నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే!
జిల్లాలో ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. పార్లమెంటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన వివిధ పార్టీల అభ్యర్థులు, నాయకులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు.
దుత్తలూరులో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు
దుత్తలూరు, న్యూస్టుడే: జిల్లాలో ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. పార్లమెంటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన వివిధ పార్టీల అభ్యర్థులు, నాయకులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రవర్తనా నియమావళి(మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్)ను అధికారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను నియమించి వాహనాలను క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రచార కార్యక్రమాలు, సభలు, సమావేశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. బ్యాంకుల లావాదేవీలపై కూడా ఓ కన్నేసి ఉంచుతున్నారు. పార్టీలు, అభ్యర్థులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు సైతం నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రచారాల్లో ఇవి తగవు.. మతపరమైన ప్రార్థనా మందిరాల్లో కులం, మతం, ప్రాంతం, వర్గ, జాతి బేధాలు తదితర సున్నితమైన అంశాలతో ప్రచారం చేయరాదు. ప్రజా జీవితానికి ఇబ్బంది కలిగేలా ఊరేగింపుతో వెళ్లరాదు. అనుమతి ఉన్న వాహనాల్లో మాత్రమే ప్రచారాలు చేయాలి. ఇందులో ఐదుగురి కంటే ఎక్కువ మంది ప్రయాణించకూడదు. ప్రభుత్వ కార్యాలయాల్లో, మైదానాల్లో అనుమతి లేకుండా ప్రచారాలు చేయకూడదు. ప్రైవేటు స్థలాల్లో చేసేందుకు ఇంటి, స్థల యజమాని, ఎన్నికల అధికారి అనుమతులు తీసుకోవాలి. ప్రచారాల్లో మద్యం పంపిణీ పూర్తిగా నిషేధం. ప్రజల మధ్య శత్రుత్వం పెరిగేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు.
అడ్డు చెప్పకూడదు
కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో అధికారులు విస్తృత తనిఖీలు చేస్తుంటారు. వాహనాలు ఆపి పూర్తిగా పరిశీలిస్తారు. దీనికి అభ్యంతరం పెట్టే అధికారం ఎవరికీ లేదు. వాటిల్లో నిషేధిత వస్తువులు ఉంటే స్వాధీనం చేసుకుంటారు. పరిమితికి మించి లెక్కలు, ఆధారాలు చూపని నగదు, మద్యం ఉంటే వాహనంతో సహా సీజ్ చేస్తారు. సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. ఇప్పటికే జిల్లాలో 18 చోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు.
చేయకూడనివి..
సభలు, సమావేశాలు, ప్రదర్శనలకు ఎన్నికల అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించరాదు. పోలింగు రోజు ఓటర్ల రవాణాకు ఎలాంటి వాహనాలు ఉపయోగించకూడదు. ఎన్నికల ఫలితాలపై సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ నిషేధం. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకూడదు. పోలింగు కేంద్రాల్లోకి అక్రమంగా ప్రవేశించడం, ఈవీఎంలు, ఇతర దస్త్రాలు తొలగించడం నేరం. రహస్య ఓటింగ్ పద్ధతికి, ఇతరుల సభలు, సమావేశాలకు భంగం కలిగించటం, ప్రదర్శనలతో ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదు. తప్పుడు ప్రకటనలు, పెయిడ్ న్యూస్కు అనుమతి లేదు. తాత్కాలిక, శాశ్వత ఉద్యోగ నియామకాలు చేపట్టకూడదు. కోడ్ అమలులో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు అధికారులను సమీక్షలు, సమావేశాలకు పిలవకూడదు. పోలింగు 48 గంటల ముందు ప్రచారాలు పూర్తిగా ఆపేయాలి. నామినేషన్లు వేసేటప్పుడు మూడు వాహనాల్లో మాత్రమే రావాలి. ఐదుగురికి మాత్రమే ఈఆర్వో కార్యాలయంలోకి అనుమతి ఇస్తారు.
చేసుకోదగినవి...
న్యాయస్థానం ఆదేశాలు ఉన్న ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. కరవు నివారణ పనులు చేపట్టవచ్చు. కరవు ప్రాంతాల్లో ఆహార సరఫరా చేయవచ్చు. ఎన్నికల సంఘం అనుమతితో మంచినీటి సరఫరా, ఖైదీల విడుదల, గిట్టుబాటు ధరల నిర్ణయం తీసుకోవచ్చు. అభ్యర్థి ప్రచారానికి టోపీలు, మాస్కులు వగైరా ఇవ్వొచ్చు. ప్రత్యర్థి పార్టీ విధి విధానాలను విమర్శించొచ్చు. రాజకీయ పార్టీలు ముందస్తు అనుమతితో ఊరేగింపులు, ర్యాలీలు చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముస్లిం మైనార్టీల అభ్యున్నతిని వైకాపా ప్రభుత్వం కాలరాస్తోంది!
[ 29-04-2024]
‘రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే కూటమిగా పోటీ చేస్తున్నాం. ముస్లిం మైనార్టీల అభ్యున్నతి, సంక్షేమానికి ఎన్డీయేతో కలిసిన తెదేపా ప్రభుత్వంలో విశేషంగా కృషి చేశాం. మళ్లీ కూటమికి ఓటేసి గెలిపిస్తే.. మరింతగా పాటుపడతాన’ని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. -
ఆత్మస్తుతి.. హామీల ఊసేది
[ 29-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కందుకూరు పట్టణానికి వస్తున్నారని తెలిసి.. ఆశతో వచ్చిన ప్రజలు అసంతృప్తితో వెనుదిరిగారు. -
గొప్పలు.. ప్రజారోగ్యానికి తిప్పలు
[ 29-04-2024]
ప్రతి గ్రామానికి వైద్య సేవలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. నాడు-నేడు కింద ఆసుపత్రుల రూపురేఖలు మార్చుతున్నాం. ఉప, పట్టణ ఆరోగ్య కేంద్రాలను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చెబుతున్నా.. -
చెంతనే నీరున్నా.. చింతే నాయకా
[ 29-04-2024]
వేసవి వచ్చింది... నగర, పట్టణ ప్రాంతాల్లో నీటి సమస్య పొంచిఉంది. నీటి వనరులున్నా.. నిర్వ హణ లోపంతో ప్రజలకు తాగునీరు అందడం లేదు. పథకాలున్నా.. -
జగనూ.. చెరువులను మింగేస్తున్నారు
[ 29-04-2024]
పూర్వీకులు ఎంతో ముందుచూపుతో చెరువులను ఏర్పాటుచేశారు. గొలుసుకట్టు విధానంలో ఉండడంతో వరద నివారణ సాధ్యమయ్యేది. భూగర్భ జలాలు పెరుగుతాయి. తాగునీటి అవసరాలు తీరడంతో పాటు సాగుకు ఆధారంగా ఉన్నాయి. -
సంగం హామీకి సున్నం
[ 29-04-2024]
దుష్ట సంహారం నిమిత్తం పరమేశ్వరుడు వినియోగించే ధనస్సుని ‘పినాక ’అంటారు. పినాక ధారుడైన పరమశివుడిని ‘పినాకపాణి’ అని భక్తులు పూజిస్తారు. కర్ణాటక రాష్ట్రం నంది పర్వత సానువుల్లో ఉద్భవించిన నది వంపులు తిరిగి శివుడి విల్లు పినాక ఆకారంలో ఉండటంతో పెన్నానది అని పిలుస్తున్నారు. -
అక్రమాలకు పాల్పడిన ఏపీజీబీ మేనేజర్ అరెస్టు
[ 29-04-2024]
అమడగూరు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో గతంలో మేనేజర్గా పని చేసిన కమతం పెంచల్రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి ఆదివారం కదిరి జ్యూడిషియల్ ఫస్ట్క్లాస్ మెసిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి మీనాక్షి సుందరి ఎదుట హాజరు పరిచినట్లు అమడగూరు ఎస్ఐ మగ్బూల్బాషా తెలిపారు. -
సమకూరని మౌలిక వసతులు
[ 29-04-2024]
మండలంలోనే పెద్ద పంచాయతీ బ్రాహ్మణక్రాక అరుంధతి వాడలోని అంతర్గత రోడ్డు ఇది. మురుగు నీటి కాలువలు పూడి పోయాయి. దిగువ ప్రాంతాలకు మురుగు పారక..రోడ్డుపై నిల్వ ఉంది. కాలనీ వాసులు ఈ రోడ్డుపై నిత్యం రాకపోకలు సాగించాల్సి వస్తోంది. -
పోలింగ్ కేంద్రాలకు అధికారుల కేటాయింపు
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం కలెక్టరేట్లో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్ను సాధారణ పరిశీలకులు నితిన్ సింగ్ బదారియ, -
వేడుకగా మహా పట్టాభిషేకం
[ 29-04-2024]
బాలాజీనగర్లోని సీతారామ మందిరంలో ఆదివారం స్వామివారికి మహా పట్టాభిషేక వేడుకలు చేపట్టారు. వేడుకల్లో భాగంగా ఉదయం స్వామి వారికి అభిషేకాలు, హోమాలు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్