బంగారం ఆభరణాలు స్వాధీనం: ఉద్యోగి అరెస్టు
స్థానిక పెద్దబజారు ఠాణా పరిధిలోని ఓ బంగారం దుకాణంలో సహాయ మేనేజరుగా పనిచేస్తున్న సిమాంచల పాత్ర్ అలియాస్ లిపు (30) అనే ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేసి సోమవారం న్యాయస్థానానికి తరలించారు.
స్వాధీనం చేసుకున్నఆభరణాలు
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: స్థానిక పెద్దబజారు ఠాణా పరిధిలోని ఓ బంగారం దుకాణంలో సహాయ మేనేజరుగా పనిచేస్తున్న సిమాంచల పాత్ర్ అలియాస్ లిపు (30) అనే ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేసి సోమవారం న్యాయస్థానానికి తరలించారు. ఆయన నుంచి రూ.33.38 లక్షల విలువ గల 523.23 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు బ్రహ్మపుర ఎస్పీ శరవణ వివేక్ ఎం. సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. నిందితుడు పాత్ర్ వినియోగదారుల ఇళ్లకు వెళ్లి బంగారు ఆభరణాలు చూపిస్తానని నమ్మించి దుకాణం నుంచి ఆభరణాలు తీసుకెళ్లాడు. వారం రోజులైనా వాటిని తిరిగి దుకాణానికి ఇవ్వకపోవడంతో సంస్థ మేనేజరు పెద్దబజారు ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా నిందితుడు ఆభరణాలను రెండు ప్రైవేటు సంస్థల్లో తనఖా పెట్టి రూ.19.70 లక్షలు రుణం తీసుకున్నట్లు తెలిసింది. ఆ సొమ్ముతో నిందితుడు ఆన్లైన్ గేమ్లు ఆడినట్లు వెల్లడైంది. తనఖా పెట్టిన ఆభరణాలను ఆయన విడిపించిన అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఆ ప్రకటనలో వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా అమ్మాయికే మీ ఓటు..!
[ 08-05-2024]
ఈసారి ఎన్నికల్లో పలువురు నేతలు తమ కుమార్తెలను పోటీలో నిలిపారు. అసెంబ్లీ స్థానాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు వీరికి 33 శాతం సీట్లు కేటాయించలేకపోయాయి. బిజద 35 మందికి అవకాశమిచ్చి ఇతర పార్టీల కంటే ముందంజలో ఉంది. -
సంక్షేమ కార్యక్రమాలు ఆగవు
[ 08-05-2024]
భాజపా అధికారానికొస్తే రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయని బిజద నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, దీన్ని నమ్మొద్దని భాజపా కేంద్రశాఖ ఉపాధ్యక్షుడు, కేంద్రపడ లోక్సభ అభ్యర్థి బైజయంత్ పండా చెప్పారు. -
65 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు పెండింగ్
[ 08-05-2024]
రాష్ట్రంలో తొలిదశలో మే 13న నిర్వహించనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం అభ్యర్థుల్లో 65 మందిపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీరిలో 48 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉండడం గమనార్హం. -
భాజపా తరఫున ప్రచారానికి ‘హేమ’హేమీలు
[ 08-05-2024]
బాలీవుడ్ స్టార్ హేమమాలిని భాజపా తరఫున రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. -
నువ్వా... నేనా
[ 08-05-2024]
ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కొరాపుట్ నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంటోంది. బిజద, కాంగ్రెస్, భాజపాలు విజయం సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. -
గోపాల్పూర్లో బిజద బల ప్రదర్శన
[ 08-05-2024]
గాలివానలో అమ్మోరు జాతరను తలపించిన వి.కార్తికేయ పాండ్యన్ రోడ్షో దీనికి వేదికైంది గోపాల్పూర్ సెల్ఫీ పాయింట్ కూడలిలో సోమవారం రాత్రి బిజద నాయకత్వం బల ప్రదర్శన చేపట్టారు. -
బిజద ఆరిపోతున్న దీపం: ధర్మేంద్ర
[ 08-05-2024]
రాష్ట్రాన్ని రెండు పుష్కరాలుగా పాలిస్తున్న సీఎం నవీన్ రిమోట్ చెప్పిందే చేస్తారని, అండలేనిదే ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. -
అనుకూలించిన వాతావరణం.. అభ్యర్థుల్లో ఉత్సాహం
[ 08-05-2024]
పోలింగు తేదీ దగ్గరపడింది. ప్రచారానికి మరో నాలుగు రోజులే మిగిలి ఉంది. ఇటీవల తీవ్ర ఎండల కారణంగా ఉదయం, సాయంత్రం, రాత్రివేళల్లో అభ్యర్థులు ప్రచారం చేశారు.