం జన గణన చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు.
పంచాయతీలు, పురపాలిక వార్డుల సరిహద్దుల నిర్ధారణ
నల్గొండ కలెక్టరేట్, న్యూస్టుడే
పదేళ్లకోసారి చేపట్టే జన గణనకు మరో అడుగు పడింది. ఇప్పటికే వివిధ ప్రక్రియలు పూర్తికాగా.. లెక్కింపునకు అవసరమైన సిబ్బంది నియామకం, శిక్షణపై ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఏప్రిల్ నుంచి జనాభా లెక్కింపు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి. ఇందుకు అవసరమైన రెవెన్యూ, సరిహద్దుల నిర్ధారణకు ఉమ్మడి జిల్లాల అధికారులు నడుం బిగించారు. కొత్త జిల్లాల ప్రాతిపదికనే వివరాలు సేకరించేందుకు కార్యాచరణను సిద్ధం చేశారు. 2020లోనే జనగణన చేపట్టాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా ముందుకు సాగలేదు. ప్రస్తుతం జన గణన చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2011లో జనగణన చేపట్టారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత చోటుచేసుకున్న పరిపాలన, భౌగోళిక మార్పులను తేల్చి ఈ సారి లెక్కింపు చేపట్టేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్త మండలాలు, పురపాలికలు, రెవెన్యూ డివిజన్లు, కొత్త పంచాయతీలు, వార్డుల పునర్విభజన జరిగింది. ఈ అంశాలతో కూడిన సమగ్ర నివేదిక రూపొందిస్తున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన పంచాయతీల సరిహద్దులు నిర్ధారణ చేస్తూ అవి ఏయే మండలాల పరిధిలో ఉన్నాయో తెలిపే నివేదిక తయారు చేశారు. గ్రామీణ ప్రాంతాలకు అనుబంధ ఫాం-1, అర్బన్ ప్రాంతాలకు అనుబంధ ఫాం-2 వినియోగించనున్నారు. ఈ నెల 27 వరకు పటాలను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ గ్రామాన్ని, అర్బన్ ప్రాంతాల్లో పురపాలిక వార్డు యూనిట్గా తీసుకోనున్నారు. .
రెండు దశల్లో..
సరిహద్దులు ఇతర వివరాలను పరిశీలించాక గణాంక అధికారులు ప్రక్రియను చేపడతారు. రెండు దశల్లో చేయనున్నారు. మొదటి దశలో ఈబీ(ఎన్యూమరేషన్ బ్లాక్) పరిధిలో ఇల్లు లేదా నిర్మాణాల గణన జరుగుతుంది. రెండో దశలో ఆయా గృహాల్లో ఎంతమంది నివసిస్తున్నారో తెలిపే లెక్కింపు ఉంటుంది.
తొలిసారిగా ట్యాబ్ల ద్వారా..
తొలిసారిగా దేశవ్యాప్తంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పక్కాగా జనగణనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా దేశవ్యాప్తంగా ఐదు జిల్లాలో పూర్తి చేశారు. టాప్-వ్యూ-పర్సన్స్ ఐడెంటిఫికేషన్(టీవీపీఐ) పద్ధతి (మొబైల్ యాప్ అప్లికేషన్) ద్వారా జనగణన చేపట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. మొబైల్ యాప్ను సెన్సెస్ యూనిక్ యూజర్ ఐడీని అనుసంధానం చేయడం ద్వారా గణన చేపడతారు.
సమగ్ర సమాచారం సేకరణ
ఉమ్మడి జిల్లాలో చిట్యాల, నకిరేకల్, చండూర్, హాలియా, నందికొండ, హుజూర్నగర్, నేరేడుచర్ల, చౌటుప్పల్, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, మోత్కూర్ కొత్త పురపాలికలుగా మారాయి. వీటిలో కొన్ని సమీప గ్రామాలు విలీనమయ్యాయి. జిల్లాల విభజనతో పంచాయతీలు, పురపాలికల సరిహద్దులు మారాయి. కొత్తగా ఏర్పడిన మండలాలు, వాటి పరిధిలో గ్రామాల వివరాలతో హద్దులు గుర్తించారు. నూతన పురపాలక చట్టం ఆమోదంతో పురపాలక సంఘాల్లో వార్డుల సరిహద్దులు మారాయి. ఉమ్మడి జిల్లాలో తండాలతో పాటు శివారు పల్లెలు కొత్త పంచాయతీలుగా ఆవిర్భవించాయి. ఈ నేపథ్యంలో సమగ్ర సమాచారంతో జనాభా గణనకు సిద్ధమవుతున్నారు.
శిక్షణకు ఏర్పాట్లు
ఉమ్మడి జిల్లాల నుంచి ఎంపిక చేసిన ఆరుగురు అధికారుల (మాస్టర్ ట్రైనర్ల)కు వారం రోజుల పాటు హైదరాబాద్లో శిక్షణ పొందారు. క్షేత్రస్థాయిలో జనగణనలో పాల్గొనే సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు భాగస్వామ్యం కానున్నారో కొద్ది రోజుల్లోనే తేలనుంది. ప్రతి ఇంటి సమాచారం, సామాజిక వర్గాల వివరాలు, పూర్తి సమాచారాన్ని క్షేత్రస్థాయిలో ఎన్యుమరేటర్లు 2021-జనగణనలో సేకరించాల్సి ఉంటుంది. 150 గృహాలను ఒక బ్లాక్గా విభజించి లెక్కింపు చేపట్టనున్నారు. .
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..