logo

నవీన్‌ మోదీ నామం జపిస్తున్నారు: జుదిష్టర్‌

రాష్ట్రంలో అయిదు విధానసభ స్థానాల్లో సీపీఐఎంఎల్‌ లిబరేషన్‌ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జుదిష్టర్‌ మహాపాత్ర్‌ అన్నారు.

Published : 17 Apr 2024 05:37 IST

అయిదు చోట్ల సీపీఐఎంఎల్‌ అభ్యర్థుల పోటీ 

మాట్లాడుతున్న జుదిష్టర్‌ మహాపాత్ర్‌, తిరుపతి తదితరులు

గుణుపురం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అయిదు విధానసభ స్థానాల్లో సీపీఐఎంఎల్‌ లిబరేషన్‌ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జుదిష్టర్‌ మహాపాత్ర్‌ అన్నారు. మంగళవారం భువనేశ్వర్‌ నాగభూషన్‌ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. గుణుపురం స్థానం నుంచి అనాసిమి సబర, ప్రకాశ్‌ హికాక(కొరాపుట్), రామచంద్ర ప్రస్క(బిసంకటక్‌), జయంత్‌ జాని(రాయగడ), రాజేశ్‌ మండంగి(లక్ష్మిపురం) పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పూరీ జిల్లా సత్యవాది నుంచి అశోక్‌ ప్రధాన్‌ బరిలో ఉన్నట్లు చెప్పారు. తమ పార్టీ ప్రజల కోసం పని చేస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి తాము ముందుంటామని మహాపాత్ర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి దారులకు కొమ్ము కాస్తుందని, పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులపై కేసులు నమోదు చేస్తున్నారన్నారు. నవీన్‌ పట్నాయక్‌ మోదీ నామం జపం చేస్తూ ఆయనకు సహకరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. ప్రజలు సరైన నిర్ణయం తీసుకుని ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తిరుపతి గమాంగ్‌, రాధాకాంత శెఠి, అశోక్‌ ప్రధాన్‌, మహేంద్ర కొరడా పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని