నవీన్ మోదీ నామం జపిస్తున్నారు: జుదిష్టర్
రాష్ట్రంలో అయిదు విధానసభ స్థానాల్లో సీపీఐఎంఎల్ లిబరేషన్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జుదిష్టర్ మహాపాత్ర్ అన్నారు.
అయిదు చోట్ల సీపీఐఎంఎల్ అభ్యర్థుల పోటీ
మాట్లాడుతున్న జుదిష్టర్ మహాపాత్ర్, తిరుపతి తదితరులు
గుణుపురం, న్యూస్టుడే: రాష్ట్రంలో అయిదు విధానసభ స్థానాల్లో సీపీఐఎంఎల్ లిబరేషన్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జుదిష్టర్ మహాపాత్ర్ అన్నారు. మంగళవారం భువనేశ్వర్ నాగభూషన్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. గుణుపురం స్థానం నుంచి అనాసిమి సబర, ప్రకాశ్ హికాక(కొరాపుట్), రామచంద్ర ప్రస్క(బిసంకటక్), జయంత్ జాని(రాయగడ), రాజేశ్ మండంగి(లక్ష్మిపురం) పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పూరీ జిల్లా సత్యవాది నుంచి అశోక్ ప్రధాన్ బరిలో ఉన్నట్లు చెప్పారు. తమ పార్టీ ప్రజల కోసం పని చేస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి తాము ముందుంటామని మహాపాత్ర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి దారులకు కొమ్ము కాస్తుందని, పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులపై కేసులు నమోదు చేస్తున్నారన్నారు. నవీన్ పట్నాయక్ మోదీ నామం జపం చేస్తూ ఆయనకు సహకరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. ప్రజలు సరైన నిర్ణయం తీసుకుని ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తిరుపతి గమాంగ్, రాధాకాంత శెఠి, అశోక్ ప్రధాన్, మహేంద్ర కొరడా పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు నవీన్ నామినేషన్
[ 30-04-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంగళవారం గంజాం జిల్లాలోని హింజిలి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
సంబల్పూర్ నుంచి నాగేంద్ర... కటక్కు సురేష్
[ 30-04-2024]
సంబల్పూర్ మాజీ ఎంపీ నాగేంద్ర ప్రధాన్ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్నారు. కటక్ నుంచి సురేష్ మహాపాత్ర్ బరిలో దిగారు. -
పోటీకి నిలిచిన రోజు కూలీ, రాజ మేస్త్రీ
[ 30-04-2024]
గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని భంజనగర్, అస్కా అసెంబ్లీ స్థానాలకు సీపీఐ (ఎంఎల్) రెడ్స్టార్ తరపున రోజు కూలీ, మరో రాజ మేస్త్రీ సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
వర్ష బీభత్సం
[ 30-04-2024]
కొరాపుట్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం పెనుగాలులతో కూడిన భారీ వర్షం తీవ్ర నష్టాల్ని మిగిల్చింది. -
కలహండి... ఎవరిదో విజయమండీ ?
[ 30-04-2024]
పశ్చిమ ఒడిశాలోని కలహండి లోక్సభ స్థానంలో విజేత ఎవరు? ఓటర్లు ఈసారి ఎవరికి పట్టం కడతారు? అన్నదిప్పుడు చర్చనీయాంశంగా మారింది. బిజద, భాజపా, కాంగ్రెస్ నాయకత్వాలు ఈసారి కొత్త అభ్యర్థులకు అవకాశమిచ్చాయి. విజయానికి ఇక్కడ కొన్ని కులాలు నిర్ణయాత్మకమవుతున్నాయి. -
దక్షిణంలోనూ కమల వికాసం
[ 30-04-2024]
రాష్ట్రంలో రెండున్నర దశాబ్దాల బిజద పాలన చూసిన ప్రజలకు ఆ పార్టీపై వ్యతిరేకత ఉందని, భాజపాకు ఈసారి అవకాశం ఇవ్వాలన్న ధ్యేయంతో ఉన్నారని భాజపా కేంద్రశాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా పేర్కొన్నారు. -
నిన్న నువ్వా, నేనా... నేడు నువ్వే నేను
[ 30-04-2024]
‘మేమిద్దరం ఈసారి సహోదరులం’ చేతులు కలిపిన ఇద్దరం బిజద లెక్క తేలుస్తాం, ప్రజలకు అండగా ఉంటాం. ఈ ప్రాంతాభివృద్ధికి కలసిమెలసి పని చేస్తాం’ అంటూ బ్రహ్మపుర భాజపా లోక్సభ అభ్యర్థి ప్రదీప్కుమార్ పాణిగ్రహి, గోపాల్పూర్ అసెంబ్లీ బరిలో ఉన్న బిభూతి భూషణ్ జెనా ప్రచారం చేస్తున్నారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం
[ 30-04-2024]
బ్రహ్మపురలోని పురాతన సిటీ హైస్కూల్లో 1971 సంవత్సరం మెట్రిక్యులేషన్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సంఘం ఆత్మీయ సమావేశం ఆదివారం రాత్రి ఉత్సాహంగా జరిగింది. -
ఎన్నికల నిబంధన ఉల్లంఘన..
[ 30-04-2024]
గజపతి జిల్లాలో ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణలు ప్రక్రియ ముగియకముందే ముఖ్యమంత్రి చిత్రాలతో పాటు రాష్ట్ర పథకాల ప్రచార హోర్డింగులు దర్శనమిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
-
65 ఏళ్లు నిండిన అంగన్వాడీ సిబ్బందికి విశ్రాంతి
-
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
-
మార్కుల విషయమై తల్లీ కుమార్తెల ఘర్షణ.. పరస్పరం కత్తిపోట్లు
-
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
-
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం