logo

శ్రీక్షేత్రంలో మీనాక్షి శేషాద్రి

ప్రముఖ బాలీవుడ్‌ (ముంబయి) నటి, నర్తకి మీనాక్షి శేషాద్రి గురువారం పూరీ వచ్చారు. శ్రీక్షేత్రంలో జగన్నాథుడి సన్నిధిలో పూజలు చేశారు.

Published : 29 Mar 2024 07:16 IST

జగన్నాథ సన్నిధిలో ప్రముఖ తార మీనాక్షి

గోపాల్‌పూర్‌, న్యూస్‌టుడే: ప్రముఖ బాలీవుడ్‌ (ముంబయి) నటి, నర్తకి మీనాక్షి శేషాద్రి గురువారం పూరీ వచ్చారు. శ్రీక్షేత్రంలో జగన్నాథుడి సన్నిధిలో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ... మూడు దశాబ్దాల క్రితం పూరీ వచ్చానని, అప్పట్లో శ్రీక్షేత్ర ఆవరణ ఇరుకుగా ఉండేదని, ఇప్పుడు విశాలంగా మారిందని, సౌకర్యాలు బాగున్నాయని వివరించారు.

గోపాల్‌పూర్‌లో దొండొనాచొ యాత్ర

 గోపాల్‌పూర్‌, న్యూస్‌టుడే: గోపాల్‌పూర్‌ యూనియన్‌ బ్యాంకు కూడలి వద్ద గురువారం దొండొనాచొ యాత్ర ఏర్పాటైంది. మండుటెండలో దీక్షాధారులు శైవ, శాక్తేయ పూజలు చేసి విన్యాసాలు ప్రదర్శించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని