అవగాహనతో సైబర్ నేరాల నియంత్రణ
నిరంతర అధ్యయనం, అవగాహనతోనే సైబర్ నేరాల నియంత్రణ, సమగ్ర దర్యాప్తు సాధ్యమవుతాయని అదనపు డీజీపీ(ట్రైనింగ్స్) ఎన్.సంజయ్ అన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు ఒంగోలులోని పోలీసు శిక్షణ కళాశాల(పీటీసీ)లో
మాట్లాడుతున్న ఎస్పీ మలికా గార్గ్..
చిత్రంలో పీటీసీ ప్రిన్సిపల్ దామోదర్ తదితరులు
ఒంగోలు నేరవిభాగం: నిరంతర అధ్యయనం, అవగాహనతోనే సైబర్ నేరాల నియంత్రణ, సమగ్ర దర్యాప్తు సాధ్యమవుతాయని అదనపు డీజీపీ(ట్రైనింగ్స్) ఎన్.సంజయ్ అన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు ఒంగోలులోని పోలీసు శిక్షణ కళాశాల(పీటీసీ)లో సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ సైబర్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఫోరెన్సిక్(సీఆర్సీఐడీఎఫ్) ఆధ్వర్యంలో రెండు రోజుల కార్యశాల ఏర్పాటు చేశారు. తొలుత అదనపు డీజీపీ(ట్రైనింగ్స్) ఎన్.సంజయ్, టెక్నికల్ సర్వీసెస్ డీఐజీ జి.పాలరాజు వీక్షణ ద్వారా అమరావతి నుంచి ఈ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడి, మరింత సమర్థ దర్యాప్తు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన అధికారులకు శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. దిల్లీకి చెందిన సీఆర్సీఐడీఎఫ్ సంస్థతో ఒప్పందం కుదర్చుకుని ఈ కార్యశాల నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో అతిత్వరలో అత్యాధునిక సైబర్ ల్యాబ్ ఏర్పాటు కానుందని, ప్రతి జిల్లాకు సైబర్ టూల్స్ను అందుబాటులోకి తెస్తామని వివరించారు. ఎస్పీ మలికా గార్గ్ మాట్లాడుతూ.. సైబర్ నేరాలు రోజు రోజుకీ కొత్తరూపు సంతరించుకుంటున్నాయని అన్నారు. ప్రభుత్వ పథకాలు, ఆధార్ కార్డులు, కొవిడ్ వ్యాక్సిన్ పేరుతో, ఓటీపీ, కేవైసీ, ఆన్లైన్ మోసాలు చోటుచేసుకుంటున్నాయని.. మహిళలపై వేధింపులు పెరిగాయన్నారు. శిక్షణతో సైబర్ నేరాలకు ముకుతాడు వేయొచ్చని చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని 13 జిల్లాలు, కమిషనరేట్ల నుంచి 115 మంది అధికారులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. పీటీసీ ప్రిన్సిపల్ ఎ.ఆర్.దామోదర్, వైస్ ప్రిన్సిపల్ కె.జె.ఎం.చిరంజీవి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు సిరి.. నేడు ఉరి
[ 10-05-2024]
వ్యవసాయానికి గుండెకాయలాంటి సాగునీటి రంగంపై ముఖ్యమంత్రి జగన్ అంతులేని నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా జిల్లాలోని పచ్చని పొలాలు బీళ్లుగా మారాయి. కొత్త ప్రాజెక్టులకు చిల్లిగవ్వ మంజూరు చేయకపోవడం..చెరువులు, కాలువల మరమ్మతులు విస్మరించడంతో అన్నదాత రోడ్డున పడ్డాడు. -
విష కౌగిలి.. ఊపిరే బిగపట్టి
[ 10-05-2024]
జగన్ అయిదేళ్ల రాజ్యంలో ఊరూరా వైకాపా నాయకుల అసుర గణం తయారైంది. అభివృద్ధి అనే మాటే మరిచింది. అరాచక పర్వాన్ని యథేచ్ఛగా కొనసాగించింది. ప్రత్యర్థులపై దాడులు చేయడమే పనిగా పెట్టుకుంది. -
ఫ్యాన్ మీట నొక్కాలంటే వణుకు
[ 10-05-2024]
అధికారంలోకి వచ్చిన తర్వాత జనం ఇక పనేముందన్నట్లు వ్యవహరించారు. పాదయాత్ర వేళ ఇచ్చిన హామీకి నిలువునా పాతరేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే సర్దుబాటు ఛార్జీల పేరుతో బాదుడు ప్రారంభించారు. -
తెదేపా గెలుపుతోనే దర్శి వికాసం
[ 10-05-2024]
దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళతామని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఇది సాధ్యపడుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పష్టంచేశారు. -
మర్యాదగా రాజీనామా చేయండి
[ 10-05-2024]
‘మర్యాదగా రాజీనామా చేయండి. రూ.5 వేలు నగదు బహుమతిగా పొందండి. ఇదే చివరి మీటింగ్. ఇన్ని రోజులు పార్టీ కోసం చేసింది ఒక లెక్క. రానున్న మూడు రోజులు చేసేది ఒక లెక్క. మీరు క్లస్టర్ స్థాయిలో తిరిగి, ఓటర్లకు తాయిలాలు పంచాలి. -
ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
[ 10-05-2024]
ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
పాలకుడి దెబ్బకు గ్రానైట్ పరిశ్రమ ఖాళీ
[ 10-05-2024]
చీమకుర్తి గ్రానైట్కు విశ్వవ్యాప్త ఖ్యాతి ఉంది. దీనికి సంబంధించిన వందలాది యూనిట్లు చీమకుర్తి, గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్, బూదవాడ, మర్రిచెట్లపాలెంలో నెలకొల్పారు. -
పెట్టెలో పోస్టల్ ఓటు
[ 10-05-2024]
పొరుగు జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు ఓటుహక్కు వినియోగించుకునేలా ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ఒంగోలు కేంద్రీయ విద్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సాగింది. ప్రక్రియ ముగియడంతో సదరు బ్యాలెట్ పెట్టెలను జిల్లాల వారీగా విభజిస్తున్నారు. -
చెరువుల అభివృద్ధి ఒట్టి నీటి మాటే
[ 10-05-2024]
పొదిలి పెద్దచెరువు లోతట్టు విస్తీర్ణం 701.32 ఎకరాలు. దీని క్రింద అధికారికంగా 811 ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి. సుమారు 150 మంది వరకు రైతులు ఉన్నారు. పొదిలి చిన్నచెరువు విస్తీర్ణం 101 ఎకరాలు. -
రాళ్లవాగును అటకెక్కించావు.. జగనూ
[ 10-05-2024]
పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్లో భాగంగా అర్థవీడు మండలం అంకభూపాలెం సమీపంలో సమారు రూ.22 కోట్ల వ్యయంతో రాళ్లవాగుపై ఆనకట్ట జలాశయం ఏర్పాటు చేశారు. -
సమష్టిగా పోరాటం చేయాలి
[ 10-05-2024]
తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలకు సమష్టిగా పోరాటం చేయాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్బాబు కోరారు. స్థానిక లహరి సమావేశమందిరంలో గురువారం -
తెదేపాలో చేరిన వైకాపా సర్పంచి
[ 10-05-2024]
పులిపాడుతండా సర్పంచి జానవత్ లక్షీబాయ్ వైకాపాను వీడి తెదేపాలో చేరారు. దర్శి అభ్యర్ధి గొట్టిపాటి లక్ష్మి భర్త లలిత్సాగర్ సమక్షంలో పార్టీ తీర్థం తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
-
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..