తోడేలు దాడిలో ఇద్దరికి గాయాలు
మల్కాన్గిరి సమితి ఎమ్.వి.93 గ్రామంలో ఇద్దరిపై తోడేలు దాడి చేయడంతో, పోరాడి హతమార్చారు. ఈ క్రమంలో వీరికి తీవ్ర గాయాలయ్యాయి
చికిత్స పొందుతున్న సుకాంత్
మల్కాన్గిరి, న్యూస్టుడే: మల్కాన్గిరి సమితి ఎమ్.వి.93 గ్రామంలో ఇద్దరిపై తోడేలు దాడి చేయడంతో, పోరాడి హతమార్చారు. ఈ క్రమంలో వీరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. సదర్ గ్రామానికి చెందిన సుకాంత్ మండల్ బుధవారం ఇంటి ఎదుట నిలబడి ఉన్న సమయంలో తోడేలు వచ్చి అతనిపై దాడి చేసింది. అతని కేకలు విని భార్య స్థానికులను పిలవగా వారు వచ్చి తోడేలును హతమార్చారు. ఈ క్రమంలో గ్రామస్థుడు ఉత్పల్ సర్కార్, సుకాంత్కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను పండ్రిపణి ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అనంతరం మల్కాన్గిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అటవీ విభాగం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
భర్త చేతిలో భార్య హతం
నవరంగపూర్, న్యూస్టుడే: ఓ వివాహితుడు భార్యకు ఉరేసి హత్య చేసిన ఘటన నవరంగపూర్ జిల్లాలో చర్చనీయాంశమైంది. జొరిగావ్ ఠాణాధికారి తపన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏడేళ్ల క్రితం సదరు సమితి గురుసింగ్ పంచాయతీ కుసుమి గ్రామానికి చెందిన దశము హరిజన్తో మహండి గ్రామానికి చెందిన రాద్మకు వివాహం జరిగింది. ఈ నెల 9వ తేదీన ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కోపోద్రిక్తుడైన దశము భార్యను కొట్టాడు. విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు ధన్సింగ్ సోదరిని చికిత్స అనంతరం తన ఇంటికి తీసుకెళ్లాడు. బుధవారం దశమ అత్తవారింటికి వచ్చి మళ్లీ గొడవ చేయనని, భార్యను బాగా చూసుకుంటానని చెప్పడంతో రాద్మను పంపేందుకు అంగీకరించారు. రెండు రోజలు ఇక్కడే ఉండాలని ధన్సింగ్ చెప్పాడు. అక్కడే ఉన్న దశము గురువారం తెల్లవారు జామున రాద్మ మెడలో తాడు బిగించి ఆమెను చంపేందుకు ప్రయత్నించాడు. రాద్మ తల్లి బుదంతి చూసి అడ్డుకోగా, ఆమెను పక్కకు నెట్టి నిందితుడు పరారయ్యాడు. రాద్మను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శవపరీక్ష అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
జయపురం, న్యూస్టుడే: కొరాపుట్ జిల్లా జయపురం సమితి జయనగర్- బొయిపరిగూడ జాతీయ రహదారి-26, బాలియా ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఐఐసీ ఈశ్వర్ తాండి తెలిపిన వివరాల ప్రకారం.. బొరిపరిగూడ సమితి అంబాభట్టా గ్రామానికి చెందిన అనంత్ కుర్లియా (28), అతని భార్య తులసి, సోదరుడు ఉద్ధవ్ గురువారం ఉదయం జయపురం సమితి గొడపొదరలో జరుగుతున్న ఒక వివాహ వేడుకకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, కుంద్ర సమితి పండకిమారికి చెందిన ప్రశాంత్నాగ్ జయపురం నుంచి బొయిపరిగూడకు ద్విచక్ర వాహనంపై వెళ్తు బాలియా ప్రాంతంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. స్థానికులు క్షతగాత్రులను జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అనుత్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. శవపరీక్ష అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రశాంత్ పరిస్థితి విషమంగా ఉండడంతో కొరాపుట్ ఆసుపత్రికి తరలించారు.
దాడి కేసులో ఇద్దరి అరెస్టు
జయపురం, న్యూస్టుడే: డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసి ఓ వ్యక్తిపై దాడిచేసిన కేసులో జయపురం టౌన్ పోలీసులు గురువారం ఇద్దరిని అరెస్టు చేశారు. ఐఐసీ ఈశ్వర్ తాండి తెలిపిన వివరాల ప్రకారం.. జయనగర్ ప్రాంతంలో జరుగుతున్న నీలకంఠ సాగరం పునరుద్ధరణ పనుల వద్దకు ఒడియా మేద్రిసాహి ప్రాంతానికి చెందిన హరినాగ్(27), గోపబంధునగర్కు చెందిన స్వాధీన్ పాణిగ్రహి(25) ఈ నెల 26వ తేదీన వచ్చారు. గుత్తేదారు సలహాదారుడు అయిన గుప్తేష్రథ్తో మాట్లాడుతూ పనులు జరిగేంతవరకు తమకు ప్రతి నెల రూ. 8 వేలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు అంగీకరించని గుప్తేష్పై నిందితులతోపాటు వారి స్నేహితులు దాడి చేశారు. గుప్తేష్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గురువారం నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. బెయిల్ మంజూరు కాకపోవడంతో జైలుకు తరలించారు. వారి నుంచి రెండు చరవాణులు, సుత్తి, కత్తి స్వాధీనం చేసుకున్నారు.
ద్విచక్ర వాహనానికి నిప్పు
పర్లాఖెముండి, న్యూస్టుడే: పట్టణంలోని మూడో వార్డు నోడియాతుట్ట సాహిలో బుధవారం అర్ధరాత్రి దుండగులు ఓ ద్విచక్ర వాహనానికి నిప్పుపెట్టిన ఘటన చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే రాజేంద్ర పొడిహరి ద్విచక్ర వాహనానికి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. రాజేంద్ర ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఐఐసీ ప్రశాంత్ భూపతి తెలిపారు.
జంతికల తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం
భువనేశ్వర్, న్యూస్టుడే: భువనేశ్వర్ నవీన్ నివాస్ చేరువలోని పలాసపల్లి వద్ద గురువారం సాయంత్రం 5.30 గంటలకు ఒక జంతికల తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలు నియంత్రణలోకి తెచ్చారు. ప్రాణనష్టం లేకపోయినా రూ.లక్షల విలువైన ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా తెలిసింది. మరుగుతున్న నూనె కడాయి పేలిపోవడంతో మంటలు చెలరేగాయని అగ్నిమాపక అధికారి ఎస్.కె.దాస్ విలేకరులకు చెప్పారు.
గర్భం తొలగించే యత్నంలో బాలిక మృతి
మల్కాన్గిరి, న్యూస్టుడే: మల్కాన్గిరి జిల్లాలో ఓ బాలిక గర్భాన్ని తొలగించే సమయంలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. మల్కాన్గిరి జిల్లాలోని ఓ బాలిక పెళ్లి కాకుండానే గర్భవతి కావడంతో ఆమె తల్లి గర్భాన్ని తొలగించేందుకు ఆశా కార్మికురాలిని ఆశ్రయించింది. ఆమె అందుకు రూ.5వేలు నగదు తీసుకుని ఔషధం ఇచ్చింది. అనంతరం బాలిక అనారోగ్యానికి గురై, కొద్ది సేపటికే మృతిచెందింది. ఆశా కార్మికురాలు ఇచ్చిన ఔషధం వల్లే బాలిక మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మగువ.. ప్రచారంలో తెగువ
[ 29-04-2024]
ఎన్నికల ప్రచారం ఊపందుకున్న తరుణంలో మహిళలు ముందంజలో ఉన్నారు. మగవారికి ఏమాత్రం తీసిపోకుండా పాదయాత్రలు, రోడ్షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. -
పొట్టంగిలో అన్నతో చెల్లి పోటీ
[ 29-04-2024]
పొట్టంగి నియోజకవర్గంలో ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో ఎన్నికల బరిలో ఉన్న అధికార బిజద పార్టీ అభ్యర్థి ప్రఫుల్ల కుమార్ పంగితో ఆయన చెల్లి అంబికా పంగి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ పడుతుండడం చర్చనీయాంశమైంది. -
మధుబాబు సేవలు చిరస్మరణీయం: గవర్నర్
[ 29-04-2024]
స్వతంత్ర ఒడిశా ఏర్పాటు ఉద్యమానికి ఊపిరిలూదిన ఉత్కళగౌరవ్ మధుసూదన్ దాస్ రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఉత్కళీయులకు మార్గదర్శిగా నిలిచారని గవర్నరు రఘుబర్దాస్ అభివర్ణించారు. -
మండుటెండల్లో.. చల్లచల్లగా!
[ 29-04-2024]
ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్న నేపథ్యంలో బీరు విక్రయాలు జోరందుకున్నాయి. ఎండల నుంచి ఉపశమనం కోసం మందు బాబులు బీరు వైపు మొగ్గు చూపుతుండడంతో వీటి అమ్మకాలు అమాంతంగా పెరిగాయి. -
మౌనమేలనోయి!
[ 29-04-2024]
రాయగడ జిల్లా గుణుపురం నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నెల 29న నామినేషన్ల ఉపసంహరణ జరగనుంది. మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
‘జగన్నాథ్’లకు అగ్ని పరీక్ష
[ 29-04-2024]
రాయగడ జిల్లాలో బిసంకటక్ విధానసభ నియోజకవర్గం ప్రతిష్ఠాత్మకం కానుంది. ఇక్కడ అభ్యర్థులకు గెలుపు నల్లేరు మీద నడక మాత్రం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గెలుపోటములు చవిచూసిన రాష్ట్ర మంత్రి, బిజద అభ్యర్థి జగన్నాథ సరక, భాజపా నుంచి జగన్నాథ నుండ్రుక రంగంలోకి దిగారు. -
డబుల్ ఇంజిన్ నినాదం ఇక్కడ ఫలితమివ్వదు
[ 29-04-2024]
రాష్ట్రంలో భాజపా డబుల్ ఇంజిన్ పాలన నినాదం పనిచేయదని, నవీన్ ఇంజిన్ మాత్రమే పరుగులు తీస్తుందని బిజద నేత వి.కార్తికేయ పాండ్యన్ అన్నారు. -
పొట్టంగిలో భారీ వర్షం
[ 29-04-2024]
కొరాపుట్ జిల్లాలో ఎండల తీవ్రతతో ప్రజల ఇబ్బంది పడుతుండగా, ఆదివారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో భారీ వాన కురిసింది. పొట్టంగి ప్రాంతంలో పెను గాలులతో కూడిన వర్షం కురిసింది. -
ప్రసార సాధనాలు మోదీ, నవీన్ గుప్పెట్లో: రాహుల్
[ 29-04-2024]
ప్రసార సాధనాలు మోదీ, నవీన్ గుప్పెట్లో ఉన్నాయని, విశ్వసనీయత కోల్పోయాయని రాహుల్ గాంధీ సాలెపూర్ సమావేశంలో ఆదివారం అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హాసన సెక్స్ కుంభకోణం.. ఆ బాధితురాలు భవానీ బంధువే
-
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
-
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
-
కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
-
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
-
ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రార్థించా: సినీనటి జయప్రద