నిర్మాణాల్లో.. అమలు కాని నిబంధనలు
ఆలేరు పురపాలికగా ఏర్పడ్డాక ఏటా వందకు పైగా ఇళ్ల నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. కొత్త పురపాలిక చట్టం అమలులోకి వచ్చాక నిర్మాణాల అనుమతుల నిబంధనలు కఠినతరం చేశారు.
ఆదర్శనగర్లో ఇరుకుగా ఒక కాలనీ
ఆలేరు, న్యూస్టుడే: ఆలేరు పురపాలికగా ఏర్పడ్డాక ఏటా వందకు పైగా ఇళ్ల నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. కొత్త పురపాలిక చట్టం అమలులోకి వచ్చాక నిర్మాణాల అనుమతుల నిబంధనలు కఠినతరం చేశారు. కానీ గృహ నిర్మాణదారుల్లో అవగాహన లోపం, నిర్లక్ష్యం, పుర యంత్రాంగం మెతకవైఖరి వెరసి యజమానులు నిబంధనలు పాటించకుండా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. ఫలితంగా పురపాలిక ఆదాయాన్ని కోల్పోవడంతో పాటు సెట్బ్యాక్ నిబంధనలు పాటించక పోవడంతో వీధులు, కాలనీలు ఇరుకుగా మారుతున్నాయి.
నిబంధనలకు పాతర...
పురపాలికల నిబంధనల మేరకు ముప్పై అడుగుల వెడల్పు స్థలాన్ని దారికి వదిలి నిర్మాణాలు చేపట్టాలి. ఇంటి యజమాని దరఖాస్తు సమయంలో ఇంటి ప్లానులో 30 అడుగుల రహదారిని వదిలి నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొంటున్నారు. ఇందుకు స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తున్నారు. కానీ చాలావరకు 18, 20 అడుగుల రహదారులే ఉండగా ఈమేరకే నిర్మాణాలు జరుగుతున్నాయి.
క్షేత్రస్థాయిలో ఇలా... .
ఆలేరు పురపాలికలో ఏటా వందకు పైగా నిర్మాణాలు జరుగున్నాయి. వీటిలో 2/3 వంతు మేర నిబంధనలు పాటించడం లేదు. ప్రభుత్వం గతంలో ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బృందం నూతన నిర్మాణాలను క్షేత్రస్థాయిలో తనిఖీచేసి దారులు ఆక్రమించి, నిబంధనలు విస్మరించి నిర్మించిన కట్టడాలను గుర్తించి కూల్చివేయాల్సి ఉంది. కానీ ఇలాంటివి జరిగిన దాఖలాలు లేవు. రహదారి మధ్యలో నుంచి 15 అడుగుల దారి వదిలి చేపట్టాల్సిన నిర్మాణాల గురించి పుర అధికారులు, సిబ్బంది పట్టించుకుంటున్న దాఖలాలులేవు.
సదుపాయాలకు అవరోధం..
సెట్బ్యాక్ నిబంధనలు పాటించకుండా చేపడుతున్న నిర్మాణాలు, ఇళ్లముందు ర్యాంపులు, మొక్కల కోసం నిర్మించిన గద్దెల కారణంగా 18, 20 అడుగుల రహదారులు మరింత కుచించుకుపోతున్నాయి. కొన్ని వీధులు, కాలనీల్లో ఆటోలు, కార్లు ఎదురెదురుగా వెళ్లలేని విధంగా నిర్మాణాలు చేపట్టారు. శివారు కాలనీలు, పాత వీధుల్లో ఈ పరిస్థితి మరింత అధికంగా ఉంది. క్రాంతినగర్, మార్కెండేయ కాలనీ, సిల్క్నగర్, వడ్డెరబస్తీ, బీసీకాలనీ సంతోషినగర్, గణేష్నగర్, చింతలబస్తీ కాలనీల్లో సెట్బ్యాక్ లేని నిర్మాణాలు ఉన్నాయి. ఇలాంటి నిర్మాణాల కారణంగా మురుగు కాలువలు, సీసీ రహదారులు, నల్లా పైపులైన్లు ఇతరత్రా అవసరాల కోసం తరచూ ఇబ్బందులు తప్పడం లేదు.
పరిశీలన చేస్తున్నాం:
కె.లక్ష్మీ, పుర కమిషనరు, ఆలేరు
అనుమతులు లేకుండా నిర్మించిన ఇళ్ల వివరాలను పుర సిబ్బంది గుర్తిస్తున్నారు. సెట్బ్యాక్ పాటించని విషయమై ఫిర్యాదులు అందితే వెంటనే చర్యలు చేపడతాం. దరఖాస్తు సమయంలో ఉన్న నిబంధనల ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలి. లేదంటే కూల్చివేతలు, జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాగల తొమ్మిది రోజుల్లో..!
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారానికి మరో తొమ్మిది రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో ప్రధాన పార్టీలు ముమ్మర ప్రచారానికి సమాయత్తమవుతున్నాయి. -
అసెంబ్లీకి ఉత్సాహం.. లోక్సభకు తాత్సారం
[ 03-05-2024]
అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా తగ్గుతోంది. ఓటర్లలో అసెంబ్లీ ఎన్నికలకు ఉన్న ఆసక్తి లోక్సభ ఎన్నికలకు వచ్చే సరికి సడలిపోతోంది. -
చెరువును చెరబట్టి.. అక్రమంగా తవ్వేసి
[ 03-05-2024]
అక్రమార్కులు చెరువులపై పడ్డారు. తాటి చెట్టంత లోతుల్లో జేసీబీలతో తవ్వుతూ వందలాది వాహనాలతో మట్టి తరలిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో చెరువులు ఎండిపోవడం అక్రమార్కులకు కలిసొచ్చింది. -
ఇంటి వద్దే ఓటు..!
[ 03-05-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం పలు రకాల చర్యలు చేపడుతోంది. నడవలేని, పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని ఓటరు ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. -
అత్యధికం 2.72 లక్షలు.. అత్యల్పం 5 వేలు
[ 03-05-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గంలో ఆధిక్యతల తీరు పరిశీలిస్తే ఔరా అన్పించేలా ఉన్నాయి. నియోజకవర్గంలో మొదటిసారి ఎన్నికలు జరిగిన సమయంలో జాతీయ స్థాయి రికార్డును నెలకొల్పడంతో పార్లమెంటు భవనాన్ని -
ఎవరికి ఓటేశామో తెలుసుకోవచ్చు
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికలు ఈ నెల 13న జరుగనున్నాయి. ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత అభ్యర్థికి పడిందో లేదో వీవీప్యాట్ యంత్రంలో ఓటర్లు పరిశీలించవచ్చు. -
అయ్యో పాపం ఆరుషి
[ 03-05-2024]
నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన ఐతగోని రవి, మమత దంపతుల కుమార్తె ఆరుషి(18 నెలల). -
ఎవరికి మూడుద్దో
[ 03-05-2024]
నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 2009లో భువనగిరి లోక్సభ స్థానం ఏర్పడింది. అప్పటి నుంచి మూడు సార్లు ఎన్నికలు జరగ్గా ఇంత భారీ సంఖ్యలో నామినేషన్లు పడలేదు. -
లాడ్జిలపై ఏదీ నిఘా?
[ 03-05-2024]
ప్రసిద్ధ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్టలో లాడ్జిల నిర్వహణ అధ్వానంగా మారింది. ఎవరు వస్తున్నారో.. ఎవరు పోతున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. -
విద్వేషాలు సృష్టిస్తున్న భాజపా: మంత్రి ఉత్తమ్
[ 03-05-2024]
మతాన్ని అడ్డు పెట్టుకొని భాజపా విద్వేషాలు సృష్టిస్తుందని, మరో అవకాశం ఇస్తే రిజర్వేషన్లకు తూట్లు పడతాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
వైద్యుల అర్హతలు బోర్డుల మీద బహిర్గతం చేయండి
[ 03-05-2024]
అర్హతలు లేకుండానే ఆస్పత్రుల్లో వైద్యం చేస్తున్న తీరుపై గత నెల 18న ‘నాడి తెలియని నకిలీలు’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. -
ఓటుకు నోటు కేసును ప్రభావితం చేస్తారేమో?
[ 03-05-2024]
భారాస అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై రెండు రోజుల నిషేధం విధించడం ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుట్రలో భాగమేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. -
ఆరుబయట నిద్రిస్తుండగా..చోరీ
[ 03-05-2024]
ఒకేరోజు రాత్రి తాళాలు వేసి ఉన్న నాలుగు ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన యాదాద్రిభువనగిరి జిల్లా గుండాల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్