logo

తెదేపాలోకి వైకాపా ఎంపీటీసీ సభ్యులు

కొత్తవలసకు చెందిన పలువురు వైకాపా ఎంపీటీసీ సభ్యులు, ఆ పార్టీ నాయకులు తెదేపాలో చేరారు. శృంగవరపుకోటలో ప్రజాగళం సభకు వచ్చి సిరికి రిసార్ట్స్‌లో... 

Updated : 24 Apr 2024 05:53 IST

లలితకుమారి, సుధారాజుతో పార్టీలో చేరిన ఎంపీటీసీ సభ్యులు, నాయకులు

కొత్తవలస, న్యూస్‌టుడే: కొత్తవలసకు చెందిన పలువురు వైకాపా ఎంపీటీసీ సభ్యులు, ఆ పార్టీ నాయకులు తెదేపాలో చేరారు. శృంగవరపుకోటలో ప్రజాగళం సభకు వచ్చి సిరికి రిసార్ట్స్‌లో బసచేసిన తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో కె.కృష్ణమూర్తి- కొత్తవలస-3, వి.సూర్యనారాయణశాస్త్రి(బాబి)-క్తొతవలస-5, అప్పన్నదొరపాలెం ఎంపీటీసీ సభ్యురాలు యు.గురూజీ భర్త రాంబాబు, కొత్తవలస-6 ఎంపీటీసీ సభ్యురాలు పి.లక్ష్మి కుమారుడు పాత్రుడు, రెల్లి గ్రామానికి చెందిన కొత్తవలస పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ వి.అప్పారావు, విశాఖ పార్లమెంట్‌ వైకాపా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పి.శ్రీను, గిరిజన సంఘం నాయకుడు యు.నరసింగరావు, రామమూర్తి (దాసరివానిపాలెం) తెదేపాలో చేరారు. వీరికి చంద్రబాబు తెదేపా కండువాలు వేశారు. మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఎస్‌ కోట మండల పరిషత్తు వైస్‌ ఎంపీపీ ఇందుకూరి సుధారాజు ఆధ్వర్యంలో వీరంతా తెదేపాలో చేరినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యుడు బాబీ తెదేపా అధినేత చంద్రబాబును శాలువాతో సత్కరించారు.    

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని