సాహితీ వారసుడు పురుషోత్తమాచార్యులు
హుజూర్నగర్ పట్టణానికి చెందిన ముడుంబై పురుషోత్తమాచార్యులు జాతీయ ఉత్తమ సినీ విమర్శకుడిగా అవార్డు పొందారు.
జాతీయ అవార్డుకు ఎంపికైన పురుషోత్తమాచార్యులును సన్మానిస్తున్న కవులు, రచయితలు
హుజూర్నగర్ గ్రామీణం, నీలగిరి, న్యూస్టుడే: హుజూర్నగర్ పట్టణానికి చెందిన ముడుంబై పురుషోత్తమాచార్యులు జాతీయ ఉత్తమ సినీ విమర్శకుడిగా అవార్డు పొందారు. సంగీత విద్వాంసుడు ముడుంబై వేంకట నర్సింహాచార్యులు, మంగతాయమ్మలకు ఏడుగురు సంతానం. వారి పెద్ద కుమారుడే పురుషోత్తమాచార్యులు. తాత, తండ్రిని చూస్తూ చిన్ననాడే సంగీతం, సాహిత్యంతో పాటు నటన, గానం, రచన అన్ని రంగాల్లో తనదైన ముద్రవేశారు. సాహిత్యంలో అనేక పరిశోధనలు చేసిన ఆయన సినీ సంగీతం, సాహిత్యంపైన మిసిమి అనే మాస పత్రికలో రాసిన కథనాలను పరిశీలించిన జాతీయ సినీ అవార్డు కమిటీ ఆయన్ను ఉత్తమ విమర్శకుడిగా ఎంపిక చేసింది. పురుషోత్తమాచార్యులు నల్గొండలోని గీతా విజ్ఞాన ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తూ అక్కడే స్థిరపడ్డారు. సోదరి పద్మ, సోదరుడు దామోధరాచార్యులు కూడా సంగీత రంగంలోనే ఉన్నారు. తండ్రి సంగీత విద్వాంసుడు, కళాకారుడు కావడంతో ఈయన కూడా బాల నటుడిగా మన కర్తవ్యం, ద్రోహం, మేటి రైతు నాటికల్లో నటించారు.
ప్రయాణం ఇలా:
ఆకాశవాణిలో 1992లో లలిత సంగీత గానం చేశారు. శ్రీసుదర్శన ప్రభావం, హరిసంకీర్తనాచార్య లాంటి పద్యనాటకాలు రచించారు. 1979-85 వరకు శ్రీత్యాగరాజ ఉత్సవ సమితి కాద్యదర్శిగా అనేక సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ అన్నమాచార్య సంకీర్తనా ప్రచార సమితి అధ్యక్షుడిగా, ఘంటసాల కల్చరల్ అసోసియేషన్ ద్వారా 2 వేలకు పైగా సినీ సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీనాథబ్రహ్మ సంగీత కళాశాల ద్వారా 500 మందికి పైగా సంగీత విద్యను బోధించారు. 1985లో తపస్విని వీడియో చిత్రానికి సంగీత దర్శకుడిగా, 2000 సంవత్సరంలో అందరికీ విద్య ఆడియో సీడీ, 2006 నుంచి అన్నమయ్య పదశ్రుతి, అన్నమయ్య నృసింహ కీర్తనలు, అలంపురం జోగులాంబ కీర్తనలు, శ్రీనివాస చరితం లాంటి పలు సీడీలకు సంగీత దర్శకుడిగా ఉన్నారు. 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నంది నాటకోత్సవ పోటీలకు, 1999లో అన్నమాచార్య భావనావాహిని హైదరాబాద్ వారు నిర్వహించిన నంది నాటక పోటీలకు న్యాయనిర్ణేతగా ఉన్నారు. పురుషోత్తమాచార్యులు రచించిన సరాగాలు(పాటలు), విరిమువ్వలు(వచన కవితలు), పదో తరగతి తెలుగు పాఠ్యాంశ కథలు, మన ఘంటసాల సంగీత వైభవం లాంటివి 20 వరకు ముద్రణ అయ్యాయి. మచిలీపట్నంలో కళాపీఠం వారి ఘంటసాల కమెండేషన్ అవార్డు, హైదరాబాద్ శ్రీకళానిధి సంస్థ వారు ఉత్తమ సంగీత విద్వాన్ పురస్కారం, 2016లో తెలుగు విశ్వవిద్యాలయం వారు సాహితీ పురస్కారం ప్రదానం చేశారు. శ్రీ చందాల కేశవదాసు సాహిత్యంపై పరిశోధనలు చేసి డాక్టరేట్ పొందారు.
సాహిత్యాన్ని అందరికీ దగ్గర చేయడానికి కృషి: పురుషోత్తమాచార్యులు
వారసత్వంగా అందుకున్న సాహిత్యం మర్చిపోకుండా అందరికీ దగ్గర చేయడానికి కృషి చేస్తున్నాను. సంప్రదాయ సంగీతం, సాహిత్యంపై రచనలతో పాటు అనేక పరిశోధనలు చేస్తూ వ్యాసాలు రాశాను. జాతీయ అవార్డుకు ఎంపికవడం సంతోషంగా ఉంది. నాకు విద్యనందించిన వారికి అవార్డును అంకితం ఇస్తున్నాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాగల తొమ్మిది రోజుల్లో..!
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారానికి మరో తొమ్మిది రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో ప్రధాన పార్టీలు ముమ్మర ప్రచారానికి సమాయత్తమవుతున్నాయి. -
అసెంబ్లీకి ఉత్సాహం.. లోక్సభకు తాత్సారం
[ 03-05-2024]
అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా తగ్గుతోంది. ఓటర్లలో అసెంబ్లీ ఎన్నికలకు ఉన్న ఆసక్తి లోక్సభ ఎన్నికలకు వచ్చే సరికి సడలిపోతోంది. -
చెరువును చెరబట్టి.. అక్రమంగా తవ్వేసి
[ 03-05-2024]
అక్రమార్కులు చెరువులపై పడ్డారు. తాటి చెట్టంత లోతుల్లో జేసీబీలతో తవ్వుతూ వందలాది వాహనాలతో మట్టి తరలిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో చెరువులు ఎండిపోవడం అక్రమార్కులకు కలిసొచ్చింది. -
ఇంటి వద్దే ఓటు..!
[ 03-05-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం పలు రకాల చర్యలు చేపడుతోంది. నడవలేని, పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని ఓటరు ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. -
అత్యధికం 2.72 లక్షలు.. అత్యల్పం 5 వేలు
[ 03-05-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గంలో ఆధిక్యతల తీరు పరిశీలిస్తే ఔరా అన్పించేలా ఉన్నాయి. నియోజకవర్గంలో మొదటిసారి ఎన్నికలు జరిగిన సమయంలో జాతీయ స్థాయి రికార్డును నెలకొల్పడంతో పార్లమెంటు భవనాన్ని -
ఎవరికి ఓటేశామో తెలుసుకోవచ్చు
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికలు ఈ నెల 13న జరుగనున్నాయి. ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత అభ్యర్థికి పడిందో లేదో వీవీప్యాట్ యంత్రంలో ఓటర్లు పరిశీలించవచ్చు. -
అయ్యో పాపం ఆరుషి
[ 03-05-2024]
నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన ఐతగోని రవి, మమత దంపతుల కుమార్తె ఆరుషి(18 నెలల). -
ఎవరికి మూడుద్దో
[ 03-05-2024]
నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 2009లో భువనగిరి లోక్సభ స్థానం ఏర్పడింది. అప్పటి నుంచి మూడు సార్లు ఎన్నికలు జరగ్గా ఇంత భారీ సంఖ్యలో నామినేషన్లు పడలేదు. -
లాడ్జిలపై ఏదీ నిఘా?
[ 03-05-2024]
ప్రసిద్ధ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్టలో లాడ్జిల నిర్వహణ అధ్వానంగా మారింది. ఎవరు వస్తున్నారో.. ఎవరు పోతున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. -
విద్వేషాలు సృష్టిస్తున్న భాజపా: మంత్రి ఉత్తమ్
[ 03-05-2024]
మతాన్ని అడ్డు పెట్టుకొని భాజపా విద్వేషాలు సృష్టిస్తుందని, మరో అవకాశం ఇస్తే రిజర్వేషన్లకు తూట్లు పడతాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
వైద్యుల అర్హతలు బోర్డుల మీద బహిర్గతం చేయండి
[ 03-05-2024]
అర్హతలు లేకుండానే ఆస్పత్రుల్లో వైద్యం చేస్తున్న తీరుపై గత నెల 18న ‘నాడి తెలియని నకిలీలు’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. -
ఓటుకు నోటు కేసును ప్రభావితం చేస్తారేమో?
[ 03-05-2024]
భారాస అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై రెండు రోజుల నిషేధం విధించడం ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుట్రలో భాగమేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. -
ఆరుబయట నిద్రిస్తుండగా..చోరీ
[ 03-05-2024]
ఒకేరోజు రాత్రి తాళాలు వేసి ఉన్న నాలుగు ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన యాదాద్రిభువనగిరి జిల్లా గుండాల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్