Vizianagaram: విధులకు సెలవు పెట్టి.. ఇళ్లపై కన్నేసి.. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దొంగతనాలు
అతడో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్.. విధులు సక్రమంగా నిర్వర్తించి.. దేశానికి సేవ చేయాల్సిన వ్యక్తి.. కానీ అడ్డదారులు తొక్కాడు.. అక్రమంగా డబ్బులు సంపాదించాలని కొలువునొదిలి ఇళ్లకు కన్నాలేయడం మొదలు పెట్టాడు.
ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన వైనం
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ ఆర్.గోవిందరావు
విజయనగరం నేరవార్తా విభాగం, న్యూస్టుడే: అతడో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్.. విధులు సక్రమంగా నిర్వర్తించి.. దేశానికి సేవ చేయాల్సిన వ్యక్తి.. కానీ అడ్డదారులు తొక్కాడు.. అక్రమంగా డబ్బులు సంపాదించాలని కొలువునొదిలి ఇళ్లకు కన్నాలేయడం మొదలు పెట్టాడు. ఏకంగా 12 చోట్ల చోరీలకు పాల్పడ్డాడు. పెద్దఎత్తున బంగారం, వెండి ఆభరణాలు కొట్టేశాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఈ కేసు వివరాలను డీఎస్పీ గోవిందరావు సోమవారం విలేకరులకు వెళ్లడించారు.
నగరానికి చెందిన కె.శ్రీనివాసరావు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా పనిచేసేవాడు. సెలవుపై గతేడాది ఆగస్టులో వచ్చేశాడు. ఉడాకాలనీ సమీపంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఈక్రమంలో ఆన్లైన్లో బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. రూ.లక్షల్లో అప్పులపాలయ్యాడు. దీంతో ఉద్యోగానికి వెళ్లలేదు. అప్పులు తీర్చేందుకు దొంగగా మారాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గ సామగ్రి కొన్నాడు. తాళాలు వేసి ఉన్న గృహాలే లక్ష్యంగా.. పగటి వేళ రెక్కీ నిర్వహించేవాడు. రాత్రి 9 గంటల సమయంలో బయలుదేరి.. 12 గంటలయ్యే సరికి దోచేసేవాడు. ఇప్పటి వరకు 12 చోట్ల నేరాలకు పాల్పడ్డాడు. ఉడాకాలనీ ఫేజ్-1, ఫేజ్-2, ఫేజ్-3, అలకానంద కాలనీ, రింగురోడ్డు, బాబామెట్ట తదితర ప్రాంతాల్లో బంగారం, వెండి అపహరించాడు.
ఇలా దొరికేశాడు..: వరుస దొంగతనాలు జరుగుతుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈనెల 14న ఉడాకాలనీ సమీపంలోని ఆర్టీసీ కాలనీలో బి.శ్యామ్కుమార్ అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా ఆదివారం శాలిపేట వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా, శ్రీనివాసరావు ఓ బ్యాగ్తో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. పట్టుకుని తనిఖీ చేయగా.. అందులో కొన్ని తాళాలు, స్క్రూడ్రైవర్ తదితర పరికరాలున్నాయి. వాటిపై ఆరా తీయగా.. నేరాన్ని అంగీకరించాడు. ఈ మేరకు కేసు నమోదు చేశామని డీఎస్పీ చెప్పారు. నిందితుడి నుంచి 27 తులాల బంగారం, ఆరు కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును ఛేదించిన ఒకటో పట్టణ సీఐ బి.వెంకటరావు, ఎస్సై వి.అశోక్కుమార్, హెడ్ కానిస్టేబుల్ ఎం.అచ్చిరాజు, కానిస్టేబుళ్లు టి.శ్రీనివాస్, బి.శివ, బి.శంకరరావు, ఎన్.గౌరీశంకర్ను ఆయన అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమితోనే రాష్ట్రాభివృద్ధి
[ 10-05-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమితోనే సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా అభ్యర్థి బోనెల విజయచంద్ర అన్నారు. -
హలో చీపురుపల్లి.. బై బై బొత్స
[ 10-05-2024]
ఈ ఎన్నికల్లో తెదేపా గెలుపు ఖాయమని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం సాయంత్రం చీపురుపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. -
అయిదేళ్లు చూశారు.. గొంతెత్తారు
[ 10-05-2024]
అయిదేళ్లు ప్రభుత్వం ఏదో చేస్తుందని నమ్మారు.. తమకిచ్చిన హామీలు నెరవేరుస్తుందని ఎదురుచూశారు. జగన్ ప్రభుత్వం ఏమీ చేయకపోవడంతో చివరకు వారంతా పోరాట మార్గాన్నే ఎంచుకున్నారు. -
విశాఖ ఎంపీగా భరత్ను గెలిపించండి
[ 10-05-2024]
విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గం తెదేపా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తన భర్త ఎం.శ్రీభరత్ను గెలిపించాలంటూ అతని భార్య, నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజశ్విని కోరారు. -
పిడుగుపాటుతో మహిళ మృతి
[ 10-05-2024]
వంగర మండలం బంగారువలస గ్రామానికి చెందిన బౌరౌతు సత్తెమ్మ (57) గురువారం సాయంత్రం వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో.. -
అన్నదాతకు ఇక సంక్షేమమే
[ 10-05-2024]
వ్యవసాయాన్ని బంగారం చేసేందుకు, రైతులను ఆదుకునేందుకు ఎన్టీయే కూటమి ముందుకు వచ్చింది. సేద్యానికి పూర్వవైభవం తెచ్చేందుకు నడుము బిగించింది. -
అతిరథుల మార్గం.. అడుగడుగునా అధ్వానం!
[ 10-05-2024]
మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో పాటు నెల్లిమర్ల, రాజాం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు నిత్యం రాకపోకలు సాగించేది విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారిపైనే. రాజాం, గరివిడి, గర్భాం, పాలకొండ వంటి పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార కేంద్రాలకు ఈ మార్గమే ఆధారం. -
సకల జనుల సంక్షేమానికే.. సూపర్-6
[ 10-05-2024]
‘వైకాపా అయిదేళ్ల పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది.. దాడులు, దౌర్జన్యాలతోనే కాలం వెల్లదీశారు.. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలకు ఇచ్చిన హామీలను ఎక్కడా అమలు చేయలేదు.. -
వద్దంటే వద్దు..
[ 10-05-2024]
ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవసరమైన స్లిప్పులను తీసుకునేందుకు భోజరాజపురం గ్రామస్థులు నిరాకరించారు. -
అప్పుల మావయ్య.. ఈ తిప్పలు చాలయ్యా
[ 10-05-2024]
ఆటో, మ్యాక్సీ క్యాబ్ చోదకులను ఆదుకుంటామని చెప్పిన వైకాపా ప్రభుత్వం వాహనమిత్ర పథకాన్ని ప్రవేశపెట్టి వారిని నిండా ముంచేసింది. -
వారిది అభివృద్ధి మాట.. వీరిది మద్యం బాట
[ 10-05-2024]
పోలింగ్కు మరో మూడు రోజులే ఉంది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రధాన పార్టీల నాయకులు ప్రచార జోరు పెంచారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సరికొత్త వ్యూహాలకు పదునుపెట్టారు. -
309 పోస్టల్ బ్యాలెట్ల నమోదు
[ 10-05-2024]
జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో భాగంగా గురువారం అన్ని నియోజకవర్గాలకు సంబంధించి 309 బ్యాలెట్లు నమోదయ్యాయి. ఇతర జిల్లాలకు సంబంధించి 42 మంది ఓట్లు నమోదయ్యాయి. -
ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి
[ 10-05-2024]
సాధారణ ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని అరకు పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టరు నిశాంత్కుమార్ ఆదేశించారు. -
అమాత్యా.. అయిదేళ్లలో ఏం చేశారు..?
[ 10-05-2024]
సాలూరు పట్టణంలో అధ్వాన పరిస్థితులు వైకాపా అయిదేళ్ల పాలనకు అద్దం పడుతున్నాయి. కొత్తగా రోడ్లు వేయలేదు.. సరికదా గుంతలు కూడా పూడ్చలేదు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
టాటా మోటార్స్ రయ్రయ్.. లాభం మూడింతలు