ముగ్గురు దొంగల అరెస్టు
ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల బ్యాగులు అపహరిస్తున్న దంపతులతో పాటు... ద్విచక్రవాహన చోరీలకు పాల్పడుతున్న మరో వ్యక్తిని రెండో పట్టణ పోలీసులు మంగళవారం
రూ.7.50 లక్షల సొత్తు స్వాధీనం
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ నాగరాజు, సీఐ రాఘవరావు
ఒంగోలు నేర విభాగం, న్యూస్టుడే: ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల బ్యాగులు అపహరిస్తున్న దంపతులతో పాటు... ద్విచక్రవాహన చోరీలకు పాల్పడుతున్న మరో వ్యక్తిని రెండో పట్టణ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.7.50 లక్షల విలువైన... 15 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.45 వేల నగదు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు ఆ వివరాలు వెల్లడించారు. జిల్లాలో చోరీలు పెరిగిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ మలికాగార్గ్ ఆదేశాల మేరకు ఒంగోలు రెండో పట్టణ సీఐ ఎన్.రాఘవరావు ఆధ్వర్యంలో... ఒకటో పట్టణ, కొత్తపట్నం ఎస్సైలు నాగేశ్వరరావు, కె.మధుసూదన్లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పాత నేరస్థుల కదలికలపై నిఘా పెట్టిన అధికారులు... అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురానికి చెందిన భార్యాభర్తలు కట్టా జ్యోతి, రమేష్ కొండపిలో ఉంటూ బస్టాండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఆత్రేయపురానికే చెందిన తాడిపర్తి రవి అలియాస్ శ్రీను అనే యువకుడు పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించి నిఘా ఉంచారు. పక్కా సమాచారంతో ఒంగోలు - కొత్తపట్నం రోడ్డులోని నల్లవాగు వద్ద వారిని అరెస్టు చేసి... చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విషయంలో కీలకంగా వ్యవహరించిన ఏఎస్సై బాలాంజనేయులు (బాల), హెడ్ కానిస్టేబుల్ జి.అంకమ్మరావు, కానిస్టేబుళ్లు అంజిబాబు, చాంద్బాషాలను డీఎస్పీ అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ చేతిలో జనం బికారులు.. వైకాపా భక్షణ చట్టంపై జనాగ్రహం
[ 05-05-2024]
జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం (టైటిలింగ్ యాక్ట్-2022)పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
కూటమిదే పక్కా విజయం
[ 05-05-2024]
‘సభకు వచ్చిన జనం చూపుతున్న ఉత్సాహం.. యువత, మహిళల కేరింతలు చూస్తుంటే దర్శిలో మన విజయం పక్కా అని తేలిపోయింది. ఈ సారి కచ్చితంగా తెదేపా జెండా ఎగరేస్తాం. -
పోలింగ్కు ఇదేం సన్నద్ధత!
[ 05-05-2024]
తపాలా ఓటింగ్ మొదటి రోజైన శనివారం జిల్లాలో పలు చోట్ల అధికారులు నిర్లిప్తంగా వ్యవహరించారు. ఒంగోలు డీఆర్ఆర్ఎం ఉన్నత పాఠశాలలోని సగం కేంద్రాల్లో గెజిటెడ్ అధికారులు అందుబాటులో లేరు. -
జగన్ రాసిన మరణ శాసనం
[ 05-05-2024]
అయిదేళ్ల క్రితం వచ్చిన ఆ పాద యాత్రికుడు అక్కడి వారిపై అమృతం కురిపించారు..జీవచ్ఛవాల్లా ఉన్న కనిగిరివాసులకు ఊరడించారు..ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమికొడతానన్నారు. -
11న ఒంగోలుకు చంద్రబాబు
[ 05-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 11న తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంగోలు రానున్నారు. -
తెదేపా గూటికి వైకాపా సర్పంచి
[ 05-05-2024]
పొన్నలూరు మండలంలో సైకిల్ జోరు మీదుంది. మండలంలోని కె.అగ్రహారం గ్రామ సర్పంచి షేక్ చిన్న మస్తాన్ శుక్రవారం రాత్రి దామచర్ల సత్య సమక్షంలో తెదేపాలో చేరారు. -
పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలి
[ 05-05-2024]
పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
కొత్తపట్నంలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన
[ 05-05-2024]
సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కొత్తపట్నం మండలం రెడ్డిపాలెం, కె.పల్లెపాలెం, ఈతముక్కలలోని పోలింగ్ కేంద్రాలను శనివారం జిల్లా పోలీసు పరిశీలకులు హసిబ్ ఉర్ రెహమాన్ పరిశీలించారు. -
చట్టం ముసుగులో దోపిడీకి జగన్ కుట్ర
[ 05-05-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఆస్తులు, భూములకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంతో పాటు జిల్లాలోని మార్కాపురం పశ్చిమ ప్రాంతంలో రైతులకు చెందిన భూములు, పట్టా భూములను పట్టపగలే ఆక్రమణ చేసుకోని కబ్జా చేస్తున్న, చేసిన ఉదంతాలు అనేకం ఉన్నాయి.