ఆరు నెలల కిందట వివాహం.. గాలిపటం దారమే మృత్యుపాశం
కొత్త సంవత్సరానికి నాలుగు రోజులే ఉంది. ఆరు నెలల కిందటే పెళ్లయిన ఆ యువకుడు భార్యను తీసుకొని వివిధ రకాల కొనుగోళ్ల కోసం కటక్ బయలుదేరాడు. గాలిపటానికి కట్టిన దారం ఆయన పాలిట మృత్యుపాశమైంది. గొంతు తెగిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఎన్నో ఆశలతో
జయంత్ దంపతులు (పాతచిత్రం)
కటక్, న్యూస్టుడే: కొత్త సంవత్సరానికి నాలుగు రోజులే ఉంది. ఆరు నెలల కిందటే పెళ్లయిన ఆ యువకుడు భార్యను తీసుకొని వివిధ రకాల కొనుగోళ్ల కోసం కటక్ బయలుదేరగా గాలిపటానికి కట్టిన దారం ఆయన పాలిట మృత్యుపాశమైంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. బయర్పూర్ గ్రామానికి చెందిన జయంత్ సామల్ (24) తన భార్యను తీసుకొని ఆదివారం సాయంత్రం ద్విచక్రవాహనంపై కటక్ బయలుదేరాడు. వాహనంపై వెళుతుండగా జగత్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిరాబజార్ వద్ద ఆయన గొంతుకు గాలిపటానికి కట్టిన దారం తగిలింది. దీంతో గొంతు తెగిపోవడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన ఆయన జీవిత భాగస్వామి గుండెలవిసేలా రోదిస్తోంది. ఘటనపై ఆయన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గాలి పటాలు ఎగరేసేందుకు వినియోగించే కోల్కతా దారాల విక్రయాలపై నిషేధం ఉన్నప్పటికీ వ్యాపారులు వాటిని విక్రయించడంతో దానిని కట్టి గాలిపటం ఎగురేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని, వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ దారాలు తెగిపోకుండా ఉండడానికి వివిధ రకాల పూతలు వేస్తారు. దీంతో ఇవి గట్టిగా, వాడిగా ఉంటాయి.
పూరీలో మరో ఘటన
కటక్, న్యూస్టుడే: కటక్లో జరిగిన ఘటనే సోమవారం పూరీలో జరిగింది. బొడొదండోలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న భంజ్విహార్ పాత్ర అనే వ్యక్తి కంఠానికి గాలి పటం దారం తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆయనను సమీపంలోని ఆరోగ్యకేంద్రానికి తరలించారు. కటక్లో జరిగిన ఘటనపై డీసీపీ ప్రతీక్ సింగ్ మాట్లాడుతూ జగత్పూర్ ప్రాంతంలో గాలిపటం దారం ప్రమాదంపై దర్యాప్తు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుటుంబ కధా చిత్రం
[ 05-05-2024]
విశ్వసనీయత, విద్యార్హత, ఆదరణ ఉన్నవారికే ఈసారి ఎన్నికల బరిలో దించుతామన్న ప్రధాన పార్టీలు మాట నెలబెట్టుకోలేదు -
నేడు ప్రధాని మోదీ భువనేశ్వర్ రాక
[ 05-05-2024]
ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం రాత్రి 9.30 గంటలకు భువనేశ్వర్ చేరుకోనున్నారు. రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారు. -
శాలినీ పండిత్కు మిషన్శక్తి బాధ్యతలు
[ 05-05-2024]
రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శాలినీ పండిత్కు ప్రభుత్వం మిషన్శక్తి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. -
చెమటోడుస్తున్న అభ్యర్థులు
[ 05-05-2024]
ఒకవైపు తరుముకొస్తున్న పోలింగు తేదీ.. మరోవైపు సుర్రుమంటున్న సూరీడు.. అభ్యర్థులు మండుటెండల్ని లెక్కచేయకుండా విజయమే లక్ష్యంగా ప్రజలను ఆకట్టుకునేందుకు చెమటోడుస్తున్నారు -
అందరి కళ్లూ ‘హింజిలి’పైనే..
[ 05-05-2024]
రాష్ట్రంలోని అందరి దృష్టి గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ‘హింజిలి’పైనే ఉంది. -
ఏడుగురు అభ్యర్థులకు నేర చరిత్ర
[ 05-05-2024]
ఈ నెల 13న రాష్ట్రంలోని బ్రహ్మపుర, నవరంగపూర్, కలహండి, కొరాపుట్ లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. -
రాయగడ జిల్లా కాంగ్రెస్లో అయోమయం
[ 05-05-2024]
ప్రస్తుతం ఎన్నికల సందడిలో నాయకులంతా నిమగ్నమై ఉన్నారు. తమ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. -
అభివృద్ధికి ఓటేసి మద్దతివ్వండి
[ 05-05-2024]
కొరాపుట్ జిల్లాలో అభివృద్ధికి ఓటేసి బిజదకు మద్దతివ్వాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. -
విద్యుదాఘాతంతో కార్మికుడికి అస్వస్థత
[ 05-05-2024]
గజపతి జిల్లా మోహన ఠాణా పరిధిలోని పుతిలిపోంకలో విద్యుదాఘాతంతో కార్మికుడు అస్వస్థకు గురయ్యాడు