సాగర గర్భంలో అలివి వేట
నాగార్జునసాగర్ జలాశయంలో నిషేధిత అలివి వల మత్స్య సంపదను ధ్వంసం చేస్తోంది. మత్స్యకారుల జీవితాల్లో చీకట్లు నింపుతున్న ఈ తరహా వేటను నిషేధించాలన్న అభ్యర్థనను పట్టించుకునే నాథుడేలేకపోవడంతో నష్టం కలుగుతోంది. తెలంగాణ
నీరుగారుతున్న సమీకృత మత్స్య అభివృద్ధి పథక లక్ష్యం
- పెద్దఅడిశర్లపల్లి, న్యూస్టుడే
జలాశయంలో చేప పిల్లలు విడుదల చేస్తున్న మత్స్యశాఖ అధికారులు, స్థానికులు (దాచినచిత్రం).
నాగార్జునసాగర్ జలాశయంలో నిషేధిత అలివి వల మత్స్య సంపదను ధ్వంసం చేస్తోంది. మత్స్యకారుల జీవితాల్లో చీకట్లు నింపుతున్న ఈ తరహా వేటను నిషేధించాలన్న అభ్యర్థనను పట్టించుకునే నాథుడేలేకపోవడంతో నష్టం కలుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల చేయూతకు రూ.కోట్లు వెచ్చించి సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద రాయితీ చేపపిల్లల విడుదల చేస్తున్నా.. ఆ లక్ష్యం కాస్త నీరుగారుతోంది.
చందంపేట మండలం పొగిళ్ల నుంచి ప్రారంభమయ్యే కృష్ణానదీ తీరప్రాంతం వందల కిలోమీటర్ల దూరం విస్తరించింది. తీరంలో ప్రధానమైన నాగార్జునసాగర్ ప్రధాన జలాశయం జిల్లాలో వందల గ్రామాల్లో వేల సంఖ్యలో మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కల్పిస్తోంది. ఇక్కడ లభ్యమయ్యే చేపలు నిత్యం కోల్కతా, కేరళ, అస్సాంలకు ఎగుమతవుతుంటాయి. జలాశయాన్ని నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారుల్లో గంగపుత్రుల్లో అలజడి మొదలైంది. ఇందుకు ప్రధాన కారణం అలివివల. కొన్ని జాతుల చేపలు సీజన్ ఆధారంగా దొరుకుతాయి. మరి కొన్ని ఏడాదంతా లభిస్తుంటాయి. కాలానికనుగుణంగా వలలు సిద్ధం చేసి చేసి ఉపయోగించడం మత్స్యకారులకు సంప్రదాయంగా వస్తోంది. వీరు జలాశయంలో చేపలవేటతో ఉపాధితో పాటు జీవరాసుల సంతతి పెరగడానికి ప్రాధాన్యం ఇస్తారు. వేటకు ఎంపిక చేసుకునే వలతో చేపల సంతానోత్పత్తికి చిన్నచిన్న చేపలకు ముప్పువాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అలివివల అందుకు అనుగుణంగా లేకపోవడంతో ఈ వలను నిషేధిత జాబితాలో చేర్చారు. దీన్ని ఉపయోగించడం వల్ల ఎంతదూరమైతే విసురుతారో ఆ పరిధిలోని చేపపిల్లలు దగ్గర నుంచి ఇతర సముద్రజీవులు ఒకేసారి పెద్ద సంఖ్యలో చిక్కుకుపోతాయి. ఈ తరహా వలలు వినియోగిస్తున్న మత్స్యకారులు భవిష్యత్తు అవసరాలు తీర్చే సంపదను సైతం ఒడ్డుకు చేర్చడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నిషేధిత ఈ వలలను పీఏపల్లి, చందంపేట, నేరెడుగొమ్ము, పెద్దవూర మండలాల్లో కొందరు మత్స్యకారులు పెద్ద సంఖ్యలో వీటిని వినియోగించి మత్స్యసంపదను కొల్లగొడుతున్నారు సొమ్ముచేసుకుని సంప్రదాయ వల మత్స్యకారుల పొట్టగొడుతున్నారు.
వ్యక్తమవుతున్న ఆందోళన...
మత్స్యకారుల జీవనోపాధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది మత్స్యశాఖ ఈ జలాశయంలో మత్స్యకారుల కోసం 53.59 లక్షల చేప పిల్లలను విడుదల చేసింది. ఈ పిల్లలు సైతం విడుదల చేసిన వారం రోజుల్లోనే అలివివలకు చిక్కి ఒడ్డున పడి మృతిచెందాయని భవిష్యత్తులో తామెలా జీవనోపాధి పొందాలని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. అలివి నియంత్రణకు పలుమార్లు ఫిర్యాదులు చేసి మత్స్యశాఖ అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయంలో మత్స్యకారులకు అలివ వల నిషేధంపై గతంలో పలుమార్లు అవగాహన కల్పించామని, ఫిర్యాదు చేసే మత్స్యకారులు సహకరిస్తే అలివి వల వేట నిషేధ సంపూర్ణ అమలుకు చర్యలు తీసుకుంటామని డివిజనల్ మత్స్యశాఖాధికారి మారయ్య తెలిపారు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు
- గడిగ బాలయ్య, అజ్మాపురం మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు
నాగార్జునసాగర్ జలాశయంలో మత్స్యకారుల కోసం ఏటా లక్షల చేపపిల్లల సీడ్ పోసినా అలివి వల వేటను నియంత్రించకపోవడంతో ఫలితం ఉండడం లేదు. అధికారులు ఓ వైపు చేపపిల్లలు పోస్తుండగా మరోవైపు మత్స్యకారులు అలివితో వాటిని ఒడ్డుకు లాగేస్తుంటారు. కారణంగా సంప్రదాయ వలలు నమ్ముకున్న మాలాంటి వాళ్లకు జీవనోపాధి లేకుండా పోయింది. అధికారులు, పోలీసులు స్పందించి అలివి వేటను నియంత్రించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వ్యక్తి దారుణ హత్య
[ 10-05-2024]
మండలంలోని ఆంగోతుతండాలో ఓ వ్యక్తి గురువారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన ఆంగోతు జగ్రు(50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు -
నిర్లక్ష్యమా.. అవగాహన లోపమా..!
[ 10-05-2024]
ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకునే వారిలో 90శాతం పైగా ఉన్నత చదువులు చదివిన వారే ఉంటారు -
విమర్శలు చేసే.. విజయం కాంక్షించే
[ 10-05-2024]
భువనగిరి లోక్సభ భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్కు మద్దతుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం రాయగిరిలో నిర్వహించిన బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ప్రజల్లో శాశ్వతంగా గుర్తు ఉండేలా అభివృద్ధి: మంత్రి కోమటిరెడ్డి
[ 10-05-2024]
ప్రజలు గత 25 ఏళ్లుగా తనను గెలిపించి.. మంత్రి అయ్యే వరకు తీసుకొచ్చారని శాశ్వతంగా గుర్తు ఉండేలా తాను అభివృద్ధి చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. -
పారదర్శకంగా లోక్సభ ఎన్నికలు
[ 10-05-2024]
ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం.. -
మూత్ర పిండం.. పొంచి ఉన్న గండం
[ 10-05-2024]
మానవునికి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ ఒకటి. వాతావరణ పరిస్థితుల్లో భాగంగా కిడ్నీ గండం ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు పెరుగుతుంది. -
తస్మాత్ జాగ్రత్త.. స్థానికేతరులు వెళ్లాల్సిందే!
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికలకు ముందు జిల్లాలో 48గంటల నిబంధనలు పటిష్టంగా అమలు చేయనున్నారు. -
నిరంతరం నిఘా..!
[ 10-05-2024]
ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని పారదర్శక ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. -
నాడు హవా.. నేడు నామమాత్రం
[ 10-05-2024]
ఉమ్మడి జిల్లాలో నాడు కమ్యూనిస్టులదే హవా. జాతీయస్థాయిలో రికార్డు స్థాయి మెజార్టీ సాధించింది వారే. ఎన్నిక ఏదైనా గెలుపు కమ్యూనిస్టులదే అనే స్థాయి. -
సరిహద్దులు దాటుతున్న తెలంగాణ మద్యం
[ 10-05-2024]
వారం రోజుల క్రితం కోదాడకు చెందిన ఓ వ్యక్తి ఏపీ రాష్ట్రానికి మద్యాన్ని తరలిస్తూ.. నందిగామ పోలీసులకు పట్టుబడ్డాడు. -
గట్టెక్కేలా.. ప్రత్యేక వ్యూహం
[ 10-05-2024]
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి -
నిర్బంధం చేస్తేనే.. వస్తారా..!
[ 10-05-2024]
ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు మరో రెండు రోజులు గడువు పెంచడం చూస్తే విద్యావంతులు కూడా ఓటు వేసేందుకు ఎంత నిర్లిప్తంగా ఉన్నారో అర్థమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
గాయమా? వ్యూహమా? ధోనీ ‘9’లో రావడంపై ఫ్లెమింగ్ స్పందన ఇదీ!
-
గో డిజిట్ ఐపీఓ.. ధరల శ్రేణి, లాట్ సైజ్ వివరాలు ఇవే..
-
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
-
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
-
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ