అవినీతిపై పట్టింపేదీ?
పని పూర్తయిందనే ఆనందంతో కొందరు.. త్వరగా కావాలని మరికొందరు.. పక్కాగా కావాలనే ప్రణాళికతో ఇంకొందరు.. ఏదో రీతిలో ముడుపులు సమర్పించుకోవాల్సి వస్తోంది.
న్యూస్టుడే, భీమ్గల్
పని పూర్తయిందనే ఆనందంతో కొందరు.. త్వరగా కావాలని మరికొందరు.. పక్కాగా కావాలనే ప్రణాళికతో ఇంకొందరు.. ఏదో రీతిలో ముడుపులు సమర్పించుకోవాల్సి వస్తోంది. అన్ని శాఖల్లో ఇది వేళ్లూనుకుపోయింది. నిజాయతీగా విధులు నిర్వర్తించాల్సిన కొందరు నేతల అండదండలతో ప్రజలను జలగల్లా పీల్చుతున్నారు. కొన్నిశాఖల్లో లంచం అనేది సాధారణ అంశంగా మారిపోయింది. మరోవైపు అవినీతి నిరోధకశాఖ అధికారులు ఫిర్యాదులు వస్తేనే స్పందిస్తున్నారు. అవినితీ నిరోధక వారోత్సవాల నేపథ్యంలో ‘న్యూస్టుడే’ కథనం..
ఉమ్మడి జిల్లాలోని కొన్ని శాఖల్లో చేయి తడపనిదే పనులు కావడం లేదు. మరికొన్నింటిలో దళారుల అండతో అందినకాడికి దండుకుంటున్నారు. ఇలా కొందరు ఉద్యోగులు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అవినీతి తగ్గుతుందని అంతా భావించారు. కానీ, అక్రమార్కులు లంచం తీసుకోవడానికి కొత్త మార్గాలు వెతకడం, ప్రజలు అవినీతి అధికారులపై ఫిర్యాదు చేయడానికి వెనుకడుగు వేయడం, అవినీతి నిరోధక శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించకపోవడం ప్రధాన లోపంగా తెలుస్తోంది.
ఫిర్యాదులపై..
* క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవినీతి, పనుల్లో అవకతవకలపై ప్రజావేగులు ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. భూకబ్జాలు, సంక్షేమ పథకాల్లో జరుగుతున్న అక్రమాలను వారి దృష్టికి తీసుకెళ్తున్నా ఉన్నతాధికారులు ఫిర్యాదుల పెట్టె తెరవడం లేదు.
* బాల్కొండ మండలం వేంపల్లికి చెందిన చిన్నయ్య.. లక్ష్మి డి3 కాలువ భూములు ఆక్రమణకు గురయ్యాయని ఆధారాలతో ఏడాది నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. విలువైన సర్కారు భూమిని కాపాడాలనే ఉద్దేశంతో ఆయన తిరుగుతున్నారు.
* భూ సమస్యలు, పంట కల్లాలు, పల్లెల్లో విద్యుత్తు నియంత్రికల మంజూరులో అవకతవకలపై ఫిర్యాదులు అందుతున్నా అధికారుల్లో చలనం ఉండటం లేదు. ఇలా ప్రజావేగుల ఫిర్యాదులపై పట్టింపు లేకపోవడంతో అవినీతి తారాస్థాయికి చేరుతోంది.
కనిపించని పర్యవేక్షణ
ఉమ్మడి జిల్లాలో తొమ్మిదేళ్లలో 59 కేసులు నమోదవగా 63 మంది అధికారులు పట్టుబడ్డారు. అవినీతి కేసుల్లో రెవెన్యూ, విద్యుత్తు, పోలీసు శాఖలు ముందు వరుసలో ఉన్నాయి. ఈ ఏడాది రెవెన్యూ శాఖలో అధికారి, శిశు సంక్షేమశాఖలో ఓ ఉన్నతాధికారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తాను విధుల్లో చేరే ముందు అంకితభావం, జవాబుదారీతనంతో పని చేస్తానని, సర్వీస్ రూల్స్ ప్రకారం నడుచుకుంటానని ప్రమాణపత్రం ఇస్తారు. కొందరు సర్వీస్ నిబంధనలు పట్టించుకోకుండా అడ్డదారులు తొక్కుతున్నారు.
ప్రశ్నించేతత్వం అలవర్చుకోవాలి
- అంకం నరేశ్, యూఎఫ్ఆర్టీఐ రాష్ట్ర కోకన్వీనర్
ప్రభుత్వ కార్యాలయాల్లో సకాలంలో పనులు కావాలంటే లంచం ఇవ్వడం కాకుండా ప్రశ్నించే తత్వాన్ని ప్రజలు అలవర్చుకుంటే పనులు పారదర్శకంగా జరుగుతాయి. అధికారులతో పని చేయించుకోవడం ప్రజల హక్కు.. దాన్ని లంచంతో కాకుండా ప్రశ్నించి చేయించుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బీబీ పాటిల్పై చేస్తున్న తప్పుడు ప్రచారాలు మానుకోవాలి
[ 26-04-2024]
జహీరాబాద్ ఎంపీగా భాజపా అభ్యర్థి బీబీ పాటిల్ లక్ష మెజారిటీతో గెలుస్తారని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. -
ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలి
[ 26-04-2024]
నరేంద్రమోదీ హయాంలో భాజపా ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుతున్నారని భాజపా జహీరాబాద్ పార్లమెంట్ ప్రభారీ పెద్దోళ్ల గంగారెడ్డి అన్నారు. -
భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 26-04-2024]
ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు నాగిరెడ్డిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు. -
అభివృద్ధికి పట్టం కట్టాలి
[ 26-04-2024]
నాగిరెడ్డిపేట మండలంలోని రాఘవపల్లి గ్రామంలో గురువారం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. -
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి
[ 26-04-2024]
కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు. -
మాధ్యమిక విద్య మిథ్య
[ 26-04-2024]
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. -
హామీలు నెరవేర్చాలి : పోచారం శ్రీనివాస్రెడ్డి
[ 26-04-2024]
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
పనులు జరగాలి.. వెతలు తీరాలి
[ 26-04-2024]
పలు పాఠశాలల్లోని తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాసిరకం మాంసం విక్రయాలు!
[ 26-04-2024]
బాన్సువాడ పట్టణంలోని మటన్ మార్కెట్కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. -
సొంత గూటికి వడ్డేపల్లి సుభాష్రెడ్డి
[ 26-04-2024]
లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. -
తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయండి
[ 26-04-2024]
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. -
గురుకులాలు ఉత్తమం.. ఎయిడెడ్లు అథమం
[ 26-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. -
పసుపు బోర్డు పేరుతో పరిహాసం : బాజిరెడ్డి
[ 26-04-2024]
గత లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమం : జీవన్రెడ్డి
[ 26-04-2024]
: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
ఓటు పోటెత్తేలా!
[ 26-04-2024]
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు. -
జేఈఈ మెయిన్స్లో ఇందూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జనవరిలో మొదటి దశ, ఏప్రిల్లో రెండోదశ ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!