ఉద్యోగాల భర్తీ కోరుతూ త్వరలో సీఎం నివాసం ముట్టడి
అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి యువతను జగన్మోహన్రెడ్డి మోసం చేశారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా యువత ఆధ్వర్యంలో
ప్రసంగిస్తున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు చినబాబు.. వేదికపై తెదేపా నాయకులు దామచర్ల జనార్దన్,
నూకసాని బాలాజీ, పమిడి రమేష్, దామచర్ల సత్యనారాయణ తదితరులు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి యువతను జగన్మోహన్రెడ్డి మోసం చేశారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా యువత ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి త్వరలో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నివాసం ముట్టడించనున్నట్లు హెచ్చరించారు. ‘జాబ్ ఎక్కడ జగన్?’ అనే అంశంపై ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, రాజంపేట, చిత్తూరు జిల్లాల తెలుగు యువత సమావేశం నగరంలోని గుంటూరు రోడ్డులో ఉన్న పీఏజీ కల్యాణ మండపంలో శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చినబాబు మాట్లాడుతూ.. యువతకు 40 శాతం టిక్కెట్లు ఇచ్చేందుకు పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి లేని కారణంగా యువత ఇతర రాష్ట్రాలకు వలస పోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. సమావేశంలో తెదేపా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి పమిడి రమేష్, పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ, పార్టీ నాయకులు రవి నాయుడు, ముత్తన శ్రీనివాసులు, రామా గోపి, పూసపాటి జాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుగుబాటు మొదలైంది.. ఒక్క ఉద్యోగి కూడా జగన్కు ఓటు వేయలేదు: చంద్రబాబు
[ 10-05-2024]
అవినీతి, దోపిడీ, కబ్జాలు, అరాచకాలకు ముగింపు పలకాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
నాడు సిరి.. నేడు ఉరి
[ 10-05-2024]
వ్యవసాయానికి గుండెకాయలాంటి సాగునీటి రంగంపై ముఖ్యమంత్రి జగన్ అంతులేని నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా జిల్లాలోని పచ్చని పొలాలు బీళ్లుగా మారాయి. కొత్త ప్రాజెక్టులకు చిల్లిగవ్వ మంజూరు చేయకపోవడం..చెరువులు, కాలువల మరమ్మతులు విస్మరించడంతో అన్నదాత రోడ్డున పడ్డాడు. -
విష కౌగిలి.. ఊపిరే బిగపట్టి
[ 10-05-2024]
జగన్ అయిదేళ్ల రాజ్యంలో ఊరూరా వైకాపా నాయకుల అసుర గణం తయారైంది. అభివృద్ధి అనే మాటే మరిచింది. అరాచక పర్వాన్ని యథేచ్ఛగా కొనసాగించింది. ప్రత్యర్థులపై దాడులు చేయడమే పనిగా పెట్టుకుంది. -
ఫ్యాన్ మీట నొక్కాలంటే వణుకు
[ 10-05-2024]
అధికారంలోకి వచ్చిన తర్వాత జనం ఇక పనేముందన్నట్లు వ్యవహరించారు. పాదయాత్ర వేళ ఇచ్చిన హామీకి నిలువునా పాతరేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే సర్దుబాటు ఛార్జీల పేరుతో బాదుడు ప్రారంభించారు. -
తెదేపా గెలుపుతోనే దర్శి వికాసం
[ 10-05-2024]
దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళతామని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఇది సాధ్యపడుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పష్టంచేశారు. -
మర్యాదగా రాజీనామా చేయండి
[ 10-05-2024]
‘మర్యాదగా రాజీనామా చేయండి. రూ.5 వేలు నగదు బహుమతిగా పొందండి. ఇదే చివరి మీటింగ్. ఇన్ని రోజులు పార్టీ కోసం చేసింది ఒక లెక్క. రానున్న మూడు రోజులు చేసేది ఒక లెక్క. మీరు క్లస్టర్ స్థాయిలో తిరిగి, ఓటర్లకు తాయిలాలు పంచాలి. -
ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
[ 10-05-2024]
ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
పాలకుడి దెబ్బకు గ్రానైట్ పరిశ్రమ ఖాళీ
[ 10-05-2024]
చీమకుర్తి గ్రానైట్కు విశ్వవ్యాప్త ఖ్యాతి ఉంది. దీనికి సంబంధించిన వందలాది యూనిట్లు చీమకుర్తి, గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్, బూదవాడ, మర్రిచెట్లపాలెంలో నెలకొల్పారు. -
పెట్టెలో పోస్టల్ ఓటు
[ 10-05-2024]
పొరుగు జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు ఓటుహక్కు వినియోగించుకునేలా ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ఒంగోలు కేంద్రీయ విద్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సాగింది. ప్రక్రియ ముగియడంతో సదరు బ్యాలెట్ పెట్టెలను జిల్లాల వారీగా విభజిస్తున్నారు. -
చెరువుల అభివృద్ధి ఒట్టి నీటి మాటే
[ 10-05-2024]
పొదిలి పెద్దచెరువు లోతట్టు విస్తీర్ణం 701.32 ఎకరాలు. దీని క్రింద అధికారికంగా 811 ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి. సుమారు 150 మంది వరకు రైతులు ఉన్నారు. పొదిలి చిన్నచెరువు విస్తీర్ణం 101 ఎకరాలు. -
రాళ్లవాగును అటకెక్కించావు.. జగనూ
[ 10-05-2024]
పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్లో భాగంగా అర్థవీడు మండలం అంకభూపాలెం సమీపంలో సమారు రూ.22 కోట్ల వ్యయంతో రాళ్లవాగుపై ఆనకట్ట జలాశయం ఏర్పాటు చేశారు. -
సమష్టిగా పోరాటం చేయాలి
[ 10-05-2024]
తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలకు సమష్టిగా పోరాటం చేయాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్బాబు కోరారు. స్థానిక లహరి సమావేశమందిరంలో గురువారం -
తెదేపాలో చేరిన వైకాపా సర్పంచి
[ 10-05-2024]
పులిపాడుతండా సర్పంచి జానవత్ లక్షీబాయ్ వైకాపాను వీడి తెదేపాలో చేరారు. దర్శి అభ్యర్ధి గొట్టిపాటి లక్ష్మి భర్త లలిత్సాగర్ సమక్షంలో పార్టీ తీర్థం తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రాణించిన బౌలర్లు.. చెన్నైపై గుజరాత్ సూపర్ విక్టరీ
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
కేజ్రీవాల్కు తల్లిదండ్రుల స్వాగతం.. వారిని చూసి సీఎం భావోద్వేగం
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!