పరిధి పెద్ద.. సమస్యల తిష్ఠ
నెల్లూరు నగరంలోని 37వ డివిజన్ పరిధి పెద్దదిగా ఉన్నా.. సమస్యలు పరిష్కారం కావడం లేదు. డివిజన్లో కొండాయపాళెం రోడ్డు, మిలటరీకాలనీ, టీసీఎస్నగర్, వేమాలశెట్టిబావి సంఘం, రామ్నగర్, సరస్వతినగర్, క్రాంతినగర్, రాజగోపాలపురం, వేణుగోపాలస్వామి భూములున్న ప్రాంతం, ఎర్రగడ్డ దళితవాడ, టెక్కేమిట్ట రోడ్డు, ఇండియన్ గ్యాస్రోడ్డు తదితర ప్రాంతాలున్నాయి.
37వ డివిజన్లో ఇదీ పరిస్థితి
న్యూస్టుడే, నెల్లూరు(జడ్పీ)
నెల్లూరు నగరంలోని 37వ డివిజన్ పరిధి పెద్దదిగా ఉన్నా.. సమస్యలు పరిష్కారం కావడం లేదు. డివిజన్లో కొండాయపాళెం రోడ్డు, మిలటరీకాలనీ, టీసీఎస్నగర్, వేమాలశెట్టిబావి సంఘం, రామ్నగర్, సరస్వతినగర్, క్రాంతినగర్, రాజగోపాలపురం, వేణుగోపాలస్వామి భూములున్న ప్రాంతం, ఎర్రగడ్డ దళితవాడ, టెక్కేమిట్ట రోడ్డు, ఇండియన్ గ్యాస్రోడ్డు తదితర ప్రాంతాలున్నాయి. ఉన్న ప్రధాన ప్రాంతాలన్నీ మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉన్నాయి. కొండాయపాళెం రోడ్డులో దోమల బెడద తీవ్రంగా ఉంది. పలుచోట్ల సిమెంట్ రోడ్లు ధ్వంసమై గుంతలమయంగా మారిపోతున్నాయి. మిలటరీ కాలనీలో ఇటీవల కాలంలో వచ్చిన భారీ తుపాన్ వల్ల చెట్లన్నీ దెబ్బతిన్నాయి. గతంలో ఎంతో అభివృద్ధి చెందిన ఈ ప్రాంతంలో పారిశుద్ధ్యం లోపించింది. వేమాలశెట్టి బావి వద్ద ప్రముఖ దేవాలయం ఉంది. పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. వారికి అనుగుణంగా పూర్తిగా సదుపాయాలు లేవని చెబుతున్నారు.
కొండాయపాళెం వెళ్లే మార్గంలో దెబ్బతిన్న రహదారి
సరిగా లేని మురుగు కాలువలు
రామ్నగర్, క్రాంతినగర్ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లున్నా.. మురుగు కాలువలు సరిగాలేవు. కొన్ని వీధుల్లో 20 ఏళ్ల క్రితం నిర్మించిన చిన్నపాటి కాలువలు ఉండటం వల్ల మురుగుతో నిండిపోతున్నాయి. దీంతో దోమల బెడద ఎక్కువగా ఉంటోందని చెబుతున్నారు. సరస్వతీనగర్, ఎర్రగడ్డ దళితవాడ, టెక్కేమిట్ట ప్రాంతాల్లో విపరీతంగా దోమలు ఉండటం వల్ల ఇటీవల పలువురు విషజ్వరాలకు గురయ్యారని అక్కడి వారంతా వాపోతున్నారు. టెక్కేమిట్ట మెయిన్రోడ్డు వద్ద సాగునీటి కాలువకు రక్షణగోడ లేకపోవడంతో వాహనచోదకులు భయంభయంగా కాలం గడుపుతున్నారు. అపార్ట్మెంట్ల వద్ద సగభాగŸమే మెయిన్రోడ్డు వేసి మిగిలినది వదిలేశారు. ఇండియన్ గ్యాస్ రోడ్డు ప్రాంతంలో రాత్రి వేళల్లో చీకటిగా ఉంటోందని వీధి దీపాల సంఖ్య పెంచాలని అక్కడి వారు తెలిపారు. పలుచోట్ల రోడ్డు పక్కల మట్టిదిబ్బలు పోశారు.
దోమల బెడద: లక్ష్మి, టెక్కేమిట్ట
టెక్కేమిట్ట నుంచి పరిసర ప్రాంతాల్లో దోమలు తీవ్రంగా ఉన్నాయి. సాయంత్రం ఆరు గంటల నుంచి ఇంటి తలుపులు మూసుకోవాల్సి వస్తోంది. స్థానికంగా ఉన్న రైల్వేలైను పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటున్నాయి.
ప్రహరీలు నిర్మించండి: శోభన్బాబు
సాగునీటి కాలువల వద్ద ప్రహరీలు లేవు. వీటి వల్ల ప్రమాదం పొంచి ఉంది. విషయాన్ని అధికారులు గుర్తించలేదు. వాహనాలు అదుపు తప్పితే ప్ర£మాదం జరిగే అవకాశం ఉంది. కాలువల చుట్టూ ప్రహారీలు నిర్మించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముస్లిం మైనార్టీల అభ్యున్నతిని వైకాపా ప్రభుత్వం కాలరాస్తోంది!
[ 29-04-2024]
‘రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే కూటమిగా పోటీ చేస్తున్నాం. ముస్లిం మైనార్టీల అభ్యున్నతి, సంక్షేమానికి ఎన్డీయేతో కలిసిన తెదేపా ప్రభుత్వంలో విశేషంగా కృషి చేశాం. మళ్లీ కూటమికి ఓటేసి గెలిపిస్తే.. మరింతగా పాటుపడతాన’ని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. -
ఆత్మస్తుతి.. హామీల ఊసేది
[ 29-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కందుకూరు పట్టణానికి వస్తున్నారని తెలిసి.. ఆశతో వచ్చిన ప్రజలు అసంతృప్తితో వెనుదిరిగారు. -
గొప్పలు.. ప్రజారోగ్యానికి తిప్పలు
[ 29-04-2024]
ప్రతి గ్రామానికి వైద్య సేవలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. నాడు-నేడు కింద ఆసుపత్రుల రూపురేఖలు మార్చుతున్నాం. ఉప, పట్టణ ఆరోగ్య కేంద్రాలను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చెబుతున్నా.. -
చెంతనే నీరున్నా.. చింతే నాయకా
[ 29-04-2024]
వేసవి వచ్చింది... నగర, పట్టణ ప్రాంతాల్లో నీటి సమస్య పొంచిఉంది. నీటి వనరులున్నా.. నిర్వ హణ లోపంతో ప్రజలకు తాగునీరు అందడం లేదు. పథకాలున్నా.. -
జగనూ.. చెరువులను మింగేస్తున్నారు
[ 29-04-2024]
పూర్వీకులు ఎంతో ముందుచూపుతో చెరువులను ఏర్పాటుచేశారు. గొలుసుకట్టు విధానంలో ఉండడంతో వరద నివారణ సాధ్యమయ్యేది. భూగర్భ జలాలు పెరుగుతాయి. తాగునీటి అవసరాలు తీరడంతో పాటు సాగుకు ఆధారంగా ఉన్నాయి. -
సంగం హామీకి సున్నం
[ 29-04-2024]
దుష్ట సంహారం నిమిత్తం పరమేశ్వరుడు వినియోగించే ధనస్సుని ‘పినాక ’అంటారు. పినాక ధారుడైన పరమశివుడిని ‘పినాకపాణి’ అని భక్తులు పూజిస్తారు. కర్ణాటక రాష్ట్రం నంది పర్వత సానువుల్లో ఉద్భవించిన నది వంపులు తిరిగి శివుడి విల్లు పినాక ఆకారంలో ఉండటంతో పెన్నానది అని పిలుస్తున్నారు. -
అక్రమాలకు పాల్పడిన ఏపీజీబీ మేనేజర్ అరెస్టు
[ 29-04-2024]
అమడగూరు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో గతంలో మేనేజర్గా పని చేసిన కమతం పెంచల్రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి ఆదివారం కదిరి జ్యూడిషియల్ ఫస్ట్క్లాస్ మెసిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి మీనాక్షి సుందరి ఎదుట హాజరు పరిచినట్లు అమడగూరు ఎస్ఐ మగ్బూల్బాషా తెలిపారు. -
సమకూరని మౌలిక వసతులు
[ 29-04-2024]
మండలంలోనే పెద్ద పంచాయతీ బ్రాహ్మణక్రాక అరుంధతి వాడలోని అంతర్గత రోడ్డు ఇది. మురుగు నీటి కాలువలు పూడి పోయాయి. దిగువ ప్రాంతాలకు మురుగు పారక..రోడ్డుపై నిల్వ ఉంది. కాలనీ వాసులు ఈ రోడ్డుపై నిత్యం రాకపోకలు సాగించాల్సి వస్తోంది. -
పోలింగ్ కేంద్రాలకు అధికారుల కేటాయింపు
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం కలెక్టరేట్లో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్ను సాధారణ పరిశీలకులు నితిన్ సింగ్ బదారియ, -
వేడుకగా మహా పట్టాభిషేకం
[ 29-04-2024]
బాలాజీనగర్లోని సీతారామ మందిరంలో ఆదివారం స్వామివారికి మహా పట్టాభిషేక వేడుకలు చేపట్టారు. వేడుకల్లో భాగంగా ఉదయం స్వామి వారికి అభిషేకాలు, హోమాలు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్