ఇదేం బాదుడు
విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని వైష్ణపు వీధిలో 998 చ.అ. ఓ నివాస భవనం (జీ+1) ఏఆర్వీ (వార్షిక అద్దె విలువ విధానం) అమల్లో ఉన్నప్పుడు 2020-21లో ఏడాదికి ఆస్తి పన్ను రూ.3792 ఉండేది.
మూలధన విలువ ఆధారిత విధానంలో ఆస్తి పన్ను వసూలు
ఏటా 15 శాతం పెంపుతో ప్రజలపై ఆర్థిక భారం
(న్యూస్టుడే, విజయనగరం పట్టణం, పాలకొండ)
విజయనగరం నగరపాలక సంస్థలో గృహాలు
విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని వైష్ణపు వీధిలో 998 చ.అ. ఓ నివాస భవనం (జీ+1) ఏఆర్వీ (వార్షిక అద్దె విలువ విధానం) అమల్లో ఉన్నప్పుడు 2020-21లో ఏడాదికి ఆస్తి పన్ను రూ.3792 ఉండేది. తర్వాత మూలధన విలువ ఆధారిత పన్ను మదింపు విధానం అమల్లోకి వచ్చిన తొలి ఏడాది 2021-22లో రూ.4360కి పెరిగింది. 2022-23లో రూ.5014, 2023-24లో రూ.5766 అయింది. ఏటా 15 శాతం చొప్పున సాట్యురేషన్ కాలం పూర్తయిన వరకు పెంచుతారు.
నగరంలోని ఉల్లివీధిలో 1301 చ.అ. ఓ వాణిజ్య భవనం (జీ+2) ఏఆర్వీ విధానంలో 2020-21లో ఏడాదికి రూ.1,19,000 ఆస్తిపన్ను చెల్లించేవారు. కొత్త విధానం అమల్లోకి వచ్చాక 2021-22లో రూ.1,30,784కు పెరిగింది. 2022-23లో రూ.1,33,400, 2023-24లో రూ.1,36,068 చెల్లించాల్సి వచ్చింది. సదరు భవనం సాట్యురేషన్ కాలం మొదటి ఏడాదిలోనే దాటడంతో ఏటా రెండు శాతం పన్ను పెంచుతున్నారు.
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పుర, నగరపాలక, నగర పంచాయతీల్లో కొత్త ఆస్తిపన్ను మదింపు విధానం వల్ల ఏటా ప్రజలపై పన్ను బాదుడు పడుతోంది. రిజిస్ట్రేషన్ శాఖ ఆస్తుల మార్కెట్ విలువ పెంచిన ప్రతిసారి మోపుతారు.
తెదేపా ప్రభుత్వ హయాంలో అద్దె ఆధారిత ఆస్తిపన్నుల విధింపు విధానం అమలులో ఉండేది. ఆ మేరకు ప్రభుత్వం రెండు, మూడు, అయిదేళ్లకు ఒకసారి పన్ను పెంచేది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూలధన విలువ ఆధారిత ఆస్తి పన్నుల విధింపు విధానం 2021-22 నుంచి అమల్లోకి తెచ్చింది. ఆస్తికి మార్కెట్ విలువను ప్రభుత్వం ఎప్పుడు పెంచితే అప్పుడు పన్నులు పెంచేలా నిర్ణయించింది. భవనం నిర్మించి పదేళ్లు పూర్తయితే 11వ ఏట నుంచి ఒక్కో శాతం చొప్పున తరుగుదల తీసి పన్ను విధిస్తారు. ఇందులో భాగంగా ఏటా మార్చిలో సవరిస్తారు.
ఈ మేరకు ఆమోదం
నూతన విధానం ద్వారా 10 నుంచి 15 శాతం మేర ఇంటి పన్ను పెంపుదలకు ప్రభుత్వం అప్పట్లో అన్ని పురపాలికల్లో అనుమతి ఇచ్చింది. విజయనగరం నగరపాలక సంస్థలో నివాస భవనాలకు 0.15 శాతం, వాణిజ్య భవనాలకు 0.3 శాతం మించకుండా కౌన్సిల్ ఆమోదం తీసుకున్నారు. దీని ప్రకారం పన్ను విధిస్తున్నారు. ఇది ఆయా పురపాలికలు, నగర పంచాయతీల పాలకవర్గాల తీర్మానం మేరకు వసూలు చేస్తారు. ప్రస్తుతం మళ్లీ పన్ను పరిధిలోకి రానివి గుర్తించి వార్డు సచివాలయాల వారీగా ఆన్లైన్ ప్రక్రియ చేస్తున్నారు. కమిషనరు లాగిన్లోని డ్యాష్బోర్డులో అన్ని రకాల అసెస్మెంట్ల వివరాలు పొందుపర్చినట్లు అధికారులు చెబుతున్నారు.
పెరుగుదల ఉంటుంది
- జి.నాగరాజు, ఆర్డీ, విశాఖ రీజియన్
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మూలధన విలువ ఆధారిత పన్ను విధింపు 2021-22 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ మేరకు వసూలు చేస్తున్నాం. పాత పన్ను మూలధన విలువతో సమానం అయ్యే వరకు ఏటా 15 శాతం చొప్పున పెంచుతున్నాం. ఆ తర్వాత నుంచి రెండు శాతం విధిస్తాం. పుర సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండటం వల్ల వసూలుకు ఆటంకం కలుగుతోంది. వడ్డీమాఫీని ప్రజలు వినియోగించుకుని పన్నుల చెల్లింపునకు ముందుకు రావాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
[ 28-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు పరిశ్రమలను సైతం మూసేసి చెరకు రైతుల నోట్లో మట్టికొట్టారు. పనిచేస్తున్న కార్మికులను పస్తుల్లో ఉంచారు. చెరకు పంట సాగు ప్రశ్నార్థకంగా మారేలా చేశారు. -
అందలంపై నీవు.. అంధకారంలో మేము
[ 28-04-2024]
గతంలో చీకటి రాజ్యాలుండేవి.. జగనన్న రాజ్యంలో మళ్లీ అదే పరిస్థితి పునరావృతమైంది. గత ఐదేళ్లలో వీధుల్లో గాఢాంధకారమే నెలకొంది.. వెలుగులిస్తామని చెప్పిన ఈ పరదాల వీరుడు ప్రతి వీధిలోనూ చీకట్లనే నింపారు.. -
రూపాయి రుణమివ్వని జగన్
[ 28-04-2024]
బీసీల్లో వివిధ వర్గాలకు చెందిన వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు గత ప్రభుత్వం కాపు, కుమ్మరి, రజక, నాయీ బ్రాహ్మణ, వాల్మీకి, బోయి తదితర కులాలతో పాటు ఈబీసీ, ఎంబీసీ(సంచార జాతులు), వైశ్య తదితర కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. -
కూటమి గెలిస్తే స్వర్ణాంధ్రప్రదేశ్
[ 28-04-2024]
రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే కూటమి గెలుపు అవసరమని తెదేపా విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. -
పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చర్యలు
[ 28-04-2024]
స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ఓటర్లను చైతన్య పరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. -
వైకాపాను ఛీకొట్టి.. ఓటుకు జైకొట్టి
[ 28-04-2024]
ఇళ్ల వద్ద ఓటు వినియోగించే వృద్ధులు, దివ్యాంగులను మాయ చేయాలని చూసిన వైకాపా నాయకుల వికృత ఆలోచనకు ఎదురు దెబ్బ తగిలింది. -
జిల్లా ఓటర్లు 7,83,440
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునే ఓటర్ల తుది జాబితా సిద్ధమైంది. -
టోల్ తీస్తారు
[ 28-04-2024]
విజయనగరం జిల్లాలో మూడు ప్రాంతాల్లో టోల్ ప్లాజాలు త్వరలో ప్రారంభించనున్నారు. -
కోలగట్ల ఎమ్మెల్యే అయితే భూములు మాయం
[ 28-04-2024]
విజయనగరంలో కోలగట్ల వీరభద్రస్వామి మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికైతే ప్రభుత్వ భూములతో పాటు నగరవాసుల భూములు కూడా మాయమవుతాయని వైకాపా నేత కాళ్ల గౌరీశంకర్ ఆరోపించారు. -
ఇది జగనన్న చీకటి రాజ్యం..!!
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో ప్రజలకు అంధకారమే మిగిలింది. ఎక్కడ చూసినా వీధి దీపాల నిర్వహణ అధ్వానంగా ఉంది. -
సర్కార్ తెచ్చిన నీటి కరవు
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల లోపం.. ప్రజల పాలిట శాపంగా మారింది. నాలుగు రోజులకోసారి తాగునీరు సరఫరా చేయడంతో బొబ్బిలి పట్టణ వాసుల గొంతులు ఎండిపోతున్నాయి. -
పెద్దపల్లికి పెద్దగెడ్డ నీరు తెస్తా
[ 28-04-2024]
పెద్దపల్లిలో చెరువుకు వెళ్లే దారిలో వంతెన నిర్మిస్తామని, పెద్దగెడ్డ నీరు తీసుకువచ్చి రైతుల కాళ్లు కడుగుతానని కూటమి అభ్యర్థి బేబినాయన అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్