కోళ్ల దాణా సంచుల్లో బీటీ విత్తనాలు
భారత్లో నిషేధించిన బీటీ-3 పత్తి విత్తనాలను రైతులకు దొడ్డిదారిన విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.
2.2 టన్నుల విత్తనాలు, కారు స్వాధీనం: రాచకొండ సీపీ
ఈనాడు- హైదరాబాద్: భారత్లో నిషేధించిన బీటీ-3 పత్తి విత్తనాలను రైతులకు దొడ్డిదారిన విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలకు కోళ్ల దాణా మాటున ఈ విత్తనాలను చేరవేస్తున్న ముఠాలోని ఇద్దర్ని బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.70 లక్షల విలువైన 2.2 టన్నుల బీటీ-3 విత్తనాలు, ఒక కారు, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అసలు సూత్రధారి చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన నరసింహులు పరారీలో ఉన్నాడు. ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, ఎస్వోటీ డీసీపీ మురళీధర్, ఏసీపీ వెంకన్న నాయక్, ఇన్స్పెక్టర్ సుధాకర్తో కలిసి రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ గురువారం ఎల్బీనగర్లో కేసు వివరాలు వెల్లడించారు.
సంపాదన కోసం అడ్డదారి..
ఏపీలోని కృష్ణా జిల్లా మైలవరంవాసి రావి ప్రసన్నకుమార్(42) 20 ఏళ్ల క్రితం యాదాద్రి- భువనగిరి జిల్లా చౌటుప్పల్కు వలస వచ్చారు. పదేళ్ల క్రితం నవత ఆగ్రో డివిజిన్ పేరుతో చౌటుప్పల్లోనే ఎరువులు, విత్తనాల దుకాణం ప్రారంభించాడు. ఏపీలోని పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడుకు చెందిన గడ్డం రవీంద్రబాబు(42) ఎనిమిదేళ్ల క్రితం మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లా కుహి గ్రామానికి వలస వెళ్లాడు. నిషేధిత బీటీ పత్తి విత్తనాలు కొనుగోలు చేసి.. విక్రయించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే చౌటుప్పల్లో ఎరువుల దుకాణం నిర్వహించే ప్రసన్నకుమార్తో పరిచయం ఏర్పడింది. రవీంద్రబాబు ద్వారా విత్తనాలు తెప్పించి.. ఇక్కడి స్థానిక రైతులకు విడిగా విక్రయించేవాడు.
పైన దాణా.. లోపల నకిలీ..
ఈ నకిలీ విత్తనాలకు ప్రధాన సూత్రధారి చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన నరసింహులు ఐదేళ్లుగా ఈ నకిలీ దందా నడిపిస్తున్నాడు. నరసింహులు పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులకు అనుమానం రాకుండా విత్తనాలను ప్రీమియం చికెన్ ఫీడ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బస్తాల్లో నింపి ఐదు రాష్ట్రాలకు సరఫరా చేస్తాడు.
రెండు రాష్ట్రాల్లో పోలీసుల వేట..
నిషేధిత విత్తనాలను రైతులకు విక్రయిస్తున్నట్లు ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులకు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ సుధాకర్ బృందం ముఠా కోసం వెతికినప్పుడు కేవలం 24 కిలోలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. చౌటుప్పల్కు 2200 కిలోల నకిలీ విత్తనాలు వచ్చినట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. బుధవారం సాయంత్రం ఓ గోదాములో తనిఖీలు చేశారు. తొలుత చికెన్ ఫీడ్ అని నిందితులు నమ్మించినా వ్యవసాయ శాఖ అధికారులతో పరిశీలన చేయించగా.. అవన్నీ బీటీ విత్తనాలని తేలింది. గడ్డం రవీంద్రబాబు, రావి ప్రసన్నకుమార్ను అదుపులోకి తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..