logo

రూ.40 లక్షలు ఇవ్వాలని బెదిరింపులు

తన పేరుపై ఉన్న 3.28 ఎకరాల భూమిలో నుంచి 20 గుంటల కానీ, రూ.40 లక్షల నగదైనా ఇవ్వాలని ఓ ఛానెల్‌లో పని చేస్తున్న విలేకరి, తమ సమీప బంధువులు బెదిరింపులకు పాల్పడుతున్నారని జాన్కంపేట్‌కు

Published : 26 May 2022 04:19 IST

పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

ఎడపల్లి, న్యూస్‌టుడే: తన పేరుపై ఉన్న 3.28 ఎకరాల భూమిలో నుంచి 20 గుంటల కానీ, రూ.40 లక్షల నగదైనా ఇవ్వాలని ఓ ఛానెల్‌లో పని చేస్తున్న విలేకరి, తమ సమీప బంధువులు బెదిరింపులకు పాల్పడుతున్నారని జాన్కంపేట్‌కు చెందిన లింగం ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. తన తల్లి బాలమ్మకు పుట్టింటి నుంచి 3.28 ఎకరాల భూమి వచ్చింది. ఆ భూమిని తన పేరిట పట్టా మార్పిడి చేయించారన్నారు. అప్పుడు తక్కువ ధర ఉండటంతో భూమి ఇచ్చారని, ఇప్పుడు ధరలు పెరగడంతో భూమి, లేదంటే నగదు ఇవ్వాలని బెదిరిస్తున్నారన్నారు. బంధువులతో తనకు ప్రాణహాని ఉందని ఎడపల్లి ఠాణాతో పాటు నిజామాబాద్, హైదరాబాద్‌లో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని