logo

డబుల్‌ ఇంజిన్‌ పాలన తథ్యం: అపరాజిత

రాష్ట్రంలో భాజపా డబుల్‌ ఇంజిన్‌ పాలన తథ్యమని, ప్రజల్లో మార్పు కనిపిస్తోందని భువనేశ్వర్‌ సిటింగ్‌ ఎంపీ అపరాజిత షడంగి చెప్పారు.

Published : 29 Mar 2024 07:28 IST

జగన్నాథ సన్నిధిలో అపరాజిత ప్రార్థన
గోపాల్‌పూర్‌, న్యూస్‌టుడే: కేంద్రం, రాష్ట్రంలో భాజపా డబుల్‌ ఇంజిన్‌ పాలన తథ్యమని, ప్రజల్లో మార్పు కనిపిస్తోందని భువనేశ్వర్‌ సిటింగ్‌ ఎంపీ అపరాజిత షడంగి చెప్పారు. పార్టీ భువనేశ్వర్‌ టికెట్‌ ఖరారైన తర్వాత ఆమె గురువారం సాయంత్రం పూరీ వెళ్లారు. శ్రీక్షేత్రంలో జగన్నాథుడి సన్నిధిలో పూజలు చేసి సాష్టాంగ ప్రణామం ఆచరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... ఈసారి 15కుపైగా లోక్‌సభ సీట్లు, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన అసెంబ్లీ స్థానాలు భాజపా ఖాతాలోకి వస్తాయన్న పూర్తి నమ్మకం ఉందన్నారు. జనం కోసం, దేశ హితం కోసం భాజపా పనిచేస్తోందన్న నమ్మకం ఓటర్లలో నాటుకుందని, ఇది శుభ సంకేతమని చెప్పారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని