AP News: తిరుపతిని రాజధానిగా చేయాలి: చింతా మోహన్
అమరావతిలో రాజధానికి ప్రధానమంత్రి మోదీ వేసిన పునాది అనాదిగా మిగిలిందని, తిరుపతిని రాజధానిగా చేయాలని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ సూచించారు. సోమవారం సూళ్లూరుపేటలో ఆయన పర్యటించి మాట్లాడుతూ అమ
మాట్లాడుతున్న చింతా మోహన్
సూళ్లూరుపేట, న్యూస్టుడే: అమరావతిలో రాజధానికి ప్రధానమంత్రి మోదీ వేసిన పునాది అనాదిగా మిగిలిందని, తిరుపతిని రాజధానిగా చేయాలని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ సూచించారు. సోమవారం సూళ్లూరుపేటలో ఆయన పర్యటించి మాట్లాడుతూ అమరావతి రైతులకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందని చెప్పారు. రాజధానికి 1.5 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఏర్పేడు నుంచి రాపూరు వరకు అందుబాటులో ఉందని చెప్పారు. ఇక్కడ రాజధాని ఏర్పాటుచేస్తే 13 జిల్లాలకు అందుబాటులో ఉంటుందన్నారు. కండలేరు, సోమశిల జలాశయాలు ఉండటంతోపాటు, తిరుపతికి ఏడు జాతీయ రహదారుల కలయిక, అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉందన్నారు. మోదీ పరిపాలన అధ్వానంగా ఉందని ఆరోపించారు. నల్లదనం కేంద్రంగా పీఎం కార్యాలయం ఉందని విమర్శించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం పతనావస్థలో ఉందన్నారు. దుగరాజపట్నం ఓడరేవు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. శ్రీసిటీ, మేనకూరు, మాంబట్టు, కృష్ణపట్నం ప్రత్యేక ఆర్థిక మండళ్లలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని, ఇచ్చినా సెక్యూరిటీ, వాచ్మెన్లకు పరిమితం చేస్తున్నారని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్మాయ.. శ్రమజీవి కన్నీటి ఛాయ!
[ 05-05-2024]
‘పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం’ అని పదే పదే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.. అదే పేదలను అయిదేళ్లుగా పీక్కుతిన్నారు. పొట్టకూటికి తెల్లవారుజామునే అడ్డా మీదకు చేరుకునే కూలీలను.. కేవలం ఓట్ల సమయంలో పనికొచ్చే యంత్రాలుగానే చూశారు. -
ఆర్భాటమే.. అభివృద్ధేది జగన్!
[ 05-05-2024]
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం... ఆర్భాటంగా పనులు మంజూరు చేస్తూ.. శంకుస్థాపనలు చేయించింది. చాలాచోట్ల ప్రతిపాదనలకే పరిమితం కాగా.. కొన్నిచోట్ల టెండరు దశలోనే నిలిచిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో ప్రారంభించి అసంపూర్తిగా వదిలేశారు. -
పాలకా.. ఏదీ బృహత్ ప్రణాళిక?
[ 05-05-2024]
ఏళ్ల తరబడి నుంచి పట్టణ ప్రజలు ఎదురుచూస్తోన్న కందుకూరు మాస్టర్ప్లాన్ (బృహత్ ప్రణాళిక)కు మోక్షం లభించడం లేదు. నూతన ప్రణాళిక కోసం ఆరేళ్ల క్రితం అడుగులు పడగా.. నేటికీ ఖరారు కాకపోవడం ప్రజల్ని విస్తు గొలుపుతోంది. -
ఊకదంపుడు ఉపన్యాసం.. వైకాపా శ్రేణుల్లో నిరుత్సాహం
[ 05-05-2024]
కలెక్టరేట్, విద్య, జడ్పీ, నేరవిభాగం, న్యూస్టుడే: నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ కూడలిలో శనివారం నిర్వహించిన జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార బహిరంగ సభ చప్పగా సాగింది. -
భవనాలు సరే.. బిల్లులేవి ఏలికా?
[ 05-05-2024]
వైకాపా పాలకులు గొప్పగా ప్రచారం చేసుకునే గ్రామ సచివాలయ భవనాల పరిస్థితి ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు అన్నట్లు ఉంది. ప్రతి గ్రామానికి శాశ్వత సచివాలయ భవనం ఏర్పాటు చేసే బాధ్యత మాది అని చెప్పిన ముఖ్యమంత్రి.. -
రూ.18 కోట్లు ఖర్చు.. చుక్క నీరొస్తే ఒట్టు!
[ 05-05-2024]
పాలకులు అనాలోచితంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. రూ.కోట్లు ఖర్చు చేసిన పథకాన్ని వినియోగంలోకి తీసుకురాలేదు. దీంతో వేసవిలో దప్పికతో ప్రజలు అలమటించిపోతున్నారు. -
సర్వేపల్లి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక
[ 05-05-2024]
‘అయిదేళ్ల వైకాపా పాలనలో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు... అరాచకాలు, అక్రమ కేసులు, దోపీˆడీ తప్ప చేసిన అభివృద్ధి శూన్యమ’ని సర్వేపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తెలిపారు. -
తెదేపాతోనే మాదిగల అభ్యున్నతి
[ 05-05-2024]
మాదిగల అభ్యున్నతి తెదేపాతోనే సాధ్యమని ఆ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. శనివారం నగరంలోని మహేశ్వరి, పరమేశ్వరి కల్యాణ మండపంలో సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. -
45 నిమిషాల ప్రసంగం.. నగరవాసికి ఏడు గంటల నరకం
[ 05-05-2024]
నెల్లూరు నగరంలో వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభ.. ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యాన్ని నింపింది. ప్రసంగం ప్రారంభం నుంచి ముగించే వరకు ఊకదంపుడు ఉపన్యాసం మినహా.. జిల్లా ఊసెత్తకపోవడం ప్రజలను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. -
ప్రసన్న.. ఎన్ని పార్టీలు మారావో గుర్తుచేసుకో
[ 05-05-2024]
రాజకీయంగా జన్మనిచ్చి మంత్రిని చేసి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసిన పార్టీకి వెన్నుపోటు పొడిచింది, గెలిచిన తొమ్మిది రోజులకే కాంగ్రెస్లో చేరి ఎవరు అమ్ముడుపోయారని ప్రసన్న గుర్తుచేసుకోవాలని తెదేపా అభ్యర్థి ప్రశాంతిరెడ్డి అన్నారు. -
వైకాపా నాయకుల ఇసుక దోపిడీ
[ 05-05-2024]
పెన్నానదిలో విరువూరు ఇసుకరేవు నుంచి అక్రమంగా రూ.కోట్లాది రూపాయల ఇసుకను తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకున్నారని సర్వేపల్లి నియోజకవర్గ తెదేపా సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. -
నిరుద్యోగులకు వైకాపా మోసం: ఆనం
[ 05-05-2024]
జగన్ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని ఆత్మకూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు. మండల పరిధిలోని గోవిందంపల్లి, పాతాళపల్లి, ముస్తాపురం, వరికుంటపాడు, ఉప్పలపాడు, కమ్మవారిపల్లి, పడమటి కంభంపాడు, సోమశిల, సంజీవ నగరం తదితర గ్రామాల్లో శనివారం ఆనం ఎన్నికల ప్రచారం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
లఖ్నవూ చిత్తు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన కోల్కతా
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..