logo

ఉద్యోగాల భర్తీ కోరుతూ త్వరలో సీఎం నివాసం ముట్టడి

అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి యువతను జగన్‌మోహన్‌రెడ్డి మోసం చేశారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా యువత ఆధ్వర్యంలో

Published : 21 May 2022 06:30 IST


ప్రసంగిస్తున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు చినబాబు.. వేదికపై తెదేపా నాయకులు దామచర్ల జనార్దన్,
నూకసాని బాలాజీ, పమిడి రమేష్, దామచర్ల సత్యనారాయణ తదితరులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి యువతను జగన్‌మోహన్‌రెడ్డి మోసం చేశారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా యువత ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి త్వరలో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నివాసం ముట్టడించనున్నట్లు హెచ్చరించారు. ‘జాబ్‌ ఎక్కడ జగన్‌?’ అనే అంశంపై ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, రాజంపేట, చిత్తూరు జిల్లాల తెలుగు యువత సమావేశం నగరంలోని గుంటూరు రోడ్డులో ఉన్న పీఏజీ కల్యాణ మండపంలో శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చినబాబు మాట్లాడుతూ.. యువతకు 40 శాతం టిక్కెట్లు ఇచ్చేందుకు పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి లేని కారణంగా యువత ఇతర రాష్ట్రాలకు వలస పోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. సమావేశంలో తెదేపా ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పమిడి రమేష్, పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ, పార్టీ నాయకులు రవి నాయుడు, ముత్తన శ్రీనివాసులు, రామా గోపి, పూసపాటి జాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని