రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఒంగోలు వాసుల దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగింది.
ప్రమాదానికి గురైన కారు
కావలి గ్రామీణం, న్యూస్టుడే: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగింది. గ్రామీణ ఎస్సై వెంకట్రావు తెలిపిన వివరాల మేరకు... ప్రకాశం జిల్లా ఒంగోలు నిర్మల్ నగర్కు చెందిన ప్రవీణ్ తమిళనాడులో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. భార్య ప్రియాంక(32), అత్త భారతి(52) కుమారుడు నందా తమిళనాడు నుంచి ఒంగోలుకు కారులో వస్తున్నారు. కావలి సమీపంలో జాతీయ రహదారిపై కారు టైరు పంక్చరవడంతో కారు డివైడర్ను ఢీకొట్టి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరికి స్వల్ప గాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. సంఘటన స్థలాన్ని గ్రామీణ సీఐ రాజేష్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Japan: ఒకే రన్వేపైకి రెండు విమానాలు.. ఒకదాన్నొకటి తాకి..
-
Politics News
ChandraBabu: అక్రమాలను ఆడ్డుకోండి: సీఎం జగన్కు చంద్రబాబు లేఖ
-
Sports News
Team India Slip Cordon: టీమ్ ఇండియా స్లిప్ కార్డన్లో ఎవరు బెస్ట్.. ChatGPT ఏం చెప్పింది?
-
India News
Uttarakhand: సెలవులో ఉన్న టీచర్లకు రిటైర్మెంట్..! ఉత్తరాఖండ్ కీలక నిర్ణయం
-
World News
Trump: ప్రైవేట్ పార్టీలో దేశ రహస్యాలను లీక్ చేసిన ట్రంప్!
-
Politics News
Nellore: హీటెక్కిన రాజకీయాలు.. ఆనంతో నెల్లూరు తెదేపా నేతల భేటీ