ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్ అలీ
మాజీ మంత్రి షబ్బీర్ అలీని కీలక పదవి వరించింది. ఆయనను రాష్ట్రప్రభుత్వ సలహాదారు(బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ)గా నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఎట్టకేలకు దక్కిన కేబినెట్ హోదా
కామారెడ్డి కాంగ్రెస్లో జోష్
కామారెడ్డి కలెక్టరేట్, న్యూస్టుడే: మాజీ మంత్రి షబ్బీర్ అలీని కీలక పదవి వరించింది. ఆయనను రాష్ట్రప్రభుత్వ సలహాదారు(బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ)గా నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కామారెడ్డి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని రెండేళ్ల నుంచి ఆయన తీవ్రంగా శ్రమించారు. రాజకీయ పరిణామాల కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. అక్కడ ఓడిపోవడంతో కొంత ఢీలా పడ్డారు. కామారెడ్డి నుంచి పోటీ చేసిన సీఎం రేవంత్రెడ్డి కూడా ఓడిపోవడంతో ఇక్కడి కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత నైరాశ్యం ఏర్పడింది. ఇలాంటి సమయంలో షబ్బీర్కు కెబినెట్ ర్యాంకు పదవి లభించింది. దీంతో ఉమ్మడి జిల్లాలో తొలి నియామక పదవిని భర్తీ చేసినట్లయింది.
35 ఏళ్ల నుంచి కీలక నేతగా..
కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్ అలీ 35 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థి దశలో ఎన్ఎస్యూఐ నేతగా పనిచేసిన ఆయన 1987లో మాచారెడ్డి ఎంపీపీగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత 1989లో కామారెడ్డి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1994, 1999 ఎన్నికల్లో ఓటమి చెందారు. 2004లో కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి వైఎస్ రాజశేఖర్రెడ్డి మంత్రి వర్గంలో విద్యుత్తుశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా శాసనమండలి ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. ఇప్పుడు కెబినెట్ ర్యాంకు పదవి వరించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన షబ్బీర్అలీకి ఒక దశలో మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని అందరు భావించారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మైనారిటీ కోటాలో మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం సాగింది. అయితే ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఆయనకు దక్కలేదు. దీంతో నియమిత పదవి కట్టబెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కదలాలి యువత
[ 30-04-2024]
ఓటు నమోదుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. స్వీప్ ఆధ్వర్యంలో ప్రైవేటు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో అవగాహన కల్పించి నమోదు చేయించారు. పోలింగ్ కేంద్రాల్లోనూ శిబిరాలు నిర్వహించారు. -
జహీరాబాద్ బరిలో 19 మంది
[ 30-04-2024]
నామినేషన్ల ఉప సంహరణ గడువు సోమవారం ముగియగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 19 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. -
ఉక్కపోత.. రోగులకు వెత
[ 30-04-2024]
వేసవి తీవ్రరూపం దాల్చింది. 43 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదవుతుతోంది. జిల్లా ఆసుపత్రిలో మధ్యాహ్నం 12 అయిందంటే చాలు తీవ్రమైన ఉక్కపోత రోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. -
‘కాళేశ్వరం పేరిట దోచుకున్నారు.. హామీలు మరిచారు’
[ 30-04-2024]
భారాస ప్రభుత్వ పెద్దలు కాళేశ్వరం పేరిట దోచుకున్నారు... కోట్లాది రూపాయలను వృథా చేశారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ అన్నారు. -
పల్లెల్లో వేసవి క్రీడా శిబిరాలు
[ 30-04-2024]
విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడానైపుణ్యాలకు పదునుపెట్టడానికి జిల్లాలో వేసవి క్రీడా శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ రూపొందించిన కార్యాచరణ ప్రకారం జిల్లాలో మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శిబిరాలను కొనసాగించనున్నారు. -
నిజామాబాద్ బరిలో 29 మంది
[ 30-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బరిలో 29 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 42 మంది నామినేషన్లు వేయగా పరిశీలనలో పది మందివి తిరస్కరణకు గురయ్యాయి. -
శుభముహూర్తాలకు సెలవు
[ 30-04-2024]
శుభాకార్యాలకు బ్రేక్ పడింది. మూడాలు, ఆషాఢంతో వచ్చే మూడు నెలల పాటు శుభముహూర్తాలు లేవని వేదపండితులు చెబుతున్నారు. గతంలో వేసవిలో అధిక సంఖ్యలో శుభకార్యాలు జరిగేవి. -
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
[ 30-04-2024]
అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు -
ఇంకుడు గుంతలపై మొక్కుబడి సర్వే
[ 30-04-2024]
ఎండల తీవ్రత నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం జల సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. -
ఒకే స్థానం..జిల్లాలు మూడు
[ 30-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానం మూడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ గ్రామీణం, బాల్కొండ నియోజకవర్గాలు ఉండగా.. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు జగిత్యాల జిల్లాలో ఉన్నాయి. -
పట్టణ ఓటర్లారా..బాధ్యత మరవొద్దు
[ 30-04-2024]
పట్టణాలు, నగరాలు అంటే ‘ఆధునికత’ అనే భావన ఉంటుంది. అలాంటి ప్రాంతాలే గ్రామీణ ఓటర్లకు మార్గదర్శకంగా ఉండాలి. కానీ అందుకు విరుద్ధంగా ప్రజాస్వామ్యంలో ఈ ప్రాంత ఓటర్లే ఓటింగ్కు దూరంగా ఉండటం సరికాదనే అభిప్రాయం పౌర సమాజం నుంచి వ్యక్తమవుతోంది. -
ఎవరి ప్రభావమెంత..?
[ 30-04-2024]
2024 నిజామాబాద్ లోక్సభ ఎన్నికల బరిలో ఎంత మంది ఉంటారనే లెక్క తేలింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 29 మంది బరిలో ఉన్నారు. -
ఓటరు చైతన్యం.. డిజిటల్ మార్గం
[ 30-04-2024]
ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం స్వీప్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు, కరపత్రాల ఆవిష్కరణ, మహిళలకు ముగ్గుల పోటీలు, పాఠశాలలు, కళాశాలల్లో నమూనా పోలింగ్ వంటి అనేక కార్యక్రమాలు చేపడుతోంది. -
ఓటు అవగాహన.. ఛాయాచిత్ర ప్రదర్శన
[ 30-04-2024]
ప్రతి వ్యక్తి నిజాయతీగా ఓటేయాలని పార్లమెంట్ సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ తెలిపారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ బస్టాండు ఆవరణలో ఓటరు అవగాహనపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను అదనపు కలెక్టర్ కిరణ్కుమార్తో కలిసి ప్రారంభించి మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్