ఈ క్రాప్లో అవకతవకలపై జేసీ ఆగ్రహం
జామాయిల్ సాగు పొలంలో శనగ పంట వేసినట్లు ఈ-క్రాప్ ఎలా నమోదు చేస్తారని నందవరం వీఏఏపై జేసీ కూర్మనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీఏఏకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఆదేశం
నందవరం వీఏఏని ప్రశ్నిస్తున్న జేసీ కూర్మనాథ్
మర్రిపాడు, న్యూస్టుడే: జామాయిల్ సాగు పొలంలో శనగ పంట వేసినట్లు ఈ-క్రాప్ ఎలా నమోదు చేస్తారని నందవరం వీఏఏపై జేసీ కూర్మనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన నందవరం, పొంగూరు గ్రామాల్లో ఈ-క్రాప్ చేసిన పొగాకు, శనగ పంటను పరిశీలించారు. ఆ సందర్భంగా నందవరంలో జరిగిన ఈ-క్రాప్ నమోదులో అవకతవకలు జరిగినట్లు గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే నంబరు 396లో శనగ పంట వేసి ఉంటే.. జామాయిల్ సాగులో ఉన్న సర్వే నంబరు 168లో శనగ వేసినట్లు ఈ-క్రాప్ ఎలా చేస్తారన్నారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అయిన మీకు మీ పరిధిలో ఎంత పొలం ఉందో తెలియని స్థితిలో ఉన్నారా? రైతు చెప్పారని ఇష్టం వచ్చినట్లు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. సచివాలయంలో కూర్చొని పనిచేస్తే ఇలానే ఉంటుంది. క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తే.. అక్కడ రైతు ఏ పంట వేశారో పరిస్థితి అర్థమవుతుందని అన్నారు. వీఏఏ చెప్పింది.. వీఆర్వో తంబ్ చేశాను అనే సాకు చెప్పకుండా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి పని చేయండి అని హితవు పలికారు. రైతు ఏ పంట వేశారు? ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు? అనే వివరాలు తెలుసుకునేందుకు సూపర్ చెక్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వీఏఏకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని వ్యవసాయశాఖ జేడీని ఆదేశించారు. పొంగూరు కండ్రికలో భూ ఆక్రమణలను సీపీఐ నాయకులు జేసీ దృష్టి తీసుకెళ్లిగా, భూ సమస్య తమ దృష్టికి వచ్చిందని, సమగ్ర విచారణ జరిపి త్వరలోనే అర్హులకు న్యాయం చేస్తామని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదే మాట.. పాత హామీల మూట!
[ 10-05-2024]
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ప్రత్యేక మ్యానిఫెస్టో, అందులోని అంశాలను చూసి జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. -
కొండంత దోపిడీ
[ 10-05-2024]
వైకాపా నాయకులు అయిదేళ్లు అనకొండల్లా మారారు. అధికారమే అండగా.. రాజకీయమే పెట్టుబడిగా.. ఎక్కడ నాణ్యమైన మట్టి కనిపిస్తే అక్కడ వాలిపోయారు. నిబంధనలు కాలరాస్తూ ప్రకృతి వనరులను యథేచ్ఛగా కొల్లగొట్టారు. -
విద్యార్థుల ఉత్తీర్ణతకు చర్యలు
[ 10-05-2024]
పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులందరూ అనుబంధ పరీక్షల్లో పాసయ్యేలా హెచ్ఎంలు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారి పీవీజే రామారావు తెలిపారు. -
మస్తు చెప్పారు ఉపాధి ఆపేశారు
[ 10-05-2024]
పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమంతోపాటు వారికి మెరుగైన జీవనోపాధి కల్పించాలన్న లక్ష్యంతో బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రాయితీతో అందించే రుణాలను వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. -
హోరెత్తిన తెదేపా ప్రచారం
[ 10-05-2024]
తెదేపా అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కావలి, కందుకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న వారు కార్యకర్తలతో కలసి గురువారం వాడవాడలా ప్రచారం చేశారు. -
వలేటివారిపాలెం బాధలు వర్ణనాతీతం
[ 10-05-2024]
మండలంలో సమస్యలు తిష్ఠ వేశాయి. తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ, దెబ్బతిన్న రహదారులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సమస్యల వాడలు.. పట్టని పాలకులు
[ 10-05-2024]
పట్టణంలోని పాతూరుతో సహా సమీప ప్రాంతాల్లోని వార్డుల్లో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. ఛిద్రమైన రహదారులు.. పూడికతో నిండిన కాలువలతో నిత్యం పడరాని పాట్లు పడుతున్నారు. -
కాలనీల్లో కష్టాలు.. ఇంకా ఎన్నాళ్లు?
[ 10-05-2024]
పట్టణంలోని పలు కాలనీలు కీలకమైన మౌలిక వసతుల లేమితో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. వైకాపా ప్రభుత్వం వచ్చాక కాలనీల్లో కనీస సౌకర్యాలు కల్పించే నాధులే లేకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అధ్వాన దారులు.. పట్టని పాలకులు
[ 10-05-2024]
తెదేపా హయాంలో మట్టి రోడ్డుగా ఉన్న తొడుగుపల్లెకు 16 ఏళ్ల కిందట తారు రోడ్డు వేశారు. అధ్వానంగా తయారవడంతో అయిదేళ్లుగా మరమ్మతులు చేయాలని పాలకులకు విన్నవించినా పట్టించుకోలేదు. -
పసిమొగ్గలపై శీతకన్నేల పాలకా!
[ 10-05-2024]
బాలల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తాం.. బడులన్నీ బాగు చేస్తున్నాం.. అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దుతున్నాం.. ఇవీ జగన్ మాటలు. క్షేత్రంలో ఇవి ఎక్కడా కనిపించడం లేదు. కూలే భవనాలు.. ఇరుకు గదుల్లో ఊపిరాడక బాలలు అల్లాడిపోతున్నారు. -
హత్య కేసులో నిందితుల అరెస్టు
[ 10-05-2024]
జండాదిబ్బలో మంగళవారం రాత్రి హత్యకు గురైన సుబ్బమ్మ కేసులో ఇద్దరు నిందితులను గురువారం సంగం సి.ఐ.రవినాయక్, ఎస్సై కె.నాగార్జునరెడ్డి బుచ్చిరెడ్డిపాళెం బస్టాండులో అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
-
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
-
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
-
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
-
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు