ముందు పని.. తరువాత టెండర్
ఎక్కడైనా రహదారి నిర్మాణం జరగాలంటే మొదట అంచనాలు రూపొందించాలి.. ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.. ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలి. తరువాత టెండర్ వేసి గుత్తేదారును ఎంపిక చేసి పనులు అప్పగించాలి. తదనంతరం ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో నాణ్యతతో చేపట్టాలి
కామారెడ్డి పంచాయతీరాజ్ ఇంజినీరింగ్శాఖ అధికారుల నిర్వాకం
ఈనాడు డిజిటల్, కామారెడ్డి
కామారెడ్డి జిల్లాకేంద్రం శివారులో నిర్మించిన రోడ్డు
ఎక్కడైనా రహదారి నిర్మాణం జరగాలంటే మొదట అంచనాలు రూపొందించాలి.. ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.. ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలి. తరువాత టెండర్ వేసి గుత్తేదారును ఎంపిక చేసి పనులు అప్పగించాలి. తదనంతరం ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో నాణ్యతతో చేపట్టాలి. కామారెడ్డి జిల్లాలో మాత్రం ముందస్తు ఒప్పందాలతో రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తున్నారు. క్షేత్రస్థాయి ఇంజినీర్లు ఉన్నతాధికారుల కళ్లకు గంతలుకట్టి నిర్మాణం పూర్తి చేసిన రోడ్డుకు టెండర్ వేసి గుత్తేదారులను ఆహ్వానిస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కిన పీఆర్(ఇంజినీరింగ్)శాఖ అధికారుల నిర్వాకంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అసలేం జరిగిందంటే..
* సమీకృత అధికారుల భవనం(కలెక్టరేట్) ప్రారంభోత్సవానికి ఏడాది కిందట ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ పనులకు ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్డీఎఫ్) నుంచి రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ః పురపాలక సంఘం పరిధిలో ఆయా పనులకు సంబంధించిన అంచనాలు, ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు అవసరమైన ఇంజినీరింగ్ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఇక్కడి ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులకు నివేదించారు. ః దీంతో రూ.25 కోట్ల విలువైన పనుల పర్యవేక్షణ, అంచనాలు రూపొందించడం, టెండర్ పిలవడం వంటి వాటిని పీఆర్(ఇంజినీరింగ్) అధికారులకు అప్పగించారు. ః ఇదే అదనుగా గుత్తేదారులతో కుమ్మక్కయి టెండర్ లేకుండానే జిల్లాకేంద్రం శివారులో ముందస్తు ఒప్పందంలో భాగంగా ఇద్దరు గుత్తేదారులతో బీటీ రోడ్డు వేశారు. ప్రస్తుతం వంతెనల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ః పనులు తుది దశకు చేరుతున్న సమయంలో నిర్మాణం పూర్తయిన రోడ్డు పనులు చేపట్టేందుకు పీఆర్ అధికారులు టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయడం గమనార్హం.
అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే..
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు లేదా అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో మాత్రమే టెండర్కు ముందే రహదారుల నిర్మాణం చేపట్టవచ్చు. ముఖ్యమైన నాయకులు అంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి స్థాయి అధికారులు అత్యవసర పర్యటన సమయంలోనూ నిర్మించొచ్చు. ఇందులోనూ రూ.10 లక్షల- 20 లక్షల వ్యయంలోపు పనులు మాత్రమే చేపట్టాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను తుంగలో తొక్కిన ఇంజినీరింగ్ అధికారులు ఏకంగా రూ.2.48 కోట్ల రహదారి నిర్మాణాలు కానిచ్చేశారు. ఎందుకంత తొందరగా పూర్తి చేశారనే దానిపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్రైవేటు సంస్థల వారికి లాభం చేకూర్చేందుకేనని సమాచారం.
నిర్మాణం జరిగినట్లు తెలియదు
క్షేత్రస్థాయి పీఆర్(ఇంజినీరింగ్) అధికారుల ప్రతిపాదనలతోనే టెండర్ నోటిఫికేషన్ ఇచ్చాం. పురపాలకశాఖ నుంచి పర్యవేక్షణ బాధ్యతలను మా శాఖకు బదలాయించారు. ఏఈ, డీఈ, ఈఈ స్థాయి అధికారులు ఆయా పనులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఆ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం జరిగినట్లు నాకు తెలియదు. మా శాఖ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకే టెండర్ నోటిఫికేషన్ ఇచ్చాం.
- ప్రభాకర్, ఎస్ఈ, పీఆర్, కామారెడ్డి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బీబీ పాటిల్పై చేస్తున్న తప్పుడు ప్రచారాలు మానుకోవాలి
[ 26-04-2024]
జహీరాబాద్ ఎంపీగా భాజపా అభ్యర్థి బీబీ పాటిల్ లక్ష మెజారిటీతో గెలుస్తారని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. -
ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలి
[ 26-04-2024]
నరేంద్రమోదీ హయాంలో భాజపా ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుతున్నారని భాజపా జహీరాబాద్ పార్లమెంట్ ప్రభారీ పెద్దోళ్ల గంగారెడ్డి అన్నారు. -
భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 26-04-2024]
ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు నాగిరెడ్డిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు. -
అభివృద్ధికి పట్టం కట్టాలి
[ 26-04-2024]
నాగిరెడ్డిపేట మండలంలోని రాఘవపల్లి గ్రామంలో గురువారం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. -
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి
[ 26-04-2024]
కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు. -
మాధ్యమిక విద్య మిథ్య
[ 26-04-2024]
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. -
హామీలు నెరవేర్చాలి : పోచారం శ్రీనివాస్రెడ్డి
[ 26-04-2024]
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
పనులు జరగాలి.. వెతలు తీరాలి
[ 26-04-2024]
పలు పాఠశాలల్లోని తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాసిరకం మాంసం విక్రయాలు!
[ 26-04-2024]
బాన్సువాడ పట్టణంలోని మటన్ మార్కెట్కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. -
సొంత గూటికి వడ్డేపల్లి సుభాష్రెడ్డి
[ 26-04-2024]
లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. -
తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయండి
[ 26-04-2024]
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. -
గురుకులాలు ఉత్తమం.. ఎయిడెడ్లు అథమం
[ 26-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. -
పసుపు బోర్డు పేరుతో పరిహాసం : బాజిరెడ్డి
[ 26-04-2024]
గత లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమం : జీవన్రెడ్డి
[ 26-04-2024]
: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
ఓటు పోటెత్తేలా!
[ 26-04-2024]
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు. -
జేఈఈ మెయిన్స్లో ఇందూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జనవరిలో మొదటి దశ, ఏప్రిల్లో రెండోదశ ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!