logo

అమ్మ నడవలేక.. అవస్థ చూడలేక

అనారోగ్యం కారణంగా నడవలేని స్థితిలో ఉన్న తల్లిని కొడుకు నిజామాబాద్‌ జిల్లా ఆసుపత్రికి మోసుకొచ్చిన ఘటన బుధవారం చోటు చేసుకొంది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన విజయ(50)కు మధుమేహం ఉంది.

Published : 09 Dec 2021 03:43 IST

నారోగ్యం కారణంగా నడవలేని స్థితిలో ఉన్న తల్లిని కొడుకు నిజామాబాద్‌ జిల్లా ఆసుపత్రికి మోసుకొచ్చిన ఘటన బుధవారం చోటు చేసుకొంది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన విజయ(50)కు మధుమేహం ఉంది. కాలికి గాయం కావడంతో ఇన్ఫెక్షన్‌గా మారింది. చికిత్సలో భాగంగా నెల క్రితం దవాఖానాకు తీసుకొచ్చారు. వైద్యులు మరోసారి రావాలని చెప్పడంతో ఉదయం ఇందూరు బస్టాండుకు చేరుకున్నారు. ఆమె నడవలేక అవస్థలు పడటంతో అక్కడి నుంచి ఆసుపత్రి ఓపీ విభాగం వరకు కొడుకు అచ్యుత్‌ మోసుకొచ్చారు. తీరా ఓపీ సమయం అయిపోయిందని గురువారం రమ్మన్నారు. కనీసం ఆసుపత్రిలో ప్రధానగేటు వద్ద వీల్‌ఛైర్‌ ఉంచితే రోగులకు మేలు జరుగుతుందని ఆయన కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వైద్యవిభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని